Jump to content

Recommended Posts

Posted

న్యూదిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకీ పెరుగుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తనకు అవకాశం ఇస్తే పెట్రోలు, డీజిల్‌లను లీటర్‌ రూ.35-40కే విక్రయిస్తానని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ అన్నారు. పెట్రో ధరలు నియంత్రించడంలో భాజపా ప్రభుత్వం విఫలమైందని తానేమీ ఎద్దేవా చేయడం లేదని, కానీ, తనకు అవకాశం ఇస్తే మాత్రం ధరలు తగ్గించి చూపుతానని పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొత్త గరిష్ఠాలకు చేరిన సంగతి తెలిసిందే. నేడు లీటర్‌ పెట్రోలు ధర దేశ రాజధాని దిల్లీలో రూ.82 ఉండగా, ముంబయిలో రూ.89 ఉంది. ఇక డీజిల్‌ ధర రూ.78.33గా ఉంది. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాబా రామ్‌దేవ్‌ మాట్లాడారు. ‘‘నాకు ప్రభుత్వం అవకాశం ఇచ్చి, పన్నుల విషయంలో కాస్త ఉపశమనం ఇస్తే, పెట్రోల్‌, డీజిల్‌లను లీటరు రూ.35-40 విక్రయించేలా చేస్తా’’ అని అన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే, 28శాతం శ్లాబులో కాకుండా అతితక్కువ శ్లాబులోకి తీసుకురావాలని కోరారు. వాటిపై ఎక్సైజ్‌ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించవచ్చు కదా? అన్న ప్రశ్నకు రామ్‌దేవ్‌ సమాధానమిస్తూ.. పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోతే ప్రభుత్వం నడవటం కష్టమని, అందుకు ప్రతిగా, ధనవంతులపై అధిక పన్ను విధించాలని సూచించారు.

ఇప్పటివరకూ మోదీ ప్రభుత్వ విధానాలకు మద్దతు తెలిపిన రామ్‌దేవ్‌ బాబా గత కొంతకాలంగా భాజపాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే, 2014 ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీకి అనుకూలంగా మాట్లాడిన రామ్‌దేవ్‌ బాబా 2019 సాధారణ ఎన్నికల్లో తాను భాజపాకు ప్రచారం చేయనని ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘‘మోదీ ప్రభుత్వం ఎన్నో సరికొత్త విధానాలతో ముందుకు వచ్చింది. అయితే, కొన్ని మార్పులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పెరిగిన ధరలను తగ్గించాలి. త్వరలోనే మోదీ అందుకు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.’’ అని రామ్‌దేవ్‌ బాబా అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే, మోదీ ప్రభుత్వం కూడా స్వచ్ఛభారత్‌ వంటి అనేక మంచి కార్యక్రమాలను చేసిందన్నారు. ఇప్పటికీ తనకు మోదీపై విశ్వాసం ఉందన్నారు. ‘నేను రాజకీయాలకు దూరంగా ఉంటా. అన్ని పార్టీలతో నాకు మంచి సత్సంబంధాలే ఉన్నాయి. అయితే, ఫలానా పార్టీకే నా మద్దతు అని చెప్పాను. ఈ విషయంలో నేను ‘మౌన యోగ’ను ఆచరిస్తా’’ అనిచెప్పుకొచ్చారు.

Posted
13 hours ago, kevinUsa said:

న్యూదిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకీ పెరుగుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తనకు అవకాశం ఇస్తే పెట్రోలు, డీజిల్‌లను లీటర్‌ రూ.35-40కే విక్రయిస్తానని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ అన్నారు. పెట్రో ధరలు నియంత్రించడంలో భాజపా ప్రభుత్వం విఫలమైందని తానేమీ ఎద్దేవా చేయడం లేదని, కానీ, తనకు అవకాశం ఇస్తే మాత్రం ధరలు తగ్గించి చూపుతానని పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొత్త గరిష్ఠాలకు చేరిన సంగతి తెలిసిందే. నేడు లీటర్‌ పెట్రోలు ధర దేశ రాజధాని దిల్లీలో రూ.82 ఉండగా, ముంబయిలో రూ.89 ఉంది. ఇక డీజిల్‌ ధర రూ.78.33గా ఉంది. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాబా రామ్‌దేవ్‌ మాట్లాడారు. ‘‘నాకు ప్రభుత్వం అవకాశం ఇచ్చి, పన్నుల విషయంలో కాస్త ఉపశమనం ఇస్తే, పెట్రోల్‌, డీజిల్‌లను లీటరు రూ.35-40 విక్రయించేలా చేస్తా’’ అని అన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే, 28శాతం శ్లాబులో కాకుండా అతితక్కువ శ్లాబులోకి తీసుకురావాలని కోరారు. వాటిపై ఎక్సైజ్‌ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించవచ్చు కదా? అన్న ప్రశ్నకు రామ్‌దేవ్‌ సమాధానమిస్తూ.. పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోతే ప్రభుత్వం నడవటం కష్టమని, అందుకు ప్రతిగా, ధనవంతులపై అధిక పన్ను విధించాలని సూచించారు.

ఇప్పటివరకూ మోదీ ప్రభుత్వ విధానాలకు మద్దతు తెలిపిన రామ్‌దేవ్‌ బాబా గత కొంతకాలంగా భాజపాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే, 2014 ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీకి అనుకూలంగా మాట్లాడిన రామ్‌దేవ్‌ బాబా 2019 సాధారణ ఎన్నికల్లో తాను భాజపాకు ప్రచారం చేయనని ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘‘మోదీ ప్రభుత్వం ఎన్నో సరికొత్త విధానాలతో ముందుకు వచ్చింది. అయితే, కొన్ని మార్పులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పెరిగిన ధరలను తగ్గించాలి. త్వరలోనే మోదీ అందుకు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.’’ అని రామ్‌దేవ్‌ బాబా అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే, మోదీ ప్రభుత్వం కూడా స్వచ్ఛభారత్‌ వంటి అనేక మంచి కార్యక్రమాలను చేసిందన్నారు. ఇప్పటికీ తనకు మోదీపై విశ్వాసం ఉందన్నారు. ‘నేను రాజకీయాలకు దూరంగా ఉంటా. అన్ని పార్టీలతో నాకు మంచి సత్సంబంధాలే ఉన్నాయి. అయితే, ఫలానా పార్టీకే నా మద్దతు అని చెప్పాను. ఈ విషయంలో నేను ‘మౌన యోగ’ను ఆచరిస్తా’’ అనిచెప్పుకొచ్చారు.

evvadu idi ee statement ichindi ? Rs 35 ki vaadiki paduthundi anta ? janalaki matram Rs 135 per ltr ammuthada ?

Posted
1 hour ago, Staysafebro said:

Evarunayana idhi? Ambani gariki thelisindhante c/o pavuraala gutta.

yedunnav rajanna

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...