Jump to content

Recommended Posts

Posted

రాష్ట్రంలో సీబీఐకి సోదాలు చేపట్టే అధికారాన్ని నిరాకరిస్తూ  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే ‘సమ్మతి’ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గతంలో ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ను విత్‌ డ్రా చేసుకుంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ మినహా మిగతా రాష్ట్రాల్లో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాలు సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది. అయితే ఏపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దు చేయడంలో రాష్ట్రంలో దాడులు, దర్యాప్తు చేసేందుకు సీబీఐ పరిధి రద్దు అయినట్టు పేర్కొంది. రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించడానికి కూడా సీబీఐకి అధికారం ఉండదు.తద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కూడా రాష్ర్ట ఏసీబీనే దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కాగా, చంద్రబాబు సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం పలు అనుమానాలకు తావిస్తోంది. 

అనుమానాలకు తావిస్తున్న ప్రభుత్వ నిర్ణయం..
దేశంలో సీబీఐ ప్రతిష్ట దెబ్బతిందని పైకి చెబుతున్నప్పటికీ చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసలు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో ఏ మేరకు న్యాయబద్ధమైనది అనే విషయంపై పలువురు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు తన అనుచరులపై దాడి చేస్తే.. దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడాన్ని నిరాకరిస్తూ జీవో జారీ చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పుబడుతున్నారు.  

సీబీఐ అంటే చంద్రబాబుకు ఎందుకు భయం?
అంతే కాకుండా రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై కేంద్ర ప్రభుత్వ సంస్థలచే దర్యాప్తు చేయాలని ఆ పార్టీ పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి తమ డిమాండ్‌ను వారి దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. కేంద్ర సంస్థలచే విచారణ జరిపితే చంద్రబాబు లోసుగులు బయటపడతాయనే భయంతో, కేసును పక్కదారి పట్టించాలనే ఆలోచనతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాగే చంద్రబాబు సీబీఐ అంటే ఎందుకు భయపడుతున్నారని విపక్షాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. 

 

ఒకప్పుడు సీబీఐని కీర్తించిన చంద్రబాబు.. ఇప్పడు సీబీఐకి రాష్ట్రంలోకి అనుమతి లేదంటూ నిర్ణయం తీసుకోవడం మారోమారు ఆయన అవకాశవాదాన్ని తెలియజేస్తుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని కేంద్ర సంస్థలు నిగ్గు తెలుస్తున్న వేళ.. ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థ విషయంలో ఈ విధంగా వ్యవహారించడం వల్ల ప్రజల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసిన విషయాన్ని కూడా కేవలం అనుకూల మీడియాకు మాత్రమే తెలుపడాన్ని గమనిస్తే.. దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 

Posted

em nashtam ledu. Pilla congress leaders business lu anni elagu Hyderabad lone edchayee. 

Posted
సీబీఐకి ఎర్ర జెండా 
రాష్ట్రంలోకి ప్రవేశం లేదు 
  సాధారణ సమ్మతి నోటిఫికేషన్‌ ఉపసంహరణ 
  ఏపీలో దాడులు, దర్యాప్తు చేపట్టే అవకాశం సీబీఐకి ఉండదు 
  కేంద్ర సంస్థలపై ఏసీబీతో సోదాలు చేసేందుకు అవకాశం 
  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సంచలన నిర్ణయం 
ఈనాడు - అమరావతి 
15ap-main1a.jpg

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు రాష్ట్రంలో దాడులు, దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆ సంస్థ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే ‘సమ్మతి’ ఉత్తర్వును ఉపసంహరించుకుంది. అంతర్గత విభేదాలతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రతిష్ఠ మసకబారిందని, రాష్ట్రంలో ఆ సంస్థ ప్రమేయం అవసరం లేదని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దిల్లీ మినహా ఏదైనా రాష్ట్రంలో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాలు సాధారణ సమ్మతి (జనరల్‌ కన్సెంట్‌) తెలపాల్సి ఉంటుంది. గతంలో రాష్ట్రం ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా మన రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై దాడి చేయడానికి సీబీఐకి అవకాశం ఉండదు. తాజా ఉత్తర్వుతో రాష్ట్రంలో దాడులు చేయడానికి సీబీఐకి పరిధి రద్దయింది. 
కేంద్ర ప్రభుత్వం అధీనంలోని సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏసీబీ రెండూ అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్టు) ప్రకారం కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతుంటాయి. అయితే సీబీఐ రాష్ట్ర భూభాగంలో తన అధికారాలను అమలు చేసేందుకు వీలు లేకుండా పోయిన నేపథ్యంలో ఏపీలో సీబీఐ పాత్రను మన రాష్ట్ర ఏసీబీయే పోషించే అవకాశముంది. రాష్ట్రంలో పనిచేస్తూ అవినీతికి పాల్పడే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేయొచ్చు. ఆదాయపు పన్ను శాఖ, పోర్టులు, తపాలా కార్యాలయాలు, సెంట్రల్‌ ఎక్సైజ్‌, టెలిఫోన్‌ కార్యాలయాలు, వాటిలోని ఉద్యోగులపై దాడులు చేయడానికి, సోదాలు నిర్వహించేందుకు, కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు వీలవుతుంది. ఈ అధికారాలన్నింటినీ సమీప భవిష్యత్తులో ఏసీబీ వినియోగించుకునేందుకు కసరత్తు చేస్తోంది. తద్వారా రాజకీయ కక్ష సాధింపు ధోరణితో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేయిస్తున్న దాడులకు సహకరించే, కొమ్ముకాసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గట్టిగా గుణపాఠం చెప్పాలని భావిస్తోంది. తమ జోలికి వస్తే... చేతులు ముడుచుకుని కూర్చోబోమని, అంతకు అంత బదులు చెబుతామని కేంద్రానికి ఓ గట్టి హెచ్చరిక పంపించాలనుకుంది. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీబీఐకి ఎర్రజెండా చూపించిందని భావిస్తున్నారు.

ఏమిటీ ‘సాధారణ సమ్మతి’... 
దిల్లీ స్పెషల్‌ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం-1946 ప్రకారం కేంద్రం సీబీఐని ఏర్పాటు చేసింది. ఈ మేరకు దఖలు పడిన అధికారాలను సీబీఐ దిల్లీ భూభాగం పరిధిలోనే అమలు చేయడానికి అవకాశముంది. దిల్లీ బయట దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా తమ అధికారాలను అమలు చేసి దాడులు, దర్యాప్తు చేపట్టాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐకు తమ భూభాగంలో పరిధిని కల్పిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేయాలి. అవినీతి నిరోధక చట్టం-1988, ఐపీసీలోని కొన్ని సెక్షన్లు, 63కు పైగా కేంద్ర చట్టాల్లోని సెక్షన్ల ప్రకారం సీబీఐ ఆయా రాష్ట్రాల భూభాగంలో నేరాల దర్యాప్తు చేసేందుకు సాధారణ సమ్మతి(జనరల్‌ కన్సెంట్‌)ను ఇవ్వాలి. సాధారణ సమ్మతిని రాష్ట్రాలు వెనక్కి తీసుకునే అధికారం కూడా చట్టంలో నిర్దేశించారు. అయితే ఒకటి, రెండు రాష్ట్రాలు వేర్వేరు కారణాలతో ఈ సమ్మతిని ఇవ్వడం లేదు. ఏపీ ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు ఈ సమ్మతిని ఇస్తూ వస్తోంది. దీనికి సంబంధించి చివరిసారిగా ఈ ఏడాది ఆగస్టు మూడో తేదీన సాధారణ సమ్మతి నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పలు నిర్వహణపరమైన సమస్యలతో సీబీఐ పనితీరు మందగించిందని, తన పాత్రను సమర్థంగా నిర్వహించలేకపోతోందని ఓ సీనియర్‌ న్యాయవాది రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రమిచ్చారు. సీబీఐతో పోలిస్తే రాష్ట్ర దర్యాప్తు సంస్థలే వృత్తిపరంగా మెరుగ్గా వ్యవహరిస్తున్నాయని, ఆధునికంగా ఉన్నాయని తెలిపారు. సరిపడా సిబ్బంది, దర్యాప్తు అధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, అవసరమైన సాధనా సంపత్తి కూడా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు ఇక్కడ జరిగే నేరాలను దర్యాప్తు చేసే సమర్థత ఉన్నందున... సీబీఐకు సాధారణ సమ్మతి ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆ మేరకు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆ వినతిపైన, ఆ మధ్య జరిగిన కేంద్రప్రభుత్వ సంస్థల దాడులపైనా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసింది. మంత్రివర్గ సమావేశంలోనూ చర్చించింది. రాజకీయ దురుద్దేశాలతో ఆంధ్రప్రదేశ్‌లో వరుస ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయని మంత్రి వర్గం గట్టిగా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సీబీఐకి సాధారణ సమ్మతి ఇచ్చే, వెనక్కి తీసుకునే అధికారం రెండూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నందున...‘సమ్మతి’ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.

Posted
1 minute ago, kingcasanova said:

Bodi gaadi paristhithi endi ipudu?

em nashtam ledu. Pilla congress leaders business lu anni elagu Hyderabad lone edchayee. 

 
Posted
1 hour ago, FJ40 said:

Bhayya  Bokka bodi ki kaadu.... ap prajala ki .... cbn oddu ani open ga declare chesindu memu donga panulu chestam state agencies ni manAge chesukuntam ani... no one shd question ani.... deenini kuda support chese antha janala ni yellow wash chesara cbn / yellow media?.

Pity ppl who can’t see thru this.

theliyakunda matlaaduthunnava, thelisi kooda theliyanattu natisthunnaava bhayya? CBI correct ga pani chesi enni years ayyindi? central govt direction lo opposition parties ni kelakadam thappa, CBI and IT are doing nothing. directors ye dorikipoyaaru. ishtam vachinapudu case lu peduthunnaaru ishtam vachinapudu clean chit isthunnaaru. pedda sanjala kompa laaa thayyaaru ayyindi. CBI, ED and IT ni state lo kaalu petta kunda chesthe santosha pade vaallalo CBN kannaa mundhu okadunnaaadu kingcasanova

Posted
1 minute ago, kingcasanova said:

theliyakunda matlaaduthunnava, thelisi kooda theliyanattu natisthunnaava bhayya? CBI correct ga pani chesi enni years ayyindi? central govt direction lo opposition parties ni kelakadam thappa, CBI and IT are doing nothing. directors ye dorikipoyaaru. ishtam vachinapudu case lu peduthunnaaru ishtam vachinapudu clean chit isthunnaaru. pedda sanjala kompa laaa thayyaaru ayyindi. CBI, ED and IT ni state lo kaalu petta kunda chesthe santosha pade vaallalo CBN kannaa mundhu okadunnaaadu kingcasanova

Isstam vachinattu kummaku ayyi case lu pettaru Jagan Medha

Dani resulte pilla Congress alias Telugu Congress antunna vennupotu anti fans

Kandistunna psyco uncle

 

Posted
1 hour ago, Smallpappu said:

Isstam vachinattu kummaku ayyi case lu pettaru Jagan Medha

Dani resulte pilla Congress alias Telugu Congress antunna vennupotu anti fans

Kandistunna psyco uncle

 

ipudu jaggad happine gaa kingcasanova

Posted
12 minutes ago, kingcasanova said:

ipudu jaggad happine gaa kingcasanova

Babu Garu Ila selfgoals esukunte jr NTR kuda happy ne

  • Haha 1
Posted
6 hours ago, TOM_BHAYYA said:

Bodi gadiki roju uchha poyisthunnadu ga leader

Yea ....  bodi gadiki diabetes kadha ... frequent ga uccha poyadam common symptom ata

Posted

This is not right move by cbn. This is bad move by cbn in his life time.

kcr ki minster ivvaka povadam 

cbi ni ban cheyyadam biggest mistakes 

  • Upvote 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...