aakathaai Posted December 12, 2017 Report Posted December 12, 2017 కాపు రిజర్వేషన్లపై ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం చెల్లదన్నారు లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ. కాపు రిజర్వేషన్ల బిల్లు చట్టవిరుద్దమన్నారు. అది చెల్లదని చెప్పారు. చట్టబద్దంగా ఏర్పాటైన మంజునాథ కమిషన్ పూర్తిస్థాయి నివేదిక అందకుండానే రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్తారని ప్రశ్నించారు. ఇదేమైనా రాచరిక పాలన అనుకుంటున్నారా అని మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకి ఒక సిద్దాంతం అంటూ లేకుండా పోయిందన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన, ఆర్థిక భారం లేని సమస్యలను పరిష్కరించేందుకు త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. అప్పుడే మార్పు సులువు అవుతుందన్నారు. దేశంలో రోజుకు 11 వేల కోట్లు ఖర్చు పెడుతున్నా విద్యా, వైద్య రంగాల్లో ఇప్పటికీ వెనుకబడే ఉన్నామన్నారు. వ్యవసాయ రంగాన్ని పాలకులు భ్రష్టుపట్టిస్తున్నారంటూ జేపీ ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం పనులు ఏడాది పాటు వేగంగానే సాగినా… ఇప్పుడు పడకేశాయని జేపీ అన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.