Jump to content

Balio oka picha fruit , Leki babu oka yerri fruit


Recommended Posts

Posted

lokesh1545317936.jpg

 

కేవలం లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసేందుకే నందమూరి కుటుంబం మొత్తాన్ని చంద్రబాబు నాశనం చేశారని ఆరోపించారు వైసీపీ నేత లక్ష్మీపార్వతి. కానీ లోకేష్ మాత్రం చంద్రబాబు అంచనాల్ని అందుకోలేకపోతున్నాడని, రాజకీయాల సంగతి అటుంచితే కనీసం భాషాజ్ఞానం కూడా అబ్బడం లేదన్నారు.

"ఎక్కడ లోకేష్ కు అడ్డువస్తారో అని నందమూరి వారసుల్ని పక్కన పెట్టేశారు బాబు. అసలే లోకేష్ అపర మేధావి కదా. కొడుకును ముఖ్యమంత్రిగా చూడాలని బాబు పరితపించిబోతున్నారు. అటు చూస్తే లోకేష్ కు క అంటే కీ రావడం లేదు. పాపం, 10 లక్షలు పెట్టి ట్యూషన్ పెట్టించినా లోకేష్ కు ఏం రావడం లేదు. రాజకీయం సంగతి తర్వాత, పాపం భాష కూడా రావడం లేదు లోకేష్ కు."

విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్ లో ఇలా చంద్రబాబు, లోకేష్ పై జాయింట్ గా విమర్శలు గుప్పించారు లక్ష్మీపార్వతి. తెలంగాణ ఎన్నికల్లో అమాయకురాలైన సుహాసినిని బలిపశువుని చేశారని, బాలకృష్ణను పిచ్చోడిని చేసి ఆడిస్తున్నారని లక్ష్మీపార్వతి విమర్శించారు. 

"నందమూరి సుహాసినికి చంద్రబాబు చేసిన అన్యాయం అంతా చూశాం. ఆమె అమాయకురాలు. నందమూరి కుటుంబానికి మేలు చేయాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉంటే హరికృష్ణకు న్యాయం చేసేవారు. బాలకృష్ణకు కూడా ఎమ్మెల్యే పదవి వచ్చేది కాదు. బాలకృష్ణ కూతుర్ని కోడలిగా చేసుకున్నాడు కాబట్టి, ఆ పిచ్చోడికి ఏదో ఎమ్మెల్యే పదవి ఇచ్చేసి పోయి సినిమాలు చేసుకోమన్నాడు. పాపం బాలకృష్ణ అమాయకుడు కాబట్టి, గెంతుకుంటూ పోయి సినిమాలు చేసుకుంటున్నాడు." 

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా కావాలనే కట్ చేశారని, లోకేష్ కు పోటీగా వస్తాడనే భయంతోనే జూనియర్ ను ఆదిలోనే రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. ఎప్పటికైనా నందమూరి వంశంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే మగాడు అన్నారామె. 

"లోకేష్ కు అడ్డు పడతాడనే జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురాలేదు. ఆ కుటుంబంలో తెలివైన వాడు, చాతుర్యం ఉన్నవాడు, తాతగారి పోలికలు ఉన్నవాడు ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. అతడ్ని తీసుకొచ్చి పార్టీలో యువనాయకుడి పోస్ట్ ఇవ్వొచ్చు కదా. కానీ ఇవ్వలేదు. ఒకవేళ ఎన్టీఆర్ ను తీసుకొస్తే వెంటనే లోకేష్-ఎన్టీఆర్ మధ్య కంపారిజన్ వస్తుంది. ప్రజలకు లోకేష్ జ్ఞానం ఏపాటిదో తెలిసిపోతుంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ వద్దు." 

ఇలా నందమూరి కుటుంబాన్ని కూరలో కరివేపాకులా వాడేసిన చంద్రబాబు.. సరిగ్గా ఎన్నికలు ముంచుకొస్తున్న సమయానికి ఎన్టీఆర్ విగ్రహం పెడతానంటూ కబుర్లు చెబుతున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. అల్లుడు (చంద్రబాబు) కట్టిన అమరావతి చూడ్డానికి వచ్చానని తెలిపిన లక్ష్మీపార్వతి.. ఈ నాలుగున్నరేళ్లలో అమరావతిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.

 

brahmi%20laugh_01.gif?1403646236

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...