BaabuBangaram Posted September 19, 2017 Report Posted September 19, 2017 వనస్థలిపురం, న్యూస్టుడే: మూడు వివాహాలు చేసుకుని భర్తల వద్ద డబ్బులు డిమాండ్ చేసి మోసానికి పాల్పడిన మహిళను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం సికింద్రాబాద్ తార్నాకలో నివాసం ఉంటున్న సరిత(40) హోమియోపతి వైద్యురాలు. ఈమెకు 2005లో కర్ణాటక హుబ్లికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. రెండేళ్ల తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అతనిపై కేసు పెట్టింది. 2007 అతని వద్ద రూ.లక్షతోపాటు 10 తులాల బంగారం తీసుకుని విడాకులు తీసుకుంది. 2011లో చందానగర్కు చెందిన వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. నెల రోజులు గడిచిన తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని కేసు పెట్టింది. అతని వద్ద 2014లో రూ.9లక్షలతో రాజీ కుదుర్చుకుంది. 2015లో పుణెకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. కొన్ని నెలల అనంతరం అతను తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, అతనిపై 2015లో ఓయూ ఠాణాలో కేసు పెట్టింది. రూ.80 వేలు తీసుకుంది. కేసు పెండింగ్లో ఉంది. 2015లో వనస్థలిపురం ఎస్కేడీనగర్కు చెందిన వెంకట సూర్యప్రకాశ్రావు(50)ను మూడో వివాహం చేసుకుంది. వీరికి ఏడు నెలల కుమార్తె ఉంది. ఏడాది గడిచిన తర్వాత ఇతనిపై సరూర్నగర్ ఠాణాలో తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని కేసు పెట్టింది. సూర్యప్రకాశ్రావు తన దగ్గర డబ్బులు వసూలు చేయడానికే ఈ విధంగా చేస్తుందని గుర్తించి ఆమె గత వివాహ వివరాలు సేకరించాడు. వాటి ఆధారంగా వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. Quote
kalajamoon Posted September 19, 2017 Report Posted September 19, 2017 women empowerment said @vendetta @endetta Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.