TampaChinnodu Posted May 7, 2018 Report Posted May 7, 2018 ఎల్లంపల్లికి జలగండం! వేగంగా పడిపోతున్న నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరువలో జలాశయం నీటి మట్టం వర్షాలు పడకుంటే ఈ నెలాఖరు వరకే సరఫరా వేసవి గట్టెక్కడం అనుమానమే.. లక్షెట్టిపేట, మంచిర్యాల గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్రంలోనే అత్యధిక నీటి అవసరాలు తీరుస్తున్న మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. ఎత్తిపోతల ద్వారా మంచిర్యాల జిల్లాకు సాగునీరు, హైదరాబాద్వాసులకు తాగునీరు, జైపూర్ విద్యుత్తు కేంద్రం, సింగరేణి, ఎన్టీపీసీకు అవసరమైన నీటి సరఫరాకు ఇది అత్యంత కీలకం. మరోవైపు మిషన్ భగీరథ, మేడారం జలాశయానికి ఈసారి అదనంగా నీటి సరఫరా జరిగింది. ఇటీవల మిషన్ భగీరథ, మేడారం జలాశయ పనులు పూర్తి కావడంతో ఎల్లంపల్లి జలాశయం నీటిని పైపుల ద్వారా సరఫరా చేస్తూ ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో జలాశయం నీటి మట్టం భారీగా తగ్గింది. ఇంకోవైపు ఎండల తీవ్రత కూడా కారణమవుతోంది. గడిచిన మూడు నెలల కాలంలోనే 5 మీటర్ల మేర నీటి నిల్వలు తగ్గడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ చివరివారం వరకు 10 శతకోటి ఘనపుటడుగుల మేర నీటి వినిమయం జరిగింది.. రోజురోజుకు పడిపోతున్న నిల్వలు: వేసవి కావడంతో జలాశయంలోకి ఇన్ఫ్లో లేకపోగా ఔట్ఫ్లో మాత్రం రోజుకు 900 క్యూసెక్కులకు పైగానే ఉంటుంది. ప్రస్తుతం ప్రతిరోజు ఎన్టీపీసీకి 242, హైదరాబాద్వాసుల తాగునీటికి 248 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. జలాశయం నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని వెంనూరు పంపుహౌజుకు ప్రస్తుతం సరఫరా నిలిపివేశారు. యాసంగి పంట కాలం ముగియడంతో మంచిర్యాల జిల్లాలోని గూడెం ఎత్తిపోతల ద్వారా నీటి సరఫరా నిలిచినా సింగరేణి అవసరాలకు 3 నుంచి 400 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. వేసవి తాపం కారణంగా ప్రతిరోజు 155 క్యూసెక్కులు ఆవిరి రూపంలో వృథా అవుతోంది. ఎల్లంపల్లి జలాశయం కనీస నీటిమట్టం(డెడ్ స్టోరేజి) 3.30 టీఎంసీలుకాగా ప్రస్తుతం జలాశయంలో 6.5 టీఎంసీలే నిల్వ ఉంది. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 148 మీటర్లకు 138 మీటర్ల మేర నీరు వాడుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 140 మీటర్లకు చేరుకుంది. వర్షాలు కురిసి జలాశయంలోకి నీరు రావడానికి కనీసం మరో 50రోజుల వ్యవధి ఉంది. ప్రస్తుతం అవసరాలకు వాడుకోవడానికి జలాశయంలో 3.2 టీఎంసీలే నిల్వ ఉన్నాయి. హైదరాబాద్ తాగునీరు, ఎన్టీపీసీ, ఎస్టీపీపీ అవసరాలకు రోజు 900 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తే ఈ నెల చివరివారం వరకే నీటి నిల్వలు సరిపోనున్నాయి. నీటి వినియోగం ఇలా... ఎల్లంపల్లి జలాశయం ద్వారా గతేడాదితో పోలిస్తే నీటి వాడకం గణనీయంగా పెరిగింది. జనవరిలో జలాశయంలో నీటి మట్టం 146.70 మీటర్లు ఉండగా మూడు నెలల వ్యవధిలో 141 మీటర్లకు తగ్గింది. జనవరి నుంచి ఏప్రిల్ చివరి వారం వరకు జలాశయం నుంచి ఎన్టీపీసీ, హైదరాబాద్ మెట్రోవాటర్ వర్స్క్, మంచిర్యాల జిల్లాలో సాగునీటి కోసం గూడెం ఎత్తిపోతలకు నీటిని విడుదల చేస్తూ వచ్చారు. పైపులైన్ల ద్వారా సింగరేణి అవసరాలకు గోదావరి నదిలో నీటిని దిగువకు వదిలి సరఫరా చేస్తున్నారు. మార్చి 5 నుంచి వెంనూరు పంపుహౌజు ద్వారా మేడారం జలాశయానికి నీటి సరఫరా చేస్తూ వచ్చారు. దీంతో జలాశయంలోనీ నీటిమట్టం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఏప్రిల్ 30 నాటికి జలాశయంలో 148 మీటర్లకు 140.85 మీటరుకు తగ్గి 20.175 శతకోటి ఘనపుటడుగుల సామర్థ్యం గల జలాశయంలో ప్రస్తుతం కేవలం 6.5 శతకోటి ఘనపుటడుగుల మేర నీరు మాత్రమే నిల్వ ఉంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.