kakatiya Posted May 27, 2018 Report Posted May 27, 2018 వాట్సప్లో వదంతుల కేసులో ఇద్దరి అరెస్టు పిల్లలను అపహరించి చంపేశారని ఫొటో హైదరాబాద్: పిల్లలను అపహరించి.. హతమారుస్తున్నారంటూ వాట్సప్లో ఫొటోలు, వాయిస్ మెసేజ్ను పంపిన ఇద్దరు యువకులను పహాడీషరీఫ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అట్టలతో చుట్టిన మృతదేహాల చుట్టూ ఆర్మీ జవాన్లు నిలుచున్న ఫొటో.. చిన్నారులను ఎత్తుకెళ్లి.. ఇలా చంపారనే వాయిస్ మెసేజ్ గత రెండు వారాలుగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మొబైల్ ఫోనుల్లో హల్చల్ చేస్తోంది. ఇటీవల కిడ్నాపర్లనే అనుమానంతో అమాయకులపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో వాట్సప్ గ్రూపుల్లో వస్తున్న మృతదేహాల ఫొటో, వాయిస్ మెసేజ్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోందని పలువురు పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు దర్యాప్తు చేపట్టారు. ఉమర్కాలనీకి చెందిన అశ్వాక్(22), పహాడీషరీఫ్కు చెందిన రహీం(21)లు ఇందుకు కారణమని తేల్చారు. ఎవరో పంపినవాటిని సదరు యువకులు వాట్సప్ గ్రూపుల్లో చాలామందికి పంపించారని సీఐ లక్ష్మీకాంత్రెడ్డి తెలిపారు. ఇద్దరినీ రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆ ఫొటోను పరిశీలిస్తే.. శ్రీలంకకు సంబంధించినదిగా భావిస్తున్నట్లు చెప్పారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.