ARYA Posted November 1, 2018 Report Posted November 1, 2018 దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకి లేనంతగా రెండు తెలుగురాష్ట్రాలలో కలిపి 70 లక్షల పైచిలుకు కార్యకర్తలను కలిగిఉంది తెలుగుదేశం పార్టీ. పార్టీ లోని ప్రతి కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షల ప్రమాదబీమా అందిస్తున్న దేశంలోని మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీనే. ఇలాంటి పార్టీలో సభ్యత్వం తీసుకునే మహత్తర అవకాశం రెండేళ్ళకోసారి కలుగుతుంది. తెలుగుదేశం పార్టీ 2018-20 సభ్యత్వ నమోదు/ పునరుద్ధరణ కార్యక్రమం రేపటి (నవంబర్ 1, 2018) నుండే ప్రారంభం అవుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈరోజు ( అక్టోబర్ 31, 2018) లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. సభ్యత్వం తీసుకునే వారి లేదా ఉన్న సభ్యత్వాన్ని పునరుద్ధరించుకునే వారి కోసం కొన్ని సూచనలు: మీరు ఇదివరకే తెదేపా సభ్యత్వం తీసుకున్నట్లయితే పునరుద్ధరణ కోసం 2016-18 సభ్యత్వ కార్డు తీసుకుని సభ్యత్వ నమోదు కౌంటరుకు రావాలి. సభ్యత్వ కార్డు నెంబర్ చెప్పినా చాలు. లేదా 2016-18 సభ్యత్వ సమయంలో ఇచ్చిన ఓటర్ ఐడి చూపించాలి. అదీ లేదంటే ఆనాడు నమోదు చేయించిన మొబైల్ నెంబర్ ను చెప్పాలి. కొత్తగా నమోదు చేసుకోవాలంటే ప్రస్తుత మీ సొంత ఓటర్ ఐడి తీసుకుని రావాలి. ఓటు హక్కు లేని వారయితే వారి కుటుంబ సభ్యుల ఓటర్ ఐడితో, నమోదు సమయంలో వారి కుటుంబ సభ్యుని ఓటర్ గా చెప్పి నమోదు చేసుకోవచ్చు. సభ్యత్వ నమోదు /పునరుద్ధరణ రుసుము రూ.100/-లు. దేశంలో మొదటిసారిగా తన కార్యకర్తల సంక్షేమం కోసం రెండు సంవత్సరాలకు వర్తించే రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని తన సభ్యులకు అందిస్తోంది తెలుగుదేశం. సభ్యత్వ మరియు ప్రమాద బీమా కాలపరిమితి రెండు సంవత్సరాలు (జనవరి 1, 2019 నుండి డిసెంబర్ 31,2020 వరకు ) ఉంటుంది. సభ్యత్వ నమోదు /పునరుద్ధరణ తర్వాత తప్పని సరిగా రశీదు తీసుకుని మీ పేరు సరిచూసుకోవాలి. కార్యకర్తలారా కదలి రండి! అసంఖ్యాక సభ్యత్వ నమోదుతో సరికొత్త రికార్డులను సృష్టిద్దాం! Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.