Jump to content

AP water grid project


Recommended Posts

Posted

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి కోసం రూ.8వేల కోట్లతో వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంచినీటి సమస్య అధికంగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఏడాది కాలంలో వాటర్‌గ్రిడ్‌ పూర్తయ్యేలా ప్రణాళికలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

 

10ap-main1b.jpg

Posted

image lo 50k crores vundi, nuvvu raasina matter lo emo 8k crores vundi endi?

Posted

Good project.

Especially districts like, Kurnool,Kadapa,Ongole,Nellore,Chittor,Anantapur desperately needs such projects.

Posted
1 minute ago, dalapathi said:

image lo 50k crores vundi, nuvvu raasina matter lo emo 8k crores vundi endi?

simple. aak is pak , pak is aak

Posted
1 minute ago, dalapathi said:

image lo 50k crores vundi, nuvvu raasina matter lo emo 8k crores vundi endi?

immediate ga 8k petti desperate ga vunna places ki water ivadam, one year lo complete cheyadam is present target..

2044 varaku 50k crores invest chesi, each and every household ki purified and safe drinking water ivadam long term goal..

 

Posted
2 minutes ago, dalapathi said:

image lo 50k crores vundi, nuvvu raasina matter lo emo 8k crores vundi endi?

Water corporation ki 50k cr

దక్షిణ భారతదేశంలో తాగునీటిపై ఇదే మొదటి కార్పొరేషన్‌ అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టు పనులు ప్రారంభించాక రెండేళ్లలో పూర్తయ్యేలా ప్రతిపాదిస్తున్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా, పట్టణ ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగాలు ప్రస్తుతం రోజూ రాష్ట్రంలో 4 టీఎంసీల నీటిని సరఫరా చేస్తున్నాయి.

జలామృతాన్ని ఒడిసిపట్టి ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించే మహా ప్రయత్నం ఆంధ్రప్రదేశ్‌లో జరగబోతోంది. రెండున్నర దశాబ్దాలకుపైగా నీటి సమస్యే లేకుండా చేసే బృహత్తర ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టబోతోంది. రూ.50వేల కోట్లకుపైగా ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో అందరికీ తాగునీరు అందుతుంది. 2044 వరకూ రాష్ట్రంలో సమస్యే ఉండదు. తాగునీటి కోసం కొత్తగా ఎలాంటి పనులూ చేపట్టే అవసరం ఉండదు. కేవలం నిర్వహణ బాధ్యత చూస్తే చాలు. ఇదంతా తాగునీటి కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసే కార్పోరేషన్‌ద్వారా జరుగుతుంది. 

232 టీఎంసీల వార్షిక నీటి నిల్వ సామర్ధ్యం
రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించేందుకు 300 శతకోటి ఘనపుటడుగుల (టీఎంసీ) వార్షిక సామర్ధ్యం కలిగిన తాగునీటి సంస్థ (డ్రింకింగ్‌ వాటర్‌ కార్పొరేషన్‌) ఏర్పాటు కోస¾ం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఏడాది పొడవునా ఇదే టీఎంసీల సామర్ధ్యాన్ని కొనసాగించడంవల్ల తాగునీటి సమస్య నుంచి రాష్ట్రం బయటపడనుంది. 2014లో 232 టీఎంసీల వార్షిక నీటి నిల్వ సామర్ధ్యంతో ఒక ప్రాజెక్టును రూపొందించారు. రెండేళ్లలో పెరిగిన జనాభా, ప్రజల అవసరాల దృష్ట్యా ప్రస్తుతం 300 టీఎంసీలు తప్పనిసరని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా, పట్టణ ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగాల వార్షిక నీటి నిల్వ సామర్ధ్యం 13 నుంచి 15 టీఎంసీలు. ఈ సామర్ధ్యాన్ని పెంచాలన్న ప్రతిపాదనలు గత 20ఏళ్లుగా ఉన్నా నీటి లభ్యత అంతంత మాత్రం కావడంతో ప్రభుత్వ ఆమోదానికి నోచుకోలేదు. దీనివల్ల వేసవి ప్రారంభం నుంచే రాష్ట్రంలో తాగునీటి సమస్య మొదలవుతోంది. వర్షాభావం, భూగర్భ జలాలు, జలాశయాలు అడుగంటిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ ఏడాది రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నాలుగైదు జిల్లాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. వర్షాలు ఇప్పుడిప్పుడే మొదలైనా ఇప్పటికీ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే క్రమంలో ప్రభుత్వం రాష్ట్రంలో తాగునీటి సంస్థ ఏర్పాటు కోసం కొద్దికాలంగా యత్నిస్తోంది. ఈనెల 15న నిర్వహించే మంత్రివర్గ సమావేశంలోగా ఇందుకోసం మార్గదర్శకాలు సిద్ధం చేసే పనిలో అధికార వర్గాలున్నాయి. రాష్ట్రంలో తాగునీటి సంస్థ ఏర్పాటు కోసం రూ.50వేల కోట్లకుపైగా అవసరమని అంచనా వేస్తున్నారు. 

అనేక ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నందున
జలవనరులశాఖ ఆధ్వర్యంలోని జలాశయాల, బ్యారేజీల, కాలువల నుంచి నీటిని వినియోగించుకోవడానికి కొత్తగా పైపులైన్లు, నీటిని నిల్వ చేసేందుకు చెరువులు, జలాశయాల అదనపు నిర్మాణం కోసం భారీగా నిధులు ఖర్చు చేయాలి. వీటితో 2044 వరకు రాష్ట్రంలో మళ్లీ కొత్తగా ఎలాంటి పనులు చేపట్టే అవసరం ఉండదని, కేవలం నిర్వహణ బాధ్యత చూస్తే చాలని అధికారులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. విద్యుత్తు ఉత్పత్తి, సమీకరణ, సరఫరా తరహాలో తాగునీటి సంస్థను రూపొందించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. కొత్తగా అనేక ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నందున గ్రామీణ, పట్టణ ప్రజల అవసరాలకు తగిన నీటిని సరఫరా చేసేందుకు జలవనరులశాఖ హామీ ఇవ్వడంతో తాగునీటి సంస్థ ఏర్పాటు, పనుల నిర్వహణ ప్రతిపాదనలను మంత్రివర్గం ముందు పెట్టి ఆమోదం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. 15 నాటి సమావేశానికి ప్రాథమికంగా నివేదిక ఇస్తే తదుపరి సమావేశ అజెండాలో ప్రధానాంశంగా చేర్చాలని యోచిస్తున్నారు. తాగునీటి సంస్థ ఏర్పాటయ్యాక రాష్ట్రంలోని 

అన్ని ప్రాంతాలకూ శుద్ధి చేసిన రక్షిత నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు అధికార వర్గాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. రాష్ట్రంలోని 68శాతం ప్రాంత ప్రజలకు పైపుల్లో నీరు సరఫరా చేస్తున్నారు. మిగతా 32శాతం ప్రాంతాలకు పవర్‌బోర్లు, చేతిబోర్లు, ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా అవుతోంది. అందరికీ రక్షిత నీటిని సరఫరా చేయడంతో ప్రజలు తాగునీటి సంబంధిత వ్యాధుల నుంచి బయటపడే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై అధికారులు కొన్ని సాంకేతిక సమస్యలను లేవనెత్తుతున్నారు.

Posted
2 minutes ago, Android_Halwa said:

Good project.

Especially districts like, Kurnool,Kadapa,Ongole,Nellore,Chittor,Anantapur desperately needs such projects.

TG water grid ni already few other states steadying and may implement. So same

model untadhemo or atleast dhanni base cheskoni emaina mistakes unte correct chesi implement cheyali AP lo

Posted

strategy is simple bhai, nearby water soource nundi drinking water supply cheyale...borewell esi, and all those things silly and stuypid, avanni short term plans.

almost every district lo oka pedda water source vuntundi...we got to use that water for dinking purposes...that should be top priorirty..atarvate agri an dindustrial ki use cheyali..

 

Posted
56 minutes ago, TOM_BHAYYA said:

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి కోసం రూ.8వేల కోట్లతో వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంచినీటి సమస్య అధికంగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఏడాది కాలంలో వాటర్‌గ్రిడ్‌ పూర్తయ్యేలా ప్రణాళికలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

 

10ap-main1b.jpg

 giphy.gif

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...