TampaChinnodu Posted February 5, 2018 Report Posted February 5, 2018 ఆవులకూ ఆధార్! తొలి విడతలో రూ.50 కోట్ల కేటాయింపు ఈనాడు, దిల్లీ: ఆవులకూ ఇకపై ఆధార్లాంటి విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జాతీయ గోకుల్ మిషన్ కింద పశుసంజీవని ప్రాజెక్టులో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. దేశంలోని 4 కోట్ల పాలిచ్చే ఆవులకు ఇది వర్తిస్తుంది. తొలి విడతలో 2018-19 సంవత్సరానికి రూ.50 కోట్లు కేటాయించింది. ఇందుకు అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికే సేకరించింది. ఆవు వయసు, జాతి, ఎత్తు, దానిపై ఉండే మచ్చల వివరాలతో మార్పులు చేయడానికి వీల్లేని పాలీయురేథేన్ ట్యాగ్ ఇస్తుంది. ఇందుకు రైతుల నుంచి రూ.10 వసూలు చేస్తుంది. దేశవాళి ఆవుల సంతతిని పెంచడానికే కేంద్రం పశుసంజీవని పథకాన్ని రూపొందించింది. దేశవాళీ ఆవు పాలులో బలవర్థకమైన ఏ2 అల్లేలే ఆఫ్ బీటా కాసియిన్ అనే ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా ఈ జాతులను పెంపొందింపచేయడానికి ప్రభుత్వం రూ.200 కోట్లను కేటాయించడం విశేషం. Quote
TampaChinnodu Posted February 5, 2018 Author Report Posted February 5, 2018 2 hours ago, nandananditha said: Good project Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.