Jump to content

Recommended Posts

Posted

రాజ‌కీయం రాజ‌కీయ‌మే. అభివృద్ధి అభివృద్ధే. ప్ర‌జా సంక్షేమానికి అడ్డంకే ఉండ‌కూడ‌దు. స్థూలంగా టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌ణాళిక ఇది. రాజ‌కీయంగా ఎన్ని అవ‌రోధాలు ఎదురైనా రోజులో కొంత భాగం కేంద్రంతో పోరాటం, బీజేపీ కుట్ర‌ల‌ను ఎదుర్కొవ‌డానికి కేటాయించినా అత్య‌ధిక స‌మ‌యం మాత్రం ప్ర‌జా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోస‌మే కేటాయిస్తు చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో ప‌ని చేసుకుపోతున్నారు. ఐటీ దాడులు చేస్తూ రాష్ట్రంలో భ‌యాన‌క వాతావ‌ర‌ణ క‌ల్పించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుంటే చంద్ర‌బాబు మాత్రం దానికి ధీటుగా అభివృద్ధి య‌జ్ఞం కొన‌సాగిస్తున్నారు. ఇందుకు తాజాగా చంద్ర‌బాబు పెట్టుకున్న ల‌క్ష్య‌మే నిద‌ర్శ‌నం. ప్ర‌జ‌ల గ్యాస్ క‌ష్టాలు తీర్చేందుకు అమరావతి-విజయవాడ-రాజమహేంద్రవరం-విశాఖపట్నం గ్రీన్‌ కారిడార్‌ కింద ఉన్న జిల్లాల్లో 2020 నాటికల్లా లక్షల ఇళ్లకు పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ (పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌-పీఎన్‌జీ) అందించే ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్‌ గ్యాస్‌ పంపిణీ సంస్థ ఏపీజీడీసీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

10-babu-57454.jpg

 

ఏపీని గ్యాస్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు అవసరమైన ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేయాలని చంద్ర‌బాబు అధికారుల‌కు సూచించారు. రానున్న నాలుగేళ్లలో లక్షలాది కుటుంబాలకు వంటగ్యాస్‌ సిలిండర్‌ ఇబ్బందులను తగ్గించడంతో పాటు వాహనాలు, పరిశ్రమలకు సహజ వాయువును 40 శాతం తక్కువ ధరకు అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గృహ అవసరాలకు వినియోగించే రాయితీ ఎల్‌పీజీ సిలిండర్ల కంటే పీఎన్‌జీ 10 శాతం తక్కువకే లభిస్తుందని, పైగా వినియోగదారులకు సిలిండర్ల సమస్య ఉండదని తెలిపారు. సంప్రదాయ పెట్రోలు, డీజిల్‌ కంటే వాహనాలకు సీఎన్‌జీ (కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) వాడటం వల్ల చమురు, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని వెల్లడించారు. చమురు, ఎల్‌పీజీ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నార‌ని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న స‌హ‌జ వ‌న‌రుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకుంటే ల‌క్ష‌లాది మంది గ్యాస్ క‌ష్టాలు తీరిన‌ట్లేన‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఇక్కడ అందుబాటులో ఉన్న సీఎన్‌జీ… పెట్రోల్‌, డీజిల్‌తో పోల్చితే 35-40 శాతం తక్కువ ధరకే దొరుకుతుందని తెలిపారు. పెట్రో ధరలు రోజువారీ మారుతున్నాయని, సీఎన్‌జీ ధరలు మాత్రం స్థిరంగా ఉంటాయని వెల్లడించారు. గోదావరి జిలాల్లో ఏపీజీడీసీ రూ.2500 కోట్లతో చేపట్టిన సహజవాయువు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. ‘మహిళా సంక్షేమానికే నా తొలిప్రాధాన్యం. పైపులైన్ల ద్వారా వంటగ్యా్‌సను నేరుగా ఇళ్లకే, అదీ తక్కువ ధరకే అందించాలన్నదే నా లక్ష్యం. పీఎన్‌జీ ద్వారా మహిళా సాధికారత సాధ్యమవుతుంది. లక్షలాది పేద, మధ్య తరగతి కుటుంబాలు లబ్ధి పొందుతాయి. వాణిజ్య అవసరాలకు సహజ వాయువును 35-40 శాతం తక్కువ ధరకే అందించడం వల్ల పారిశ్రామికీకరణ పెరిగి భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అని ముఖ్య‌మంత్రి వివ‌రించారు.

10-babu-42.png

గ్యాస్‌ ధర తక్కువే కాకుండా సంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే కాలుష్యం కూడా తగ్గుతుందని తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సహజ వాయువు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టు 3-4 ఏళ్లలో పూర్తవుతుందని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ సీఎంకు తెలిపారు. గోదావరి జిల్లాల్లో 1.2లక్షల గృహాలు, 300 వాణిజ్య సంస్థలను అనుసంధానం చేయాలని ఏపీజీడీసీ లక్ష్యంగా పెట్టుకుందని, 2020కల్లా 35 సీఎన్‌జీ స్టేషన్లు అందుబాటులోకి తెస్తామని వివరించారు. కాకినాడతీరంలో ఫ్లోటింగ్‌ స్టోరేజ్‌ అండ్‌ రీగ్యాసిఫికేషన్‌ యూనిట్‌ (ఎఫ్‌ఎ్‌సఆర్‌యూ)పైనా దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను ప్రముఖ సలహాసంస్థ వర్లీ పార్సన్స్‌ నివేదిక సిద్ధం చేసిందని తెలిపారు. గోదావరి జిల్లాల్లో సుదీర్ఘకాలం పాటు పరిశ్రమలకు అందుబాటు ధరల్లో గ్యాస్‌ సరఫరా చేసేలా ఒప్పందాలు చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

 
Posted

Election propaganda , eedu eppudu adukovadam , edavadam, lekapothe bhajana 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...