Jump to content

Recommended Posts

Posted

ఈ-ప్రగతి పథంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ విజయవాడలో వివరించారు. ప్రజలకు మేలైన పరిపాలన అందించేందుకు 34 శాఖల సేవలు ఒకే వేదిక పైకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ- ప్రగతి ప్రజల సేవలకు ముందు వరుసలో ఉండే ఒక కార్యక్రమమని.. కనిపించే ప్రభుత్వ సేవలు, కనిపించని ప్రభుత్వం విధానంలో మెరుగైన పౌర సేవలు అందించగలుగుతామని స్పష్టం చేశారు. ఈ- ప్రగతి పథంలో ఆధార్ సంఖ్య వినియోగం అత్యంత ప్రామాణికంగా నిలవనుందని తెలిపారు. కేవలం ప్రభుత్వ పౌర సేవలతో కాకుండా ఇతర సేవలకు కూడా దీన్ని వేదికగా రూపకల్పన చేశామన్నారు. యువతకు మెరుగైన అవకాశాలు అందించి పారిశ్రామిక వేత్తలుగా రూపుదిద్దేలా తీర్చిదిద్దుతామన్నారు. చాలామంది వారి డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసినా ఎలా రెన్యూవల్ చేసుకోవాలో తెలియక ఆసక్తి చూపరని.. అలాంటి సేవలు అందించగలిగితే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. ఆగస్టు నెలలో నిరుద్యోగ యువతకు చేయూతను అందించే నిరుద్యోగ భృతి కార్యక్రమం అమల్లోకి వస్తుందని.. దీనికోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపడుతున్నట్లు లోకేశ్‌ వెల్లడించారు.

 

 

 

Posted

em chesi em labaham.. 

Ajay babu la English lo G bumps speeches lev.. @~`

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...