Hitman Posted November 5, 2017 Report Posted November 5, 2017 ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప పెద్దదర్గా ప్రార్థనలకు వెళ్తున్నారని తెలుసుకున్న పల్లె ప్రజానీకం ప్రధాన రహదారిపైకి చేరిపోయారు. వి.కొత్తపల్లె, చాగలేరు క్రాస్, తాళ్లపల్లె, నందిపల్లె, వేంపల్లె, కుమ్మరాంపల్లె, వీరన్నగట్టుపల్లె నుంచి గండిక్షేత్రం వరకూ ప్రజలు రోడ్డుపైకి చేరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ను గ్రామ గ్రామానా నిలిపి శుభాకాంక్షలు చెప్పారు. మేమంతా నీ వెంటే.. అంటూ పులివెందుల ప్రజలు దీవెనలందించారు. గండిక్షేత్రం నుంచి కడప పెద్ద దర్గాకు వెళ్తుండగా నందిమండలం, పెండ్లిమర్రి, వెల్లటూరు, మిట్టమీదపల్లె, కృష్ణాపురం, బిల్టప్ సమీపంలో వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, కడప, రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు కె.సురేష్బాబు(కడప మేయర్), ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే ఎస్బీ అంజద్బాషా, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, వేల్పుల రామలింగారెడ్డి, జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి, సాంబశివారెడ్డి తదితరులున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.