ARYA Posted November 6, 2018 Report Posted November 6, 2018 ఏడిద నాగేశ్వరరావు నిర్మాణంలో కె. విశ్వనాధ్ దర్శకత్వంలో రూపొందించబడి, 1986 మార్చిలో విడుదలైన 'స్వాతిముత్యం' శతదినోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా విచ్చేసారు బాలీవుడ్ ప్రముఖుడు రాజ్ కపూర్. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ రాజ్ కపూర్ కు జ్ఞాపికను అందిస్తున్నప్పటి చిత్రం ఇది. ఎన్టీఆర్ వలెనే రాజ్ కపూర్ కూడా అభిరుచిగల నిర్మాత. ఎన్టీఆర్ నిర్మించిన 'దానవీరశూర కర్ణ' చిత్ర నిడివి 4 గంటల 17 నిముషాలయితే, రాజ్ కపూర్ నిర్మించిన ' మేరా నామ్ జోకర్' నిడివి మొదట 4 గంటల 24 నిముషాలు కాగా తర్వాత అందులో 40 నిముషాలు తగ్గించారు. ఈ రకంగా అప్పట్లో ఎక్కువ నిడివి గల భారతీయ చిత్రాల నిర్మాతలుగా వీరిద్దరూ రికార్డులకెక్కారు. ఆ తర్వాత 1987లో తమస్ అనే హిందీ చిత్రం, 2005లో 'తవమై తవమిరుందు' అనే తమిళ చిత్రం ఈ రికార్డును అధిగమించింది. దీని నిడివి నాలుగు గంటల 35 నిమిషాలు. ఎక్కువసేపు సినిమాలయినప్పటికీ ఎన్టీఆర్, రాజ్ కపూర్ ల సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అయితే ముగ్గురు హీరొయిన్ లను పెట్టి తీసిన 'మేరా నామ్ జోకర్' వాణిజ్యపరంగా దెబ్బతింటే, మూడు పాత్రలతో సినిమా ఆద్యంతమూ తానే కనిపించి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన 'దానవీరశూర కర్ణ' వ్యాపారపరంగానూ విజయవంతమైంది. అదే సమయంలో భారత్ లో పర్యటిస్తున్న రష్యా సాంస్కృతిక బృందం 'దానవీరశూర కర్ణ' చిత్రాన్ని చూసి... ఇంత నిడివిగల చిత్రాన్ని ఎన్టీఆర్ ఒక్కడే కనిపిస్తూ, ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం అత్యద్భుత విషయంగా పేర్కొంది. కేవలం 43 రోజుల్లో ఈ చిత్రం నిర్మించబడిందని తెలుసుకుని మరింత ఆశ్చర్యపోయారు వారు. అదీ ఎన్టీఆర్ సత్తా. ఎన్టీఆర్ మరణాంతరం ఆయన పేరిట 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ అవార్డును నెలకొల్పింది. ఈ అవార్డు విజేతలకు దేశంలోనే అత్యధికంగా ఐదు లక్షల రూపాయల నగదు బహుమతితోపాటు, అవార్డును, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. భారతీయ చలన చిత్రరంగంలో విశేషంగా కృషి చేసిన నటీ నటులకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 2002లో అప్పటికే స్వర్గీయులైన రాజ్ కపూర్ కు ఎన్టీఆర్ జాతీయ అవార్డును ఇచ్చారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.