sivanagulu Posted April 6, 2018 Report Posted April 6, 2018 జోధ్పూర్: కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను కోర్టు దోషిగా తేల్చింది. జోధ్పూర్ న్యాయస్థానం ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న టబు, సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, నీలమ్లను నిర్దోషులుగా ప్రకటించింది. అయితే విచారణ సమయంలో పూనమ్ బిష్ణోయ్ అనే ప్రత్యక్ష సాక్షి సల్మాన్ను గుర్తుపట్టాడు కానీ సోనాలిని, టబును గుర్తుపట్టలేకపోయాడట. అందుకే వారిని న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో జీపులో వెనక సీటులో సల్మాన్తో పాటు ఉన్న టబు కృష్ణజింకను కాల్చమని రెచ్చగొట్టారని గురువారం మరో ప్రత్యక్షసాక్షి కోర్టులో చెప్పాడట. ఇక సైఫ్ అలీ ఖాన్, నీలమ్లు జీపు ముందు సీటులో కూర్చున్నారు కానీ వారు జింకను వేటాడే సమయంలో సల్మాన్కు ఎలాంటి సాయం చేయలేదని తేలడంతో నిర్దోషులుగా ప్రకటించినట్లు సమాచారం. గురువారం సల్మాన్ను జోధ్పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. సల్మాన్ బెయిలు దరఖాస్తుపై వాదనలు శనివారానికి వాయిదా పడటంతో ఆయన ఈరోజు కూడా జైల్లోనే గడపనున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.