ARYA Posted September 1, 2017 Report Posted September 1, 2017 ఆంధ్రప్రదేశ్కు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రానుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ డీఆర్డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో అత్యాధునిక క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకానుంది. ఇందుకోసం కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలం గుల్లలమోద తీరంలో ఇప్పటికే ప్రభుత్వం 381 ఎకరాలను కేటాయించింది. ప్రాజెక్టుకు మొదటి దశ అటవీ అనుమతులు మంజూరయ్యాయి. రూ.1,200 కోట్లతో తొలి దశ ప్రాజెక్టు నిర్మాణం మొదలుకానుంది. కీలకమైన ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కార్యాలయం స్వయంగా పర్యవేక్షిస్తోంది. ఒడిశా బాలాసోర్లో క్షిపణి పరీక్ష కేంద్రం ఉంది. దీనికంటే మెరుగైన సదుపాయాలతో మరోచోట కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని 2011లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త కేంద్రం ఏర్పాటుకు తూర్పు తీరంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించిన మీదట కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద ప్రాంతాన్ని అనువైనదిగా గుర్తించారు. ఈ ప్రాంతం కృష్ణా డెల్టా సమీపంలో ఉంది. పైగా బంగాళాఖాతంలోకి చొచ్చుకెళ్లినట్లు ఉండడం కలసివచ్చింది. పరీక్ష కేంద్రం చుట్టుపక్కల ఎనిమిది కి.మీ పరిధిలో ఎక్కడా జనావాసాలు లేవు. పరిసరాల్లో దట్టమైన మడ అడవులు ఉన్నాయి. క్షిపణి పరీక్ష కేంద్రం ఇక్కడికి రావడం వల్ల మౌలిక వసతులు సమకూరనున్నాయి. స్థానికులు దాదాపు 600 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. సుమారు 300 మంది శాస్త్రవేత్తలు, సిబ్బంది నివసించనున్నారు. ఇది ఈ ప్రాంత ఆర్థిక పరిపుష్టికి దోహదపడుతుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పల్లెల్లో ప్రగతి పనులను డీఆర్డీవో చేపట్టనుంది. భవిష్యత్తులో ఇది దేశ ప్రధాన క్షిపణి పరీక్ష వేదిక కానుంది. Quote
Idassamed Posted September 1, 2017 Report Posted September 1, 2017 DRDO is bokadia 1200 C tinestharu DRDO vallu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.