Jump to content

Recommended Posts

Posted
3 hours ago, kingcasanova said:

theliyakunda matlaaduthunnava, thelisi kooda theliyanattu natisthunnaava bhayya? CBI correct ga pani chesi enni years ayyindi? central govt direction lo opposition parties ni kelakadam thappa, CBI and IT are doing nothing. directors ye dorikipoyaaru. ishtam vachinapudu case lu peduthunnaaru ishtam vachinapudu clean chit isthunnaaru. pedda sanjala kompa laaa thayyaaru ayyindi. CBI, ED and IT ni state lo kaalu petta kunda chesthe santosha pade vaallalo CBN kannaa mundhu okadunnaaadu kingcasanova

Jaggu gadini arrest chesinapudu levani noru ..ipudu lesthudhi eeyee@3$%

Posted

Self goal...

Incase edaina case lo high court CBI ki transfer chesthey eedu peekedi emi ledhu.

Ee chekkaa gaadi koduku pappu gaadu Hyderabad loney ekkuva vuntadi. Hyderabad lo cbi aadini arrest chesi Assam pampithey??

ED ni dinchithey

Posted
24 minutes ago, rapchik said:

Jaggu gadini arrest chesinapudu levani noru ..ipudu lesthudhi eeyee@3$%

'Mana' vallu chesthey samsaram. Vere vallu chesthe vyabhicharam. Pills Congress slogan . 

Posted
7 hours ago, snoww said:

em nashtam ledu. Pilla congress leaders business lu anni elagu Hyderabad lone edchayee. 

giphy.gif

Posted
30 minutes ago, rapchik said:

Jaggu gadini arrest chesinapudu levani noru ..ipudu lesthudhi eeyee@3$%

Manollu kadhu ga andhuke 

Posted

Rajasthan lo kuda ilanti mistake ee chesaru, now akkada results antha tharumaru ayipoyindi

Posted
22 minutes ago, bhaigan said:

Rajasthan lo kuda ilanti mistake ee chesaru, now akkada results antha tharumaru ayipoyindi

I think Rajasthan people are little bit sensible.. can’t expect same with our people 

  • Upvote 1
Posted
1 hour ago, snoww said:

'Mana' vallu chesthey samsaram. Vere vallu chesthe vyabhicharam. Pills Congress slogan . 

@3$%

Posted

ఓటుకు నోటు కేసు భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తనకు ఏదో జరగబోతోందనే ఊహలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బాబు అండ్ కో రాష్ట్రాన్ని అడ్డంగా దోచేశారని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో సీబీఐ విచారణ జరిగితే తన బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. ఐటీ అధికారులకు సహకరించం, సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వమని చెబుతుండమే ఇందుకు నిదర్శనమన్నారు. వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.

చక్రం తిప్పుతున్నానని ఫీలవుతున్నారు..
దేశం మొత్తం చక్రంలాగా తిరిగి వచ్చిన చంద్రబాబు తానే చక్రం తిప్పుతున్నట్లు ఫీలవుతున్నారని లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. బాబుకు శాలువాలు కప్పిన వారంతా ఎన్డీఏ వ్యతిరేకులేనని పేర్కొన్నారు. పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం బ్రోకర్ పనులు చేస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  

నువ్వెందుకు ఉలిక్కిపడుతున్నావ్‌?
చంద్రబాబు చేసిన అక్రమాలు వెలికితీస్తారనే భయంతోనే బరితెగించి దేశ సార్వభౌమాధికారాన్ని, రాజ్యాంగ సంస్థలను ధిక్కరిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణలో ట్విటర్‌లో పేర్కొన్నారు. చంద్రబాబుకు.. అర్బన్‌ నక్సలైట్లు, వేర్పాటువాదులకు తేడా లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీబీఐ తన పని తాను చేస్తుంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. పోలీసుల తనిఖీని కేవలం దొంగలు, నేరస్తులు మాత్రమే వ్యతిరేకిస్తారని ఎద్దేవా చేశారు

Posted

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) అంటే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు. శుక్రవారం రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ..సీబీఐ రాష్ట్రంలోనికి రావద్దు అని అనడానికి చంద్రబాబుకు ఏం అధికారం ఉన్నదని ప్రశ్నించారు. సీబీఐ అనేది దేశ వ్యవస్థలో ఒక అంతర్భాగమన్నారు.  విశాఖ మహా నగరంలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై దాడి చేసినా ఇంత వరకు దానిపై అతీగతి లేకుండా, సమగ్ర విచారణ జరపకుండా సీఎం చంద్రబాబు మెతక వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రలు పూర్తిగా క్షీణించాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఉన్నారని విమర్శించారు.

పార్టీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు అదుపులో లేరని, చింతమనేని ప్రభాకర్‌ వ్యవహారమే ఇందుకు నిదర్శనమన్నారు. చింతమనేని ఇటీవల దళితులు, జర్నలిస్టులు, మహిళలపై దాడులు చేసినా ఇప్పటి వరకు చంద్రబాబు పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. డిసెంబర్‌ 18 నుంచి 21 వరకు సీపీఐ జాతీయ సమితి సమావేశాలు మహారాష్ట్ర మండలిలో జరుగుతాయని అన్నారు. విజయవాడలో ఈ నెల 20న రాష్ట్ర కార్యవర్గ సమావేశం భేటీ కానుందని, ఆ సమావేశంలో 2019 ఎన్నికలకు గానూ దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.  ప్రత్యేక హోదా కోసం ప్రచార కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.

Posted

సీబీఐ పేరు చెబితేనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వణికిపోతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. చంద్రబాబు పరిపాలన దుర్మార్గంగా ఉందని మండిపడ్డారు. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలో, సీబీఐ కేంద్ర పరిధిలో ఉంటుందన్నారు. ప్రతి వ్యవస్థకు ఓ బాధ్యత ఉంది. కేంద్ర వ్యవస్థలకు, రాష్ట్ర వ్యవస్థలకు వాటి వాటి బాధ్యతలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర పరిధిలో 97 అంశాలు రాష్ట్ర పరిధిలో 67 అంశాలు ఉమ్మడిజాబితాలో 46 అంశాలు ఉంటాయని పేర్కొన్నారు. కాగ్ ను, సెంట్రల్ విజిలెన్స్ కమీషన్‌ను కూడా అలాగే ఏర్పాటు చేశారు. సీబీఐ అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ధ్వజమెత్తారు.

'మీరు కరెక్ట్ గా ఉన్నపుడు ఎవరైనా ఏం చేయగలుగుతారు. ఇటీవల ఐటీ వాళ్లు మీ టీడీపీ వారిపై దాడులు చేస్తే అల్లరి అల్లరి చేశారు. ఏ రాజకీయపార్టీకి చెందిన వారైనా వ్యాపారులైతే చెక్ చేయకూడదనేది మీ భావనగా ఉంది. రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం సంఘటనను కేంద్ర ఏజెన్సీ దర్యాప్తుకి అప్పగిస్తారని భయపడుతున్నారా. మీరు చేసిన ఈ పని చాలా దురదృష్టకరమైన అంశం. జగన్‌పై దాడి వంటి సంఘటన జరిగితే ఎవరైనా సరే సరైన విచారణ జరిపిస్తాం అని చెబుతారు. కానీ, సంఘటన జరగగానే డీజీపీ పక్షపాతంతో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైఎస్‌ జగన్ థర్డ్ పార్టీ విచారణ అడిగారు. కోడికత్తి అంటూ చంద్రబాబు వెకిలిగా మాట్లాడారు. హత్యాయత్నం జరిగిందా లేదా అని చూడాలి గానీ ఇలా ఎవరైనా మాట్లాడతారా? ఎయిర్ పోర్ట్ లోకి వెళ్తుంటే చిన్న కత్తెర కూడా అనుమతించరు. ఇంత అనుభవం, బాధ్యత పెట్టుకుని ఇలా చేస్తారా?

జరగబోయే పరిణామాలకు భయపడి ఇలాంటి జీఓలు తెస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. తక్షణమే ఈ జీఓను ఉపసంహరించండి. అన్ని రకాలుగా చట్టం తనపని తాను చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. కొన్ని సందర్బాలలో కేంద్రం, మరికొన్ని సందర్భాలలో కోర్టులు సీబీఐ విచారణకు ఆదేశిస్తాయి. ఆర్మీ, నేవి వంటివి కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో వచ్చి జోక్యం చేసుకుంటాయి. ఫెడరల్ సిస్టమ్ లో వీటిని పకడ్బందిగా ఏర్పాటు చేశారు. ఆర్మ్స్ యాక్ట్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, ప్రేలుడు పదార్థాలు, బంగారం, మైన్స్, ఖనిజాలు, మోటారు వెహికల్స్, ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీస్, పోస్ట్ ఆఫీస్ యాక్ట్, మనీల్యాండరింగ్‌ యాక్ట్, రైల్వేస్ యాక్ట్‌లను భారత పౌరుల రక్షణకోసం ఏర్పాటుచేశారు. వీటన్నింటినీ మీ ఉత్తర్వుల ద్వారా ఏం చేయబోతున్నారు. కేంద్ర వ్యవస్థలలో పరిశోధన చేసేందుకు దానిని ఏసీబీ చేసేలా ప్రస్తుతం జారీ చేసిన జీఓ వీలుకల్పిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చాక ఎవరూ చేయని పని ఎందుకు చేశారు చంద్రబాబూ' అని బుగ్గన నిప్పులు చెరిగారు. 

'సీబీఐ ఏపీలో నేరపరిశోధన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ ద్వారా అనుమతి నిరాకరిస్తోందని తెలిపారు. ఎఫ్ఆర్‌బీఎం చట్టంను కేంద్రం ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు అధికంగా అప్పులు చేయడాన్ని నిరోధిస్తూ ఈ చట్టం తెచ్చారు. దానిని చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించింది. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో నలుగురిని మంత్రులుగా చేశారు. ఇది పదవ షెడ్యుల్ ప్రకారం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. ఇది అన్యాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు ప్రశ్నించింది. గోదావరి పుష్కరాలలో 30 మంది చనిపోతే కనీసం ఏ అధికారిపైన అయినా చర్యలు తీసుకున్నారా. ముఖ్యమంత్రి పుష్కరాలలో సాధారణ భక్తుల మధ్యకు డాక్యుమెంటరీ తీయడానికి వెళ్లి దుర్ఘటనకు కారకులయ్యారు' అని బుగ్గన మండిపడ్డారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...