TampaChinnodu Posted July 6, 2017 Report Posted July 6, 2017 కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు పట్టిన వైనం సంచలన స్థాయిలో ఉంది. రాయలసీమలోనే పెద్ద జనరల్ ఆసుపత్రి అయిన కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు పట్టే కాంట్రాక్టుకు సంబంధించిన చెల్లింపులు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ఏడాది వ్యవధిలో ఎలుకలు పట్టినందుకు గానూ ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీకి ఏకంగా రూ.60 లక్షల రూపాయలను చెల్లించింది ప్రభుత్వం. వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఈ చెల్లింపులు జరిగినట్టుగా తెలుస్తోంది. మరి ఏడాది వ్యవధిలో పట్టిన ఎలుకలు ఎన్ని? అంటే.. మొత్తం మూడువందలు. అదీ కథ. మూడువందల ఎలుకలను పట్టడానికి వెచ్చించిన ఖర్చు అరవై లక్షల రూపాయలు. బోన్లు పెట్టి ఉన్నా.. ప్రభుత్వాసుపత్రిలో ఇంతకు మించిన స్థాయిలో ఎలుకలు వాటిల్లో పడతాయి. ఒక్కో బోను మహా అంటే యాభై రూపాయల విలువ చేయదు! ఒక రాయలసీమలోని పల్లెల్లోకి వెళితే ఎలుకలు పట్టే వారూ కనిపిస్తారు. వారిని తెచ్చి పట్టించి ఉన్నా.. వెంటాడి, వేటాడి ఎలుకల అంతు చూసే వాళ్లు. అయితే ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలను చాలా జాగ్రత్తగా సున్నితంగా పట్టాలని ఏకంగా అరవై లక్షల రూపాయలకు కాంట్రాక్టు ఇచ్చారట. ఏడాది గడిచే సరికి పట్టిన ఎలుకలు మూడువందలు, పొందిన మొత్తం అరవై లక్షల రూపాయలు! ఇదీ వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన దోపిడీ వైనం. భారతీయ జనతా పార్టీ నేత, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ దీనికి బాధ్యుడు అనే మాట వినిపిస్తోంది. ఈ కాంట్రాక్టుతో ఆసుపత్రి మేనేజ్ మెంట్ కు సంబంధంలేదని కామినేని శ్రీనివాస్ సన్నిహితులే ఈ కాంట్రాక్టర్ ను నియమించారని కర్నూలు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. మరి కమలనాథులు నోరు తెరిస్తే చెప్పే నీతులకు హద్దుండదు. మరి దీన్ని దోపిడీ అంటారో.. లేక ఎలుకల సంరక్షణ, వినాయకుడిని గౌరవిస్తూ.. హిందూ సంప్రదాయాలను కాపాడామని అంటారో.. కాషాయధారులకే తెలియాలి. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.