kakatiya Posted March 9, 2018 Report Posted March 9, 2018 ఎనిమిదో అంతస్తు నుంచి పడి ఇద్దరు బాలికల మృతి! ఆత్మహత్యచేసుకొని ఒకరు.. రక్షించబోయి మరొకరు మరణించారని అనుమానాలు నాగోలు, న్యూస్టుడే: ఇద్దరు పదోతరగతి విద్యార్థినులు ఓ అపార్టుమెంటులోని ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడి దుర్మరణం పాలైన ఘటన ఎల్బీనగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. అయితే ఒక బాలిక ఆత్మహత్య చేసుకుంటుండగా.. రక్షించబోయి మరో బాలిక కూడా కిందపడి ఉండొచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్లోని టీఎన్ఆర్ వైష్ణవి శిఖర అపార్టుమెంట్లోని 8వ అంతస్తులో నివసించే కాంతిపటేల్ వ్యాపారి. ఆయన చిన్నకుమార్తె భార్గవి(15) హస్తినాపురంలోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో పదోతరగతి చదువుతోంది. సహ విద్యార్థిని శ్రావణి(15)తో ఈమెకు మంచి స్నేహం ఉంది. శ్రావణి తండ్రి కాలె నాగేంద్ర ఆర్సీఐలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు. ఇటీవలే పదోతరగతి పరీక్షలు మొదలవడంతో ఇద్దరూ ఎల్బీనగర్లోని భార్గవి ఇంట్లోనే కలిసి సిద్ధమవుతున్నారు. మొదటి పరీక్ష రాశారు. మూడు రోజలుగా అనారోగ్యంతో ఉన్న శ్రావణి.. గురువారం సాయంత్రం భార్గవి ఇంటికి వచ్చింది. అనంతరం రెండు గంటల తర్వాత సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇరువురూ ఆ అపార్టుమెంటులోని 8వ అంతస్తులోని వీరింటి బాల్కనీలోంచి అమాంతం కిందపడ్డారు. ఇద్దరు బాలికలు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. భార్గవి ఇంట్లో పోలీసులు శోధించగా.. ఓ చెత్తబుట్టలో శ్రావణి రాసినట్లు ఉన్న సూసైడ్నోట్ దొరికింది. అందులో ‘డియర్ మా.. పా.. సారీ..’ అంటూ అమ్మానాన్నలకు సారీ చెబుతూ.. ‘ఐ మిస్యూ తేజూ..’ అంటూ అన్నయ్యను సంబోధిస్తూ లేఖ రాసినట్లుంది. దీని ఆధారంగా శ్రావణి ఆత్మహత్య చేసుకునేందుకు భార్గవి ఇంటి బాల్కనీలోంచి మూడున్నర అడుగుల ఎత్తున్న గ్రిల్స్ ఎక్కి దూకుతుండగా.. ఆమెను రక్షించే క్రమంలో భార్గవి సైతం జారిపడి మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చదువుల ఒత్తిడి కారణమై ఉంటుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.