Jump to content

Modi gari ni Modi gadu analedhu, kani ante em peekuthar?- KCR


Recommended Posts

  • Replies 33
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • reality

    8

  • TechAdvice

    4

  • TampaChinnodu

    3

  • Aakupaccha_caradu

    2

Top Posters In This Topic

Posted
7 minutes ago, reality said:

 

mari kcr meeda comments chesinollani jail lo pettinchadu ga... jaffa gadu

Posted
8 hours ago, MDharmarajuMA said:

eedu magadu ra bujji...

 

Yes, Nakka gadi la BJP ki BJ ivvatledhu....

Posted
మరో కూటమికి  కేసీఆర్‌ సై! 
దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు 
అందుకు నాయకత్వం వహించేందుకూ సిద్ధమే 
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి సై 
అవసరమైతే రాష్ట్రాల్లో తిరిగి ప్రచారం చేస్తా 
ఆంధ్రకు ప్రత్యేక హోదాపై ఎందుకు స్పష్టత ఇవ్వరు? 
కాంగ్రెస్‌, భాజపా దొందూదొందే 
వాటికి ప్రత్యామ్నాయం ఆవిర్భవించాలి 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
3hyd-main5a.jpg
‘‘పరిస్థితులు వచ్చినప్పుడు నాయకుడు పుడతాడు. మార్పునకు నాయకత్వం వహించడానికి నేను సిద్ధమే. దేశంలో కొత్తగా వచ్చేది మూడో కూటమి కాదు. అదే ప్రధాన కూటమి కావచ్చు.’’ 
‘‘నేను దేశ రాజకీయాల గురించి మాట్లాడుతున్నా. కాంగ్రెస్‌ కానీ భాజపా కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా పరిస్థితి మాత్రం ఒకేలా ఉంటోంది. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. త్వరలోనే మార్పు ఇవ్వడం కోసం ఎదురు చూస్తున్నారు. అది మీరు చూడబోతున్నారు.’’

‘‘ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పథకాల పేర్లు మారుస్తారు తప్ప అభివృద్ధి లేదు. 2004లో నేను పార్లమెంటులో అడుగుపెట్టినప్పుడు దేశ బడ్జెట్‌ రూ.4 లక్షల కోట్లు. 14 ఏళ్ల తర్వాత అది రూ.24 లక్షల కోట్లకు చేరింది. ఇదేనా మన ప్రగతి. ఇలాంటి పరిస్థితి మారాలి.’’

‘‘ ప్రత్యామ్నాయ కూటమిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించలేదు. అవసరమయితే ఆయనను కలుపుకొని వెళ్లడానికి సిద్ధమే.’’

ప్రధాని నాకు మిత్రుడే 
‘‘ప్రధాని మోదీ నాకు మంచి మిత్రుడు. ఆయనపై ఎలాంటి వ్యతిరేకత లేదు. అపార గౌరవం ఉంది. పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రధానిని నేనే మొట్టమొదట అభినందించా. రాష్ట్రపతిగా దళితుడిని చేయాలని అడిగాను. ఆయన చేశారు. దేశానికి మంచి జరుగుతుందనే జీఎస్టీ తదితర అంశాల్లో మద్దతు ఇచ్చా. నాకు భాజపాకి వ్యతిరేకంగా కూడా ఏమీ లేదు. దేశ ప్రగతి గురించే నా పోరాటం.’’

ఈనాడు - హైదరాబాద్‌

దేశంలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థ దారుణంగా విఫలమయిందని,  గడిచిన 70 ఏళ్ల ప్రజాస్వామ్య పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాజకీయాల్లో ప్రబలమైన, గుణాత్మకమైన మార్పు రావాలని, ఇందుకోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌, భాజపాలు దొందూదొందేనని, పథకాల పేర్లు మారడం తప్ప ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పరిస్థితుల్లో మార్పు రాదన్నారు. వాటికి ప్రత్యామ్నాయంగా బలమైన కూటమి కోసం తాను పనిచేస్తానన్నారు. ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడుతున్నానని, దేశానికి నా అవసరం ఉందనుకుంటే ఖచ్చితంగా సేవలందించేందుకు వెనుకాడబోనని స్పష్టంచేశారు. ప్రగతిభవన్‌ వేదికగా శనివారం జరిగిన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ విలేకరులతో మాట్లాడుతూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొన్ని పార్టీలు మినహా 64 ఏళ్ల పాటు కాంగ్రెస్‌, భాజపాలే పాలించాయి. మన దగ్గర మార్పేమీ రాలేదు. చైనాను తీసుకోండి. రెండుసార్లు ఆ దేశంలో కరవొచ్చింది. మావో ఉన్న సమయంలో..ఆ దేశంలో 15 లక్షల మంది చనిపోయారు. చైనా సాగు విస్తీర్ణం మన కంటే తక్కువ. జనాభా మనకంటే ఎక్కువ. ఆ దేశం ఎలా మారిపోయిందో చూడ[ండి. అమెరికా తర్వాత ఆర్థికంగా చైనా బలంగా ఉంది. విదేశీ మారక ద్రవ్యంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. ఆసియాలో అగ్రస్థానంలో ఉంది. ఉత్తర చైనా నుంచి దక్షిణ చైనాకు 2,400 కిలోమీటర్ల దూరం.. 16 వేల టీఎంసీల నీళ్లు ఇస్తున్నారు. మనకు అలా ఎందుకు ఇవ్వరు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దేశంలో ఇప్పటికీ చాలా మందికి తాగు, సాగునీరు లేదు. కరెంటు ఉండదు. దీనికి ఆ రెండు పార్టీలు ఏం సమాధానం చెబుతాయి. దేశంలో ఇవన్నీ మారాలి. ఇందుకోసం చట్టాలను మార్చాలి. అవసరమయితే రాజ్యాంగాన్ని మార్చవచ్చు. దేశంలో మార్పును స్వాగతించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వారు నిరీక్షిస్తున్నారు. దానికి తగిన పనిముట్లను తయారుచేస్తున్నాం. మీరు త్వరలోనే చూస్తారు. 
 

రాష్ట్రంలో భాజపా ఉందా? 
3hyd-main5c.jpg
రాష్ట్రంలో తెరాసకు మేమే ప్రత్యామ్నాయం అని భాజపా నేతలు చెప్పడం పెద్ద జోక్‌. ఆ పార్టీ తెలగాణపై దృష్టి సారిస్తే మంచిదే. భాజపా వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదు. ఎన్ని సర్కస్‌ ఫీట్లు చేసినా...మేం వదిలేస్తే తప్ప కాంగ్రెస్‌కు పది సీట్లకు మించి రావు. ఆ పార్టీ బస్సు యాత్రకు అయిదారు వందల మంది కూడా రావడం లేదు.’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

రైతాంగం అసహనం 
దేశంలోని రైతులు అసహనానికి గురవుతున్నారు. వారికి న్యాయం జరగడం లేదు. రైతులకు ఏం చేశాయో కాంగ్రెస్‌, భాజపాలు తెలపాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. వరి ధాన్యానికి రూ.500 మద్దతు ధర పెంచాలంటున్నాం. దాన్నీ చేయడం లేదు.

మూడు గొప్ప మార్పులు చూశా.. 
దేశం కోసం పనిచేసే హక్కు మాకుంది. నా రాజకీయ జీవితంలో మూడు సందర్భాల్లో గొప్ప మార్పులు చూశా. ఒకటి జనతా పార్టీ ఆవిర్భావం. పార్టీ పెట్టిన 60 రోజుల్లోనే అధికారంలోకి వచ్చింది. రెండోది ఎన్టీఆర్‌ ఆధ్వర్యంలో తెదేపా ఏర్పాటు. తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టింది. మూడోది తెరాస ఏర్పాటు. స్థాపించిన 60 రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించింది.

మాకు అదనంగా నయాపైనా ఇవ్వలేదు 
కేంద్రం రాష్ట్రానికి అదనంగా నయా పైసా ఇవ్వలేదు. గత నాలుగేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా కింద వచ్చింది కేవలం రూ. 81,062 కోట్లు మాత్రమే. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ కింద రూ. 24 వేల కోట్ల సాయం అందించాలని నీతి ఆయోగ్‌ కేంద్రానికి సిఫార్సు చేసింది. కేంద్రం కనీసం 24 రూపాయలు కూడా ఇవ్వలేదు.

జాతీయ రాజకీయాల దిశగా 
ఇప్పుడు నా వయస్సు 64 సంవత్సరాలు. దేశానికి అవసరం అనుకుంటే శాయశక్తులా పనిచేస్తా. రాష్ట్రాలు తిరిగి ప్రచారం చేయడానికీ సిద్ధమే. నాకు ఆంగ్లం, హిందీ మాట్లాడడం వచ్చు. 
 

ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వరెందుకు? 
3hyd-main5d.jpg
ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెదేపా వాళ్లు, కేంద్రంలోని భాజపా వాళ్లు స్పష్టత ఇవ్వరు. ఏమిటీ తమాషా? నేను కొట్టినట్లు చేస్తా...మీరు ఏడ్చినట్లు చేయండి అన్నట్లుగా ఉంది. ఇలాంటి రాజకీయాలను మార్చాలనే నేను చెప్పేది. ఇలాంటి దురదృష్టకరమైన, దిక్కుమాలిన పరిస్థితులు ఉండవద్దు. ప్రజలకు ఏం చెప్పినా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాలి. దాన్ని అమలు చేయాలి. మోదీ ప్రత్యేక హోదా ఇస్తాను అంటే ఇచ్చి తీరాలి. ఇచ్చే ఉద్దేశం లేకుంటే అది ఖచ్చితంగా చెప్పాలి. ప్రతిరోజు అక్కడ ప్రజలు, పార్టీలు ఆవేదనపడడం ఎందుకు? ఏ దేశంలోనైనా ఇలాంటి సందిగ్ధత ఉందా. ఈ దేశంలో నాయకులు ప్రజలను వంచిస్తున్నారు. ప్రజలు ఈ వంచనలోంచి బయటపడాలన్నదే నా తపన.

వామపక్షాలను కలుపుకొని వెళ్తాం 
జాతీయ స్థాయిలో ఏర్పాటయ్యే కూటమి కాంగ్రెస్‌, భాజపాలకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. వామపక్షాలను కలుపుకొని వెళతాం. సీతారాం ఏచూరి నాకు మంచి మిత్రుడు. నా ఆలోచనలను ఆయనతో పంచుకుంటున్నాం.

కాంగ్రెస్‌ పుంజుకుంటోంది 
దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూస్తే కాంగ్రెస్‌ కొంత పుంజుకుంటోంది. భాజపా ప్రభ తగ్గుతోంది. కర్ణాటకలో కాంగ్రెసే గెలిచే అవకాశం ఉంది.

గెలుపు శాశ్వతం కాదు 
ఎక్కడో ఒక చోట ఎన్నికల్లో గెలవడం పెద్ద విషయం కాదు. ఈ నిమిషానికి ఫలితాలుంటాయి. రేపటికి మారతాయి.

3hyd-main5b.jpg
Posted

NDA loki, government loki theesukovatle ani baaga feel avuthu vunde KCR.  inka theesukoru ani decide ayyi rebel ayipoyadu final gaa

Posted
Quote

జాతీయ రాజకీయాల దిశగా 
ఇప్పుడు నా వయస్సు 64 సంవత్సరాలు. దేశానికి అవసరం అనుకుంటే శాయశక్తులా పనిచేస్తా. రాష్ట్రాలు తిరిగి ప్రచారం చేయడానికీ సిద్ధమే. నాకు ఆంగ్లం, హిందీ మాట్లాడడం వచ్చు. 

@3$%
 

Posted

Nenu monnane annaa .. ivvala vaadi notlo nunchi vachindi

Posted
18 hours ago, reality said:

 

Vediki thagudu problem vundi... thagi matladina mykam lo em matladuthado and em matladindo kuda theliyadu.. no matter who u r .. learn to talk respectfully with each other.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...