JANASENA Posted March 30, 2017 Report Posted March 30, 2017 కడప: ప్రతి వాహనానికి సంఖ్యా పలకం ఉంటుంది. వాటిపై ఆయా రాష్ట్రాలు, జిల్లాలను బట్టి అక్షరాలు మారుతుంటాయి. కాని ప్రతి ఆర్టీసీ బస్సు సంఖ్య పలకంపై జెడ్ అనే అక్షరం తప్పక ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుందో తెలుసా.. హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 82 ఏళ్ల కిందట నిజాం స్టేట్ బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఆ సమయంలో నిజాం రూ.3,93,000 వెచ్చించి 27 బస్సులను కొనుగోలు చేసి 1958లో ఏపీఎస్ఆర్టీసీ వారికి ఇచ్చేశారు. ఆ సందర్భంగా ప్రతి బస్సుపై జెడ్ అనే అక్షరం రాయాలని నిజాం ఆర్టీసీ వారితో ఒప్పందం చేసుకున్నారు. ఎందుకంటే నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మాతృమూర్తి పేరు జొహ్రాబేగం. తల్లిపై ప్రేమతో ఆమె జ్ఞాపకార్థం జెడ్ అక్షరం రాసేలా ఆయన షరతు పెట్టారు. అందుకు అనుగుణంగా ఇప్పటికీ ప్రతి బస్సుపై జెడ్ అని రాస్తున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.