Jump to content

Recommended Posts

Posted

 

    స్వచ్ఛందంగా భూములిచ్చాం
    రాజధాని అభివృద్ధి శరవేగంగా జరగాలి
    ప్రపంచబ్యాంక్‌ ప్రతినిధులకు రైతుల విన్నపం

తుళ్ళూరు: రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చామని, అభివృద్ధి శరవేగంగా జరగాలని బుధవారం సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాపులో వెంకటపాలెం రైతులు కోరారు. వరద నియంత్రణ చర్యలు, అమరావతి రాజధాని నగరంలో ప్రపంచబ్యాంక్‌ ఆర్థిక సహకారంతో, రోడ్లు వరద నియంత్రణ ప్రాజెక్టు అమలు చర్యలు వల్ల ప్రభావితమయ్యే ప్రజల నుంచి అభిప్రాయ సేకరణకు సూచనలు, సలహాలు స్వీకరణకు సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో రెండు రోజులు వర్క్‌షాపులు నిర్వహించారు. బుధవారం వెంకటపాలెంలో నిర్వహించిన వర్క్‌షాపులో రైతులు తమ అభిప్రాయాలను తెలిపారు. ప్రపంచబ్యాంక్‌ నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు. సీఆర్‌డీఏలో రైతులకు ఎక్కువ ప్రాతినిధ్యం కలగాలనే భావన రైతుల నుంచి వినిపించింది. సిటిజన్‌ కమిటీలో రైతులకు అగ్రపీఠం వేయాలనే వినతులు వచ్చాయి. గ్రామ కంఠాల సమస్యలు పరిష్కారించాలని సూచించారు. రోడ్ల వల్ల ప్రభావితమయ్యే వారికి వెంటనే న్యాయం చేయాలని సూచించారు. రాజధానిలో రోడ్ల నిర్మాణం, పర్యావరణ ప్రభావ అంచనా- పర్యావరణ నిర్వాహక ప్రణాళిక, వరద నియంత్రణ పనుల ప్రభావిత పునరావాస పాలసీల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరంగా తెలియజేశారు. ఆయా అంశాలను తెలుగులో ముద్రించి రైతులకు అందజేశారు. కార్యక్రమంలో ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులు నలుగురు, సీఆర్‌డీఏ లాండ్స్‌ డైరెక్టర్‌ చెన్నకేశవరావు, స్ట్రాటజీ డైరెక్టర్‌ జీఎస్‌ఆర్కే శాస్త్రి, కాంపిటెంటు అథారిటీలు పాల్గొన్నారు.

 

Posted

chi vellaki inta chestunna inka em kavalo..mottam green belt cheste poyiddi

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...