kakatiya Posted June 18, 2017 Report Posted June 18, 2017 అనగనగా కొండపేట అనే వూరు. అక్కడో పాఠశాల. అందులో ఒకే ఒక ఉపాధ్యాయురాలు. విద్యార్థీ ఒక్కడే. దీంతో తమ పిల్లాడిని ఈ పాఠశాలకు పంపాలా? వేరే పాఠశాలలో చేర్చాలా అనే సంశయంలో తల్లిదండ్రులు! మొత్తానికి విద్యార్థి పాఠశాలకు రావడంలేదు. ఉపాధ్యాయురాలు రోజూ పాఠశాలకు వస్తూ.. విద్యార్థి వస్తాడేమేనని ఎదురుచూస్తూ కూర్చుంటున్నారు. తల్లిదండ్రులకు రోజూ కబురు పంపుతున్నారు. అయినా బడి ప్రారంభించిన సోమవారం నుంచి శనివారం వరకు విద్యార్థి రాలేదు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం జిన్నాం పంచాయతీ కొండపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న దృశ్యం ఇది. ఈ పాఠశాలలో గతేడాది ముగ్గురు ఐదో తరగతి విద్యార్థులు, మణికంఠ అనే మూడో తరగతి విద్యార్థి ఉన్నారు. అయిదో తరగతి పూర్తయిన ముగ్గురూ.. వేరే ఉన్నత పాఠశాలకు వెళ్లిపోయారు. మణికంఠ ఈ సంవత్సరం నాలుగో తరగతికి వచ్చాడు. ఈ గ్రామంలో ఇంకా ఎవరూ ఈ పాఠశాలలో విద్యార్థుల్ని చేర్చలేదు. దీంతో మణికంఠ ఒక్కడి కోసం ఉపాధ్యాయురాలు అనురాధ రోజూ పాఠశాల తెరుస్తున్నారు. ఈ పాఠశాలను మూసివేసి మణికంఠను వేరే పాఠశాలకు పంపిద్దామంటే కిలోమీటరు లోపు ఒక్క పాఠశాల కూడా లేదు. దీంతో అధికారులకు సైతం ఏం చేయాలో పాలుపోని స్థితి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని మండల విద్యాశాఖాధికారి విమలమ్మ చెబుతున్నారు. - న్యూస్టుడే, కొండపేట (గజపతినగరం Quote
kakatiya Posted June 21, 2017 Author Report Posted June 21, 2017 On 6/17/2017 at 11:48 PM, Peter123 said: Papam teacher Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.