Jump to content

Recommended Posts

Posted
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ కుంభకోణం 
  రూ.11వేల కోట్ల మోసం 
  వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీపై  సీబీఐకి ఫిర్యాదులు 
  10 మంది అధికారులపై సస్పెన్షన్‌ వేటు 
దిల్లీ 
14ap-main7a.jpg

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)కి చెందిన ముంబయిలోని ఒక శాఖలో 1.77 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.11,400 కోట్ల) మేర మోసం వెలుగుచూసింది. అత్యంత సంపన్నుడైన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, మరో ఆభరణాల కంపెనీ ఈ మేరకు మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్లు బ్యాంకు వర్గాలు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఫిర్యాదు చేశాయి. ఈ కంపెనీకి, నీరవ్‌కి సంబంధం ఉందా అనేది వెంటనే తెలియరాలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు ధరించే ఆభరణాలను సమకూర్చే ఈ వ్యాపారిపై రూ.280 కోట్ల మోసానికి సంబంధించి ఈ నెల 5న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచే అందిన ఒక ఫిర్యాదుపై విచారణ కొనసాగుతోంది. తాజా మోసంతో 10 మంది బ్యాంకు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది.

బీఎస్‌ఈకి సమాచారం: బ్యాంకు శాఖలో ‘అనధికార లావాదేవీ’లు జరిగిన విషయాన్ని బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)కి కూడా పీఎన్‌బీ తెలియపరిచింది. కొంతమంది ఖాతాదారులకు లబ్ధి కలిగించడానికి తమ సిబ్బంది తప్పుడు ‘లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌’ (ఎల్‌ఒయూ)ల ద్వారా కుట్ర పన్నినట్లు అనుమానం వ్యక్తం చేసింది. వీటిని చూపించి విదేశాల్లోని భారతీయ బ్యాంకుల నుంచీ రుణాలు పొంది ఉంటారని తెలిపింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు కూడా ఈ పత్రాల ద్వారా వీరికి రుణాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆభరణాల కంపెనీ పేరును సీబీఐ వెల్లడించలేదు. వాస్తవంగా ఎలాంటి అక్రమం జరిగిందో అధికారులెవరూ బయటపెట్టలేదు. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ స్థాయి అధికారుల ప్రమేయంతో 2011 నుంచి ఇది జరుగుతూ వస్తోందని మాత్రం తెలుస్తోంది. గీతాంజలి, గిన్ని, నక్షత్ర వంటి భారీ ఆభరణ విక్రయదారుల కార్యకలాపాలపై దర్యాప్తు సంస్థల దృష్టి పడిందని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. వివిధ బ్యాంకులతో వీటికి ఉన్న అవగాహన, డబ్బు చివరకు ఎక్కడకు చేరిందనే విషయాలపై సీబీఐ, ఈడీ దృష్టి సారించాయని చెప్పారు. ఇలాంటి లావాదేవీలు పునరావృతం కాకుండా బ్యాంకులన్నీ సమీక్షించుకుంటున్నాయనీ, సాధ్యమైనంత త్వరగా స్థాయీ నివేదికను అవి సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. మోసపూరిత లావాదేవీలపై హాంకాంగ్‌ సహకారాన్ని అభ్యర్థించాలని ఆర్‌బీఐ, సెబీ భావిస్తున్నాయి.

అతని పేరే ఒక బ్రాండ్‌ 
ఆభరణాలకు చూడచక్కని ఆకృతులనిచ్చే నీరవ్‌ మోదీ... ప్రపంచంలో వజ్రాలకు రాజధానిగా చెప్పే బెల్జియంలోని యాంట్వెర్ప్‌లో పెరిగిన వ్యక్తి. తన పేరిటే ఒక బ్రాండును సృష్టించుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరిగా స్థానం పొందారు. రూ.280 కోట్ల మేర బ్యాంకును మోసగించి, తప్పుడు సంతకాలు చేశారంటూ అతనితో పాటు భార్య అమీ మోదీ, సోదరుడు నిశాల్‌ మోదీ, గీతాంజలి పేరుతో గొలుసుకట్టు ఆభరణాల దుకాణాలు నిర్వహించే మెహుల్‌ ఛోక్సి (నీరవ్‌ మామ)లపైనా ఈ నెలారంభంలో సీబీఐ కేసు నమోదయింది. వీరంతా వివిధ కంపెనీల్లో భాగస్వాములుగా ఉన్నారు. బ్యాంకు వ్యవస్థలో ఎక్కడా వివరాలు నమోదు కాకుండా నీరవ్‌ సంస్థల్లోకి రూ.280 కోట్లు వెళ్లేలా ఎనిమిది ఎల్‌వోయూలను తప్పుడు పద్ధతుల్లో బ్యాంకు సిబ్బందే రూపొందించారని తొలి ఫిర్యాదులో పీఎన్‌బీ తెలిపింది. దిగుమతి చేసుకున్న సరకుకు గానూ విదేశాల్లోని సరఫరాదారులకు చెల్లింపులు జరపాలంటూ ఈ మోసానికి పాల్పడినట్లు చెప్పింది. నీరవ్‌ మోదీ 2016లో ఫోర్బ్స్‌ ఇండియా కుబేరుల జాబితాలో చోటు సంపాదించడం విశేషం. అతని నికర ఆస్తుల విలువ 1.74 బిలియన్‌ కోట్లు (సుమారు రూ.11,658 కోట్లు) ఉంటుందని ఫోర్బ్స్‌ తేల్చింది. క్రిస్టీ, సోథిబే వంటి ప్రఖ్యాత సంస్థల వేలంపాటల్లో తరచూ పాల్గొనడం నీరవ్‌కు అలవాటు.

Posted

Lavda gallu prajaa sommu ni thengesi hayiga bathikestunaru, pattukunna picha light, elago case close chesestari naanchi naanchi for long time

Posted
19 minutes ago, TampaChinnodu said:
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ కుంభకోణం 
  రూ.11వేల కోట్ల మోసం 
  వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీపై  సీబీఐకి ఫిర్యాదులు 
  10 మంది అధికారులపై సస్పెన్షన్‌ వేటు 
దిల్లీ 
14ap-main7a.jpg

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)కి చెందిన ముంబయిలోని ఒక శాఖలో 1.77 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.11,400 కోట్ల) మేర మోసం వెలుగుచూసింది. అత్యంత సంపన్నుడైన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, మరో ఆభరణాల కంపెనీ ఈ మేరకు మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్లు బ్యాంకు వర్గాలు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఫిర్యాదు చేశాయి. ఈ కంపెనీకి, నీరవ్‌కి సంబంధం ఉందా అనేది వెంటనే తెలియరాలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు ధరించే ఆభరణాలను సమకూర్చే ఈ వ్యాపారిపై రూ.280 కోట్ల మోసానికి సంబంధించి ఈ నెల 5న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచే అందిన ఒక ఫిర్యాదుపై విచారణ కొనసాగుతోంది. తాజా మోసంతో 10 మంది బ్యాంకు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది.

బీఎస్‌ఈకి సమాచారం: బ్యాంకు శాఖలో ‘అనధికార లావాదేవీ’లు జరిగిన విషయాన్ని బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)కి కూడా పీఎన్‌బీ తెలియపరిచింది. కొంతమంది ఖాతాదారులకు లబ్ధి కలిగించడానికి తమ సిబ్బంది తప్పుడు ‘లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌’ (ఎల్‌ఒయూ)ల ద్వారా కుట్ర పన్నినట్లు అనుమానం వ్యక్తం చేసింది. వీటిని చూపించి విదేశాల్లోని భారతీయ బ్యాంకుల నుంచీ రుణాలు పొంది ఉంటారని తెలిపింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు కూడా ఈ పత్రాల ద్వారా వీరికి రుణాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆభరణాల కంపెనీ పేరును సీబీఐ వెల్లడించలేదు. వాస్తవంగా ఎలాంటి అక్రమం జరిగిందో అధికారులెవరూ బయటపెట్టలేదు. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ స్థాయి అధికారుల ప్రమేయంతో 2011 నుంచి ఇది జరుగుతూ వస్తోందని మాత్రం తెలుస్తోంది. గీతాంజలి, గిన్ని, నక్షత్ర వంటి భారీ ఆభరణ విక్రయదారుల కార్యకలాపాలపై దర్యాప్తు సంస్థల దృష్టి పడిందని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. వివిధ బ్యాంకులతో వీటికి ఉన్న అవగాహన, డబ్బు చివరకు ఎక్కడకు చేరిందనే విషయాలపై సీబీఐ, ఈడీ దృష్టి సారించాయని చెప్పారు. ఇలాంటి లావాదేవీలు పునరావృతం కాకుండా బ్యాంకులన్నీ సమీక్షించుకుంటున్నాయనీ, సాధ్యమైనంత త్వరగా స్థాయీ నివేదికను అవి సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. మోసపూరిత లావాదేవీలపై హాంకాంగ్‌ సహకారాన్ని అభ్యర్థించాలని ఆర్‌బీఐ, సెబీ భావిస్తున్నాయి.

అతని పేరే ఒక బ్రాండ్‌ 
ఆభరణాలకు చూడచక్కని ఆకృతులనిచ్చే నీరవ్‌ మోదీ... ప్రపంచంలో వజ్రాలకు రాజధానిగా చెప్పే బెల్జియంలోని యాంట్వెర్ప్‌లో పెరిగిన వ్యక్తి. తన పేరిటే ఒక బ్రాండును సృష్టించుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరిగా స్థానం పొందారు. రూ.280 కోట్ల మేర బ్యాంకును మోసగించి, తప్పుడు సంతకాలు చేశారంటూ అతనితో పాటు భార్య అమీ మోదీ, సోదరుడు నిశాల్‌ మోదీ, గీతాంజలి పేరుతో గొలుసుకట్టు ఆభరణాల దుకాణాలు నిర్వహించే మెహుల్‌ ఛోక్సి (నీరవ్‌ మామ)లపైనా ఈ నెలారంభంలో సీబీఐ కేసు నమోదయింది. వీరంతా వివిధ కంపెనీల్లో భాగస్వాములుగా ఉన్నారు. బ్యాంకు వ్యవస్థలో ఎక్కడా వివరాలు నమోదు కాకుండా నీరవ్‌ సంస్థల్లోకి రూ.280 కోట్లు వెళ్లేలా ఎనిమిది ఎల్‌వోయూలను తప్పుడు పద్ధతుల్లో బ్యాంకు సిబ్బందే రూపొందించారని తొలి ఫిర్యాదులో పీఎన్‌బీ తెలిపింది. దిగుమతి చేసుకున్న సరకుకు గానూ విదేశాల్లోని సరఫరాదారులకు చెల్లింపులు జరపాలంటూ ఈ మోసానికి పాల్పడినట్లు చెప్పింది. నీరవ్‌ మోదీ 2016లో ఫోర్బ్స్‌ ఇండియా కుబేరుల జాబితాలో చోటు సంపాదించడం విశేషం. అతని నికర ఆస్తుల విలువ 1.74 బిలియన్‌ కోట్లు (సుమారు రూ.11,658 కోట్లు) ఉంటుందని ఫోర్బ్స్‌ తేల్చింది. క్రిస్టీ, సోథిబే వంటి ప్రఖ్యాత సంస్థల వేలంపాటల్లో తరచూ పాల్గొనడం నీరవ్‌కు అలవాటు.

desaniki oka bodi ee ekuvva ante malli inko bodi tayaru ayyadu

Posted
16 minutes ago, Amrita said:

Entaku Vadu fake diamonds Ammatledu kada ☹️

em akkada koni gift chessava evarikanna :P 

Posted
7 minutes ago, tom bhayya said:

em akkada koni gift chessava evarikanna :P 

Bought there 😭

Posted
3 hours ago, perugu_vada said:

Lavda gallu prajaa sommu ni thengesi hayiga bathikestunaru, pattukunna picha light, elago case close chesestari naanchi naanchi for long time

last few years saala ekkuva ayyayi ilanti defaults banks lo. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...