Jump to content

Recommended Posts

Posted

065game129code.JPG

బ్రహ్మోస్‌ క్షిపణి రహస్యాలను దేశం దాటించిన కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బ్రహ్మోస్‌ ఇంజినీర్‌ నిషాంత్‌ అగర్వాల్‌పై పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు మహిళలు వలపు వల విసిరినట్లు తేలింది. నాగ్‌పుర్‌, పిలానీలోని బ్రహ్మోస్‌కు చెందిన ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్న నిషాంత్‌ వీరికి చాలా సమాచారం చేరవేసినట్లు తేలింది. దాదాపు రెండేళ్లుగా ఈ వ్యవహారం సాగుతున్నట్లు ఏటీఎస్‌ అధికారులు గుర్తించారు. ఆ మహిళలు నిషాంత్‌కు ఓ ఉద్యోగాన్ని కూడా ఆఫర్‌ చేసినట్లు తేలింది. ఈ మహిళలు పాకిస్థాన్‌కు చెందిన ఐపీ అడ్రస్‌ల నుంచి నిషాంత్‌తో టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో మరింత మంది పేర్లు బయటపడే అవకాశం ఉండటంతో ఆ మహిళల వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ మహిళలతో పాటు ఓ అమెరికా నిఘా సంస్థతో కూడా నిషాంత్‌ టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

అగర్వాల్‌ ల్యాప్‌టాప్‌లో కీలక సమాచారం.. 
నిషాంత్‌ అగర్వాల్‌ నుంచి స్వాధీనం చేసుకొన్న ల్యాప్‌టాప్‌లో బ్రహ్మోస్‌ ప్రాజెక్టుకు చెందిన కీలక సమాచారం ఉన్నట్లు గుర్తించారు. ఈ సమాచారం అతని ల్యాప్‌టాప్‌లో ఎందుకున్నది అనే ప్రశ్నకు నిషాంత్‌ నుంచి సరైన సమాధానం లేదు. దీంతో అధికారులు పాకిస్థాన్‌ మహిళలతో నిషాంత్‌ సంభాషణల సమాచారాన్ని వెలికితీస్తున్నారు. లక్ష్యాలను గుర్తించేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతకు సంబంధించిన అంశాలు శత్రువులకు చేరినట్లు భావిస్తున్నారు. ఈ పరిజ్ఞానం పైనే బ్రహ్మోస్‌ కచ్చితత్వం ఆధారపడి ఉంటుంది. ఈ సమాచారం మొత్తాన్ని ఓ గేమింగ్‌ కోడ్‌ సాయంతో శత్రువులకు చేరవేసినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు ఈ కోడ్‌ను ఛేదించే పనిలో ఉన్నారు.

గతంలో నిషాంత్‌ బ్రహ్మోస్‌కు వార్‌హెడ్‌ అమర్చే ప్రాజెక్టులో కూడా పనిచేశారు. ఈ బృందంలో దాదాపు 40 మందికి అతను నేతృత్వం వహించాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన నిషాంత్‌ అగర్వాల్‌కు ఇటీవలే ‘ది యంగ్‌ సైంటిస్ట్‌’ అవార్డు కూడా వచ్చింది.

బయటపడింది ఇలా.. 
సెప్టెంబర్‌లో ఓ భారత జవాన్‌ పాకిస్థానీల వలపువల చిక్కినట్లు గుర్తించి అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత దేశంలోని కీలక ప్రాజెక్టులపై నిఘాను పెంచారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌ నుంచి నిర్వహిస్తున్న తప్పుడు ఫేస్‌బుక్‌ ఖాతాలపై నిఘా వేశారు. ఈ క్రమంలో నిషాంత్‌ కూడా వలపు వలలో చిక్కినట్లు గుర్తించారు. దీంతో మిలటరీ ఇంటెలిజెన్స్‌, యూపీ ఏటీఎస్‌, మహారాష్ట్ర పోలీసులు అతనిపై నిఘావేసి దాడి చేశారు. అతని ల్యాప్‌టాప్‌లో నిబంధనలకు విరుద్ధమైన సమాచారం ఉన్నట్లు గుర్తించారు. అసలు ఆ సమాచారం అతనికి వద్దకు ఎలా చేరిందో అధికారులకు అంతుబట్టడంలేదు.

శత్రువుల లక్ష్యం బ్రహ్మోస్‌.. 
బ్రహ్మోస్‌ క్షిపణి సమాచారం విదేశీ నిఘా సంస్థలకు లక్ష్యంగా మారింది. ఇటీవల దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంధన నిర్వహణ వ్యవస్థ, లోహ రహిత ఎయిర్‌ ఫ్రేమ్‌ భాగాలు, శత్రులక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో గుర్తించే ‘సీకర్‌’ సాంకేతికత వంటి వాటిని దీనిలో వినియోగిస్తున్నారు. ఇవే శత్రుదేశాలకు లక్ష్యంగా మారాయి.

Posted

సెప్టెంబర్‌లో ఓ భారత జవాన్‌ పాకిస్థానీల వలపువల చిక్కినట్లు గుర్తించి అధికారులు అరెస్టు చేశారు.

 

asalu itla ala trap aytharu man... 

Posted
11 minutes ago, Biskot said:

సెప్టెంబర్‌లో ఓ భారత జవాన్‌ పాకిస్థానీల వలపువల చిక్కినట్లు గుర్తించి అధికారులు అరెస్టు చేశారు.

 

asalu itla ala trap aytharu man... 

jawan ki Brahmos gurinchi em telusani.. kaaka...🤔

Posted
50 minutes ago, Biskot said:

సెప్టెంబర్‌లో ఓ భారత జవాన్‌ పాకిస్థానీల వలపువల చిక్కినట్లు గుర్తించి అధికారులు అరెస్టు చేశారు.

 

asalu itla ala trap aytharu man... 

Honey trap antaar masstaaru..evadiki weakness vadvi

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...