snoww Posted November 18, 2018 Report Posted November 18, 2018 స్మార్ట్ సిటీగా అమరావతి విజయవాడ వన్టౌన్, న్యూస్టుడే : డిజిటల్ పేమెంట్స్లో అమరావతి దేశంలోనే కీలకంగా మారిందని ఏపీసీఆర్డీఏ స్పెషల్ కమిషనర్ వి.రామమనోహరరావు అన్నారు. శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన డిజిటల్ పేమెంట్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని ఆవిర్భావంతోనే డిజిటల్ నగరంగా అవతరించిందని, ముఖ్యమంత్రి విజన్తో స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటోందని అన్నారు. ఎల్పీఎస్ ప్లాట్ల కేటాయింపు, మన అమరావతి యాప్, మైబ్రిక్-మై అమరావతి, హ్యాపీనెస్ట్ ప్లాట్స్ బుకింగ్ డిజిటల్ విధానంలోనే చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోనే తొలిసారిగా డాక్యుమెంట్లన్నీ బ్లాక్ చైన్ టెక్నాలజీలో భద్ర]పరిచామన్నారు. అమరావతిని గ్లోబల్ ఎకనామిక్ సిటీగా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని, దానికి అనుగుణంగా డిజిటల్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్స్ అకౌంట్స్ ప్రిన్స్పల్ కంట్రోలర్ శ్రీకాంత్ పండా మాట్లాడుతూ డిజిటల్ ఇండియా మిషన్కు మరో ప్రత్యామ్నాయం లేదని, టెలికం సంస్థలకు అధికంగా స్పెక్ట్రమ్ కేటాయింపులు చేస్తూ డిజిటల్ ఇన్ఫ్రా పెంచుతున్నామన్నారు. డిజిటల్ చెల్లింపులు జాతీయ స్థాయిలో ఒక శాతం ఉండగా, ఏపీ 12 శాతంతో ద్వితీయ స్థానంలో ఉందని, ప్రథమ స్థానంలో చండీగడ్ ఉందన్నారు. తెలంగాణ, ఒడిశాల్లో 4.5 శాతం డిజిటల్ చెల్లింపులున్నాయని వెల్లడించారు. వివిధ సంస్థల ప్రతినిధులు స్టాల్స్ ఏర్పాటు చేసి తమ డిజిటల్ పేమెంట్స్పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖ కంట్రోలర్ అనితా మహదాస్, జాయింట్ కంట్రోలర్ సి.ఎం.సంపార్, తదితరులు పాల్గొన్నారు. Quote
snoww Posted November 18, 2018 Author Report Posted November 18, 2018 Quote మైబ్రిక్-మై అమరావతి Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.