kakatiya Posted June 9, 2018 Report Posted June 9, 2018 625కు 624 మార్కులు.. రీవాల్యుయేషన్ పెట్టిస్తే.. న్యూదిల్లీ: మామూలుగా విద్యార్థులు పరీక్షలు రాశామా, ఫలితాలు వచ్చాయా, పాసయ్యామా.. అంతవరకే ఆలోచిస్తారు. పాసైతే హమ్మయ్య గట్టెక్కాంరా బాబూ అనుకుంటూ పై తరగతికి వెళ్లడానికి సిద్ధమైపోతారు. సాధారణంగా చాలామంది విద్యార్థుల ఆలోచనలు ఇలాగే సాగుతాయి. కానీ కొందరు ర్యాంకులు సాధించడానికే పుడతారు. తాము సాధించే ర్యాంకుపై పూర్తి నమ్మకంతో ఉంటారు. దాంట్లో కాస్తా అటూ ఇటూ అయినా వారి నమ్మకాన్ని మాత్రం కోల్పోరు. అలాంటి ఓ సంఘటనే కర్ణాటక పదో తరగతి బోర్డు పరీక్షా ఫలితాల్లో చోటుచేసుకుంది. మహ్మద్ కైఫ్ ముల్లా అనే విద్యార్థికి కర్ణాటక పదో తరగతి బోర్డు పరీక్షల్లో 625 మార్కులకు గానూ 624 మార్కులు వచ్చాయి. దాంతో రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచాడు. కానీ అతడికి ఫస్ట్ ర్యాంకు వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని భావించి సైన్స్ పేపర్కు రీ వాల్యుయేషన్ పెట్టించాడు. దానిలోనే మహ్మద్కు ఒక్క మార్కు తగ్గింది. అయితే రీవాల్యుయేషన్లో పూర్తి మార్కులు సాధించాడు. దాంతో అతడు కూడా పదో తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సొంతం చేసుకున్న జాబితాలో చేరాడు.మొదటి స్థానం సాధించడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. బెళగావిలోని పాఠశాలలో విద్యనభ్యసించిన మహ్మద్ పెద్దయ్యాక సివిల్ సర్వీసెస్లో ర్యాంకు తెచ్చుకొని బాల కార్మికులకు విద్యను అందించాలని ఆశిస్తున్నాడు. ‘ పరీక్షల అనంతరం నేను రాసిన సమాధానాలను టీచర్ల ద్వారా తెలుసుకున్నాను. మోడల్ పేపర్లు పరిశీలించాను. దాంతో నేను రాసినవన్నీ సరైనవేనన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నాను’ అని ఫలితాల అనంతరం ఆనందంతో వెల్లడించాడు మహ్మద్. ఈ ఘనత అంతా తల్లిదండ్రులు, తాతయ్యకే చెందుతుందన్నాడు. ఈ సంవత్సరం 8.5లక్షల మంది విద్యార్థులు కర్ణాటక బోర్డు పరీక్షలకు నమోదు చేసుకోగా, పరీక్షలు రాసిన వారిలో 6,02,802 మంది పాసయ్యారు. వారిలో ఇద్దరికి వందశాతం మార్కులు వచ్చాయి. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.