BaabuBangaram Posted June 12, 2017 Report Posted June 12, 2017 విజయవాడ: రవాణా శాఖ పనితీరుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రానికి చెందిన 900 బస్సుల రిజిస్ట్రేషన్లను అరుణాచల్ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తే రవాణాశాఖ ఉన్నతాధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. రవాణాశాఖ మొత్తం అవినీతిమయంగా మారిందంటూ ఘాటుగా విమర్శించారు. ఒక ఎంపీ లేఖను గౌరవించి అరుణాచల్ప్రదేశ్ అధికారులు, ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ స్పందిస్తే రాష్ట్రంలో అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజా జీవితంలో మచ్చ ఉండకూడదన్న ఉద్దేశంతోనే తాను బస్సుల వ్యాపారాన్ని విడిచిపెట్టానని స్పష్టం చేశారు. గతంలో తాను తిప్పిన బస్సుల్లో ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసినవి లేవన్నారు. నిబంధనల ప్రకారం బస్సులు నడుపుతున్న యజమానులంతా రవాణాశాఖ అధికారుల తీరుతో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. eedu revenge theerchukuntunnadu ga.... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.