ARYA Posted July 13, 2017 Report Posted July 13, 2017 విశాఖపట్నం నగరాన్ని ఐటీ రంగంలో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో నగర శివార్లలోని భీమునిపట్నం మండలం కాపులుప్పాడ వద్ద 1351.90 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఐటీ నగరాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం మూడు దశల్లో ఈ ఐటీ నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) భూమిని గుర్తించి ఇప్పటికే రూ.91 కోట్ల వ్యయంతో మౌలికసదుపాయాల అభివృద్ధి పనులను చేపట్టింది. మార్చి నాటికల్లా ఈ పనులన్నీ పూర్తి చేసి స్థలాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు అప్పగించాలనేది లక్ష్యం. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ అంచనాల ప్రకారం ఒక ఎకరా ఐటీ కంపెనీకి కేటాయిస్తే దాని ద్వారా కనీసం 500 మందికి ఉద్యోగాలు కల్పించాలనేది నిబంధన. కాపులుప్పాడ ఐటీ నగరంలో 349 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పెద్దపెద్ద ఐటీ పార్కులు ఏర్పాటు అవుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇక్కడే దాదాపు రెండు లక్షల ఐటీ ఉద్యోగులు పనిచేసే వీలుంటుంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.