AdaraboinaShrikanth Posted July 2, 2018 Report Posted July 2, 2018 సీనియర్ నటుడు నరేష్ హీరోగా వచ్చిన చిత్రం "జంబలకిడిపంబ". ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ఆమని. ఆ తర్వాత 'శుభలగ్నం'లో 'ఏమిటో...' డైలాగుతో అందర్నీ ఆకట్టుకున్న నటి. ఎన్నో మంచి పాత్రలు పోషించి తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకుంది. కమర్షియల్ దర్శకులతో పాటు కళాత్మక దర్శకులైన బాపు, కె.విశ్వనాథ్లతో కూడా పనిచేసే అదృష్టం ఆమెకు దక్కింది. కెరీర్ పీక్లో ఉన్నప్పుడే హఠాత్తుగా ప్రేమపెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది నేను సినిమాలు చేయాలని మా అమ్మ చాలా ఎంకరేజ్ చేసింది. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్టేజ్కు వచ్చాం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ కష్టాలు కనిపించడం లేదా! ఇంత మంచి లైఫ్ నీకు దొరకదు అని అమ్మ గుర్తు చేసింది. కానీ అమ్మ మాటలు కూడా కేర్ చేయలేదు. అమ్మ చాలా ఫీలైంది. ఫైట్ చేసింది కూడా. చివరకు పెళ్లి చేసుకో... అయితే నటించు అంది. కానీ మా ఆయనకు నటించడం ఇష్టం లేదని చెప్పారు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టంతో వచ్చాను. నటనంటే నాకు చాలా ఇష్టం. అదే విషయం ఆయనకు చెబితే ఓకే అన్నారు. క్యాస్టింగ్ కౌచ్పై స్పందిస్తూ, ఖచ్చితంగా ఈ పరిస్థితి ఇండస్ట్రీలో ఉందని నేను చెప్పలేను. కానీ, తనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి గెస్ట్ హౌస్కు రమ్మని చెప్పారు. అంతే.. అంతటితో ఆ వ్యక్తికు మధ్య ఉన్న సంబంధం తెగిపోయిందని ఆమని చెప్పుకొచ్చింది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.