Sidhu...Sidhaarth Roy Posted May 18, 2017 Report Posted May 18, 2017 ఇంటర్నెట్ డెస్క్: దగ్గుబాటి రానా కథానాయకుడిగా రూపొందిన ‘ఘాజీ’ ద్వారా తన తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు యువ దర్శకుడు సంకల్ప్రెడ్డి. ఇందులోని కథాకథనాలు, టేకింగ్, గ్రాఫిక్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. తాజాగా ఆయన తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో వరుణ్తేజ్ కథానాయకుడని తెలుస్తోంది. సైన్స్ఫిక్షన్ కథాంశంతో రూపొందే ఈ సినిమాలో గ్రాఫిక్స్కు మంచి ప్రాధాన్యత ఉందని అంటున్నారు. సినిమా వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు వరుణ్తేజ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫిదా’, కొత్త దర్శకుడు వెంకీ అట్లూరితో మరో సినిమాలోనూ నటిస్తున్నారు. వీటి తర్వాత సంకల్ప్ చిత్రం సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.