BaabuBangaram Posted June 19, 2017 Report Posted June 19, 2017 లండన్: క్రికెట్ అభిమానులకు చేదువార్త. 2018లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచ కప్ను రద్దు చేసినట్లు ఐసీసీ వర్గాలు తాజాగా ప్రకటించాయి. 2018లో ద్వైపాక్షిక సిరీస్లతో పాటు టీ20 లీగ్ల కారణంగా పలు దేశాలు బిజీగా ఉన్నందునే టీ20 ప్రపంచకప్ టోర్నీని రద్దు చేసి 2020లో నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. తదుపరి టీ20 ప్రపంచకప్ను 2020లో దక్షిణాఫ్రికా లేదా ఆస్ట్రేలియాలో నిర్వహించనున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఐసీసీ టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్లు, టీ20 లీగ్లతో 2018 అంతా బిజీగా మారిపోయింది. ఈ కారణంగానే 2018లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్ను రద్దు చేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. 2020లో నిర్వహించే టీ20 ప్రపంచకప్కు వేదికలు ఇంకా ఖరారు చేయలేదు. 2016లో భారత్ టీ20 ప్రపంచకప్కు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. తదుపరి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2021 టోర్నీని భారత్లో నిర్వహించే అవకాశముందని ఐసీసీ ప్రతినిధులు తెలిపారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.