JANASENA Posted June 21, 2017 Report Posted June 21, 2017 లండన్: ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2017లో ఆడిన జట్లకు ఐసీసీ ప్రైజ్ మనీ అందించింది. టోర్నీ విజేతగా నిలిచిన పాకిస్థాన్ అత్యధికంగా రూ.14.18కోట్లు అందుకుంది. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీతో పోలిస్తే ఈ ఏడాది జట్లకు కాస్త ఎక్కువగానే అందించినట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి. టోర్నీలో భాగంగా లీగ్ దశలో జరిగిన కొన్ని మ్యాచ్లకు వర్షం అడ్డంకిగా మారిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్-ఎలో ఉన్న జట్లు న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లు పాయింట్లు పంచుకోవల్సి వచ్చింది. హ్యాట్రిక్ విజయాలతో ఇంగ్లాండ్ తొలి సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. టోర్నీ ప్రారంభం నుంచి టైటిల్ ఫేవరేట్గా ఉన్న ఇంగ్లాండ్ సెమీఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. గ్రూప్-బిలో ఉన్న భారత్, పాకిస్థాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్థాన్ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుస విజయాలతో టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్లో భారత్తో తలపడిన పాకిస్థాన్ 180పరుగులతో విజయం సాధించి ట్రోఫీని దక్కించుకుంది. టోర్నీ ముగిసిన అనంతరం ఐసీసీ నిర్వాహకులు పోటీలో పాల్గొన్న 8 జట్లకు ప్రైజ్ మనీని అందించారు. ట్రోఫీ దక్కించుకున్న పాకిస్థాన్ అత్యధికంగా రూ.14.18కోట్లు అందుకుంది. ఫైనల్లో పాక్ చేతిలో ఓడిన భారత్కు రూ.7కోట్లు దక్కాయి. మిగతా జట్లు అందుకున్న ప్రైజ్మనీ ఇంగ్లాండ్- రూ.3కోట్లు బంగ్లాదేశ్- రూ.3కోట్లు ఆస్ట్రేలియా- రూ.58లక్షలు దక్షిణాఫ్రికా- రూ.58లక్షలు శ్రీలంక- రూ.39లక్షలు న్యూజిలాండ్- రూ.39లక్షలు Quote
Idassamed Posted June 21, 2017 Report Posted June 21, 2017 Jebu karchulaki panikosthayi Kohli ki Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.