BaabuBangaram Posted February 19, 2018 Report Posted February 19, 2018 దిల్లీ: పరీక్షలు దగ్గరపడే వేళ దేశంలోని 70 శాతం మందికిపైగా విద్యార్థులు ఏడు గంటలు కూడా సరిగా నిద్రపోవడంలేదని తాజా అధ్యయనంలో తేలింది. 18 శాతం మంది అయితే కేవలం మూడు నుంచి ఐదు గంటలే కునుకు తీస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అనారోగ్యకర జీవనశైలికి వ్యాయామలేమి తోడుకావడంతో ఒత్తిడి విపరీతంగా పెరుగుతున్నట్లు బయటపడింది. దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, కోల్కతా, జైపుర్, చండీగఢ్ సహా పలు ప్రధాన నగరాల్లో ఫోర్టిస్ హెల్త్కేర్ సంస్థ దీన్ని నిర్వహించింది. దీనిలో 6,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్షలకు వారాల గడువు ఉండేటప్పుడు చదవాల్సిన మొత్తం ఎక్కువగా ఉండిపోతోందని దీనిలో విద్యార్థులు తెలిపారు. కొందరైతే కనీసం కుటుంబం, స్నేహితులతో మాట్లాడేందుకూ సమయం దొరకడం లేదనీ పేర్కొన్నారు. తల్లిదండ్రుల జోక్యమూ ఇబ్బందే * శారీరక వ్యాయామానికి కనీసం 30 నిమిషాలు కూడా 86 శాతం మంది పిల్లలు కేటాయించలేకపోతున్నారు. * 68 శాతం మంది బయటకు వెళ్లేందుకు గంట కంటే తక్కువ సమయమే వెచ్చిస్తున్నారు. * తమ పరీక్షలపై తల్లితండ్రులు పడే ఆందోళన.. ఒత్తిడిని మరింత పెంచుతోందని 74 శాతం మంది పిల్లలు భావిస్తున్నారు. మరోవైపు తమ పాఠ్యప్రణాళికలో తల్లిదండ్రులు జోక్యం చేసుకుంటే ఇబ్బందిగా ఉంటోందని 82 శాతం మంది అభిప్రాయపడ్డారు. * 73 శాతం మంది కుటుంబంతో గంట కంటే తక్కువసేపు గడుపుతున్నారు. కేవలం ఒక శాతం మంది చిన్నారులు మాత్రమే కుటుంబానికి మూడు గంటలు కేటాయిస్తున్నారు. * 34 శాతం మంది గంట నుంచి మూడు గంటల పాటు స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లపై గడుపుతున్నారు. 11 శాతం మంది మాత్రం ఐదు నుంచి ఏడు గంటలు ఆన్లైన్లో ఉంటున్నారు. * 53 శాతం మంది విద్యార్థులు రోజుకు 5 నుంచి 7 గంటలు నిద్రపోతున్నారు. * 94శాతం మంది పరీక్షల సమయంలో లభించే కాసేపు తీరిక సమయాన్నీ ప్రశాంతంగా గడపలేకపోతున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.