yaman Posted May 2, 2017 Report Posted May 2, 2017 హిందువుల జననాలు తగ్గుతాయ్ భారతీయుల్లో సంతానలేమి పెరుగుతోంది 2055-60 మధ్య ముస్లింల జననాలు ఎక్కువ 2075కి క్రైస్తవుల సంఖ్యనూ మించిపోతారు వెల్లడించిన ‘ప్యూ’ అధ్యయనం వాషింగ్టన్, ఏప్రిల్ 6: భారతీయుల్లో సంతాన సామర్థ్యం తగ్గడం వల్ల 2055-60 మధ్య హిందువుల జననాలలో తగ్గుదల నమోదవుతుందని ప్యూ రీసెర్చ్ వెల్లడించింది. హిందూ జనాభాలో 94 శాతం మంది భారతలోనే ఉన్నారని.. ఇక్కడ జననాలు తగ్గడం వల్ల వారి జనాభా వృద్ధి కూడా కాస్త నెమ్మదిస్తుందని వివరించింది. మరో రెండు దశాబ్దాలలో ముస్లింల జననాల సంఖ్య.. క్రైస్తవుల జననాలను కూడా మించిపోతుందని తెలిపింది. ఈ తీరుతో 2075కి ప్రపంచంలోనే అత్యధిక జనాభా ముస్లింలదే అవుతుందని వివరించింది. 2015తో పోల్చితే 2060కి ముస్లిం, క్రైస్తవ తల్లులు ఎక్కువ మంది పిల్లలను కంటారని.. వీరిలో ముస్లింల జనన రేటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇంకా చెప్పాలంటే 2035కే ముస్లింల జననాల సంఖ్య క్రైస్తవుల జననాల సంఖ్యను దాటిపోతుందనీ వివరించింది. కాగా 2015-2060 సంవత్సరాల మధ్య అన్ని ప్రధాన మతాల జననాల రేటులో కాస్త తగ్గుదల నమోదవుతుందని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 62 శాతం మంది ముస్లింలు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే అంటే.. ఇండోనేసియా, భారత, పాక్, బంగ్లాదేశ్, ఇరాన్, ఇరాక్ తదితర దేశాల్లోనే ఉన్నారు. హిందువుల జననాలు 2010-15తో పోల్చితే 2055-60కి 3.3 కోట్ల మంది తక్కువ కారణం భారతీయుల్లో సంతానలేమి పెరగడం.. 2010-15లో 10.9 కోట్ల మంది జన్మించారు ముస్లింల జననాలు 2010-15 మధ్య 15 కోట్లు పెరిగారు 2015-60 మధ్య 70ు వృద్ధి చెందుతారు క్రైస్తవులు 34 శాతం వృద్ధి చెందుతారు 2070 నాటికి ఇరు మతాల జనాభా సమానం క్రైస్తవుల జననాలు 2010-15 మధ్య 22.3 కోట్లు ఇది ముస్లింలకన్నా కోటి ఎక్కువ 2055-60 నాటికి ముస్లిం జననాలు 23.2 కోట్లు క్రైస్తవుల జననాలు 22.6 కోట్లు తేడా.. 60 లక్షల జననాలు Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.