SonyKongara Posted September 18, 2018 Report Posted September 18, 2018 సైబర్వాడలోకి మరో ఐటీ దిగ్గజం 17-09-2018 09:59:11 ‘మేధ’లోకి జెమిని కన్సల్టింగ్ సర్వీస్ శాఖ 5 వేల అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు.. 100 మందికి ఉపాధి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్కు రూపకల్పన రాజధాని ప్రాంతంలో 9వ శాఖ .. ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల విజయవాడ: సైబర్వాడ కేసరపల్లి ‘మేధ’ ఐటీ టవర్లోకి మరో పరిశ్రమ వచ్చిచేరింది. జెమిని క న్సల్టింగ్ సర్వీసెస్ (జీసీఎస్) కంపెనీ ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తన శాఖను ఆదివారం ఏర్పాటు చేసింది. రాష్ట్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావులు జీసీఎస్ నూతన శాఖను ప్రారంభించారు. తొలుత వందమందికి స్థానికంగా ఉపాధి కల్పించింది. విభజన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలో ఐటీ పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి చేస్తున్న ఏపీ ఎన్ఆర్టీ సంప్రదింపులతో ఏర్పాటు చేసిన తొలి సంస్థగా జీసీఎస్ నిలిచింది. వివిధ కేటగిరీలకు సంబంధించి వ్యాపార కార్యకలాపాలకు అవసరమైన సాఫ్ట్వేర్స్ను ఈ సంస్థ తయారు చేసి అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్తర అమెరికా, మధ్య తూర్పు భారతదేశంలో తన శాఖలతో విస్తరించి అత్యుత్తమ సాఫ్ట్వేర్ ఉత్పత్తులను అందిస్తోంది. బహ్రెయిన్, కువైట్, దుబాయ్, ఒమన్ వంటి దేశాలతో పాటు భారతదేశంలో హైదరాబాద్, భువనేశ్వర్లలో శాఖలను విస్తరించిన జీసీఎస్ అమరావతి రాజధాని ప్రాంతంలో తొమ్మిదో శాఖను ఏర్పాటు చేసింది. వాస్తవానికి తొమ్మిదో ఈ శాఖ విశాఖలో ప్రారంభించాలని యాజమాన్యం భావించింది. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించటం ద్వారా వారి లో ప్రతిభా సంపత్తిని వెలుగులోకి రావడంతో రాజధాని ప్రాంతంలో వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలన్న సంక ల్పంతో ఇక్కడ సంస్థను ఏర్పాటు చేయటానికి నిర్ణయించింది. ముందుగా నైపుణ్య శిక్షణ ద్వారా ఎంపిక చేసుకున్న వందమందికి ఉద్యోగాలు కల్పించింది. వర్కింగ్ గ్రూపులు, ఛాంబర్లు, వర్క్ స్టేషన్లు, అధునాతన కంప్యూటర్లు, హై ఎండ్ స్పీడ్ ఇంటర్నెట్ వంటి సదుపాయాలను కల్పించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఈ బ్రాంచి ద్వారా పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ ఉత్పత్తులను ఎగుమతి చేయటం ద్వారా వృద్ధి సాధించగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. జీసీఎస్ కంపెనీ ఐఎన్సీ-5000 గుర్తింపును పొందింది. ప్రైవేటు ఐటీ పరిశ్రమలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలలో ఒకటిగా 2014, 2015, 2016 సంవత్సరాలలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఐటీని ఎంతో అభివృద్ధి చేశారు. విభజన తర్వాత 99 శాతం ఐటీ కంపెనీలన్నీ తెలంగాణాలో ఉన్నాయి. ఏపీలో కూడా ఐటీని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో అనేక రాయితీలు కల్పించటంతో పాటు ప్రభుత్వపరంగా చొరవ తీసుకుంటున్నారు. ఫలితంగా చాలా కంపెనీలు రాష్ర్టానికి వచ్చాయి. ఐటీ కంపెనీలకు ఆఫీసు స్పేస్ కల్పించటానికి ఏపీ ఎన్ఆర్టీ సహకారం ఎంతగానో ఉంది. అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, అమరావతి వంటి నగరాలలో కూడా ఐటీ అభివృద్ధి చేయాలన్న కృతనిశ్ఛయంతో ఉన్నారు. ముఖ్యమంత్రి చొరవతో హీరో, అశోక్ లేల్యాండ్, కియా వంటి భారీ పరిశ్రమలు వచ్చాయని , హార్డ్వేర్ హబ్గా ఏపీ మారుతోంది. తయారీ రంగంలో దేశంలో 30 శాతం వాటా ఏపీ నుంచే వెళుతోంది. జీసీఎస్ వంటి సంస్థ ఇక్కడ సేవలు అందించటం సంతోషకరం. - మంత్రి కొల్లు రవీంద్ర భవితకు భరోసా ఐటీ ఉన్న చోట ఉపాధి, ఆదాయం ఉంటుంది. ఐటీపరంగా అభివృద్ధి చెందిన నగరాలన్నీ అత్యుత్తమంగా నిలుస్తున్నాయి. చంద్రబాబు కృషి కారణంగా ఐటీ అంటే ప్రపంచంలో హైదరాబాద్ను గుర్తించారు. ఏపీలో ఐటీ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. మంత్రి నారాలోకేష్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా ఉండటం వల్ల కూడా ఐటీ రంగం పురోగమిస్తోంది. ఎన్నో పరిశ్రమలు కొలువు తీరుతున్నాయి. - ఎంపీ కొనకళ్ల నారాయణరావు కంపెనీల సామర్ధ్యాన్ని చూడండి.. ఐటీ పరిశ్రమ వస్తుందనగానే ఎన్నికోట్ల పెట్టుబడితో పెడుతున్నారు? ఎంతమందికి ఉపాధిని కల్పిస్తున్నారు? వంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఐటీ అంటే పెట్టుబడి, ఉపాధిని చూడకూడదు. సమర్ధతను చూడాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. తద్వారా ఐటీ రంగాన్ని బలోపేతం చేసుకోవటానికి, వృద్ధి చేసుకోవటానికి అవకాశం కలుగుతుంది. - రవి వేమూరు, ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షుడు ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందిస్తాం చెరువుల వ్యాపారం చేసే నేను అనూహ్యంగా ఐటీ రంగంలో కాలు మోపాను. జెమిని కన్సల్టింగ్ సర్వీసె్సను స్థాపించాను. ఉత్తర అమెరికాతో పాటు దేశీయంగా బ్రాంచీలను ఏర్పాటు చేసి ప్రపంచస్థాయిలో అత్యుత్తమ సాఫ్ట్వేర్ ఉత్పత్తులు చేయటం జరుగుతోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో మా తొమ్మిదవ శాఖను ఏర్పాటు చేశాం. ఇక్కడి వారిలో ఎంతో టాలెంట్ ఉంది. వారికి మేమే శిక్షణనిచ్చి ఇక ్కడి బ్రాంచీలో పని చేయటానికి వంద మందికి ఉద్యోగాలు కల్పించాం. - శ్రీని రజనీకాంత్, జీసీఎస్ సీఈవో Quote
SonyKongara Posted September 18, 2018 Author Report Posted September 18, 2018 మేథ’ను మరపించేలా.. 18-09-2018 10:00:33 హైటెక్ సిటీలో శరవేగంగా రెండో ఐటీ టవర్ నిర్మాణం రూ.300 కోట్ల వ్యయంతో జీ ప్లస్ 6 విధానంలో నిర్మాణం పార్కింగ్తో కలిపి 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రస్తుతం జీ ప్లస్ త్రీ వరకు నిర్మాణ పనులు పూర్తి భూ గర్భంలోనే జీ ప్లస్ 1 ఫ్లోర్లు 2019 జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభోత్సవం విజయవాడ (ఆంధ్రజ్యోతి): ‘మేథ’కే కళ్లు కుట్టేంతగా... సైబర్వాడ కేసరపల్లిలోని ‘ఏస్ అర్బన్ - ఏపీఐఐసీ’ హైటెక్ సిటీలో రెండవ ఐటీ టవర్ రూపుదిద్దుకుంటోంది. మేథ టవర్ కంటే దాదాపు రెట్టింపు విస్తీర్ణంలో, రెట్టింపు స్పేస్తో రెండవ ఐటీ టవర్ శరవేగంగా నిర్మాణం జరుగుతోంది. మరో మూడు నెలల్లోనే ఇది ఆర్కిటెక్చర్ డిజైన్కు అనుగుణంగా పూర్తి రూపం సంతరించుకోనుంది. నూతన సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మాసాలలోనే ఎన్నికల ముందుగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభోత్సవం చేసుకు నేందుకు వీలుగా వేగంగా పనులు జరుగుతున్నాయి. కేసరపల్లి హైటెక్ సిటీలో జరుగుతున్న రెండవ ఐటీ టవర్ నిర్మాణ పనులను సోమవారం ఆంధ్రజ్యోతి పరిశీలించింది. నిర్మాణ పనులపై ప్రత్యేక కథనం... ఒక్క అడుగు.. మరో అడుగుకు పునాది వేసింది! ఏడాది కాలంలోనే కళ్లు చెదిరే ఐటీ టవర్ సాక్షాత్కరించబోతోంది. కేసరపల్లి హైటెక్సిటీలో రెండవ ఐటీ టవర్ నిర్మాణ పనులు తుది అంకానికి వచ్చాయి. హైటెక్సిటీలో మొట్టమొదటి టవర్గా ఏర్పడిన ‘మేథ’ కు వెనుక భాగంలో రూ.300 కోట్ల వ్యయంతో రెండో ఐటీ టవర్ రూపుదిద్దుకుంటోంది. మొత్తం పార్కింగ్తో కలిపి 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండవ ఐటీ టవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ఐటీ టవర్ ను జీ ప్లస్ 6 విధానంలో నిర్మిస్తున్నారు. హైటెక్ సిటీకి అభిముఖంగా జాతీయ రహదారి - 16 కు అవతల వైపు అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం వల్ల భవిష్యత్తులో ఎత్తు అవరోధంగా ఉండకూడదన్న ఉద్దేశ్యంతో భూమిలోనే జీ ప్లస్ 1 నిర్మాణం ఉండేలా నిర్మించటం రెండవ ఐటీ టవర్ నిర్మాణం ప్రత్యేకత. రెండవ ఐటీ టవర్ రెండు భవనాల కలబోతగా ఉంటుంది. ఒక భవనం నిర్మాణం జీ ప్లస్ 4 వరకు వచ్చింది. మరో భవనానికి సంబంధించి అతి కీలకమైన బేస్మెంట్ పనులు జరుగుతున్నాయి. ఈ రెండు భవన నిర్మాణాలు ఒకదానికొకటి అభిముఖంగా ఉంటాయి. రెండవ ఐటీ టవర్ నిర్మాణ పనులు ఒక మహా సంగ్రామాన్నే తలపిస్తున్నాయి. హైటెక్ సిటీ ఆవరణలో పనుల తీరు చూస్తే దీని నిర్మాణ పనులు ఎంత మహోధృతంగా జరుగుతున్నాయో అర్థమౌతుంది. హైటెక్ సిటీలోని నిరుపయోగ ప్రాంతాన్ని కాంట్రాక్టు సంస్థ స్వాధీనంలోకి తీసుకుంది. భారీగా కంకర, ఐరన్, సిమెంట్, ఇసుక తదితర మెటీరియల్ను డంప్ చేసుకుంది. బయటకు ఎక్కడికీ వెళ్లే అవసరం లేకుండా అన్నీ హైటెక్ సిటీలోనే అందుబాటులో ఉంచుకుంది. ఆవరణలోనే కాంక్రీట్ రెడీ మిక్స్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ నిరంతరాయంగా కాంక్రీట్ మిక్సింగ్ జరుగుతోంది. మరోవైపు ఐరన్ బెండింగ్ వర్క్స్ పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఐటీ టవర్ నిర్మాణాన్ని భారీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్రేన్ నిర్మిస్తోంది. సుశిక్షితులైన నిపుణుల సమక్షంలో నిర్మాణ పర్యవేక్షణ జరుగుతోంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.