Jump to content

Recommended Posts

Posted
గుండెల్లో నిద్రపోతా

 

రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ పోరాడుతా
నాది రైట్‌ టర్న్‌.. మీదే యూ టర్న్‌
చెవుల్లో సీసం వేసుకుని పడుకున్నారు
ప్రధాని నరేంద్రమోదీపై ధ్వజం
25 మంది ఎంపీలను గెలిపిస్తేనే తెదేపాకు గౌరవం
వైకాపా నుంచి అయిదారుగురు ఎంపీలను గెలిపించినా కేసుల మాఫీకి అమ్మేస్తారు
27న కడప ఉక్కుకు భూమి పూజ చేస్తున్నాం
ధర్మపోరాట దీక్ష సభలో చంద్రబాబునాయుడు
ఈనాడు - శ్రీకాకుళం

22ap-main1a_2.jpg

‘తెలంగాణలో తెరాస పోటీ చేస్తే వారిని సమర్థిస్తారు. వైకాపా, తెరాస, పవన్‌కల్యాణ్‌లూ.. మీకు (మోదీకి) కావాలి. నాకు కావాల్సింది ఈ రాష్ట్రం. నా కంటే కేసీఆర్‌కు పరిణతి ఉందని.. నన్ను విమర్శించే పరిస్థితికి మోదీ వచ్చారు. మీరు (ప్రజలు) అండగా ఉంటే.. కొండనైనా ఢీ కొంటా తప్ప బెదిరిపోయే సమస్య లేదు. నేను మిమ్మల్ని నమ్ముకున్నా. నాకెవరితో గొడవలు లేవు. న్యాయం చేసేదాకా గుండెల్లో నిద్రపోయే పార్టీ తెదేపాయే...’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. లోక్‌సభలో 25కు 25 సీట్లు గెలిపిస్తేనే మనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని కేంద్రంలో నెలుకొల్పుకోవచ్చని పేర్కొన్నారు. వైకాపా నుంచి ఏ అయిదారుగురు ఎంపీలను గెలిపించినా కేసుల మాఫీకి అమ్మేస్తారని ఆరోపించారు. పులివెందులకు నీళ్లు రావడం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు ఇష్టం లేదన్నారు. కేంద్రం ఒప్పుకోకున్నా ఈనెల 27న కడపలో ఉక్కు కర్మాగారానికి భూమి పూజ చేస్తున్నామని,   త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు. శ్రీకాకుళం ధర్మపోరాట దీక్షలో శనివారం ముఖ్యమంత్రి, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాట్లాడారు. నరేంద్రమోదీకి వ్యతిరేకంగా పలుసార్లు నినదింపజేశారు. ఆవేశంతో గట్టిగా మాట్లాడటంతో అనేక పర్యాయాలు ఆయన గొంతు బొంగురుపోయింది. అయినా ఏ మాత్రం తగ్గలేదు. నరేంద్రమోదీ చెవుల్లో సీసం వేసుకుని పడుకున్నారని.. ఆయన  చెవులు చిల్లులు పడేలా గట్టిగా నినదించాలంటూ  నినాదాలు ఇప్పించారు. వంశధార.. నాగావళి. బారువా.. అటు పెన్నా వరకు నదుల అనుసంధానం చేయాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తికి ఆమోదం తెలియజేయాలంటూ చప్పట్లు కొట్టించారు. ఈ దీక్ష సందర్భంగా స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియం, పురవీధులు జనంతో కిటకిటలాడాయి. ‘నేను.. యూటర్న్‌ తీసుకున్నానని అంటారు. నాది యూటర్న్‌ కాదు. మీదే యూటర్న్‌. నాది స్ట్రెయిట్‌ టర్న్‌. రైట్‌ టర్న్‌. నేనేదో వైకాపా ఉచ్చులో పడ్డాననీ అంటారు. నేను కాదు.. బల్లి ఎగిరెగిరి కుడితిలో పడ్డట్టు మీరే వెళ్లి అవినీతి వైకాపా కుడితిలో పడ్డారు...’ అని మోదీపై చంద్రబాబు ధ్వజమెత్తారు. హైదరాబాదును అహ్మదాబాదును పోల్చి చూస్తే తెదేపా విజన్‌.. అభివృద్ధిలో తెలుగువాడి ఘనత తెలుస్తుందన్నారు.  దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అందుకే దేశంలో భాజపాయేతర పార్టీలతో కలిశామని చెప్పారు. నమ్మకం లేని ఈవీఎంల కంటే.. పాత పద్దతిలో పేపర్‌ బ్యాలెట్టే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.

పోరాటల గెడ్డ శ్రీకాకుళం
‘రాష్ట్రానికి న్యాయం చేస్తారనే భాజపాతో పొత్తు పెట్టుకున్నాం. మీకు అన్ని విధాలా న్యాయం చేస్తామని వెంకన్న సాక్షిగా తిరుపతి సభలో హామీ ఇచ్చి నమ్మకద్రోహం చేశారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని  ఇవ్వలేదు. ఎవరికీ ఇవ్వం అని చెప్పి 11 రాష్ట్రాలకు ఇచ్చారు... మాకూ హోదా ఇవ్వమని అడిగా. హోదా ఆంధ్రుల హక్కా కాదా. నాలుగో బడ్జెట్టులో కూడా ఏమీ చేయలేదు. మంత్రులతో రాజీనామా చేయించా. ఎన్డీయే నుంచి బయటకు రాలేదు. న్యాయం చేయాల్సిందిగా కోరినా.. మొండిచెయ్యి చూపించి బెదిరింపు ధోరణిలకు పాల్పడ్డారు.బయటకొచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టాం. దేశం మొత్తం గుర్తుంచుకునేలా బ్రహ్మాండంగా పోరాడిన వ్యక్తి శ్రీకాకుళం బిడ్డ రామ్మోహన్‌నాయుడు. పోరాటల గెడ్డ శ్రీకాకుళం. పోరాటాలకు తయారుగా ఉండాలి’అని  సీఎం పిలుపునిచ్చారు.

22ap-main1b_2.jpg

కేంద్రం స్వేచ్ఛను హరిస్తోంది
‘కేంద్రం అందరిపైనా బెదిరింపులకు పాల్పడుతోంది. అన్యాయాన్ని ప్రశ్నించే వారి స్వేచ్ఛను హరిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఆదాయపన్ను శాఖ, ఈడీతో దాడులు చేయిస్తోంది.  మీడియాను భయపెడుతోంది. పారిశ్రామికవేత్తలను భయపెడుతోంది. వారు స్వేచ్ఛ లేకుండా బతుకుతున్నారు. ప్రజాస్వామ్యం చాలా విలువైనది. కేంద్రంలోని సీబీఐపీ దేశంలో త్వరిగగతిన పూర్తి అయ్యే ప్రాజెక్టులకు ఇచ్చే అవార్డుకు ఈ ఏడాది పోలవరాన్ని ఎంపిక చేసింది. మనపై ఏమాత్రం ఇష్టం లేకున్నా.. కేంద్రం అవార్డు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అవార్డు ఇచ్చీ ఆరోపణలు చేస్తారు. మనకు రావాల్సిన డబ్బులు ఇవ్వరు. 3,400కోట్ల పెండింగు బిల్లులు ఇవ్వడం లేదు. రూ.50వేల కోట్లు ఖర్చుపెడుతున్న రాజధానికి.. కేవలం రూ.1500కోట్లు ఇస్తే ఏ మూలకు సరిపోతాయి? ఏడాదికి రూ.6వేల కోట్లు పన్నులు చెల్లిస్తున్నాం. ఆ మొత్తం సర్దుబాటు చేసినా సరిపోయేది.  రాష్ట్రంలో వెనకబడిన ఏడు జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ ప్యాకేజి తరహాలో ఇస్తామని రూ.1050కోట్లు ఇచ్చి.. నాలుగోవిడత ఇచ్చిన సొమ్ములు వెనక్కి తీసుకున్నారు. తెలంగాణాకు రూ.500కోట్లు ఇచ్చారని చెబుతూ దాన్ని సమర్థిస్తూనే ఇక్కడ ఇవ్వకపోవడంలో మీ ఉద్దేశం ఏమిటి? లెక్కలు చెప్పలేదు. యూసీ ఇవ్వలేదని తప్పుడు ఆరోపణలు చేశారు. ఏ లెక్కలు కావాలంటే ఆ లెక్కలు ఇస్తాం. విశాఖ రైల్వే జోన్‌కు ఒడిశా అంగీకరించినా కేంద్రం ఇవ్వడం లేదు. కేసీఆర్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఇస్తానంటారు. ఒకప్పుడు ప్రత్యేకహోదాకు తెరాస మనకు సహకరించింది. మొన్న ఎన్నికల సమయంలో సోనియాగాంధీ తెలంగాణలో ఆంధ్రాకు ప్రత్యేకహోదా ఇవ్వాలని చెబితే కేసీఆర్‌ వ్యతిరేకించారు. ఏపీ హోదాను వ్యతిరేకించిన ఆయనను సమర్థించిన వ్యక్తి మన జగన్మోహన్‌రెడ్డి. వారు ఎన్నికల్లో గెలిస్తే పండగలు చేసుకున్న వారు వైకాపా నాయకులు. వీరంతా రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

కాగితాలకే పరిమితం
‘విభజన హామీల్లోని విద్యాసంస్థల్లో ఇంతవరకు ఒక్కటీ పూర్తి కాలేదు. కాగితాలపై మంజూరుకే అవి పరిమితం అయ్యాయి. వాటిని పూర్తి చేసేందుకు రూ.11వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా..ఇచ్చింది రూ.600కోట్లే. ఇదే దామాషాలో నిధులు మంజూరు చేస్తే.. అవి పూర్తయ్యేందుకు 30ఏళ్లు పడుతుంది. కాకినాడలో పెట్రోకెమికల్‌ కారిడార్‌కు అడ్డుపడి.. రాజస్థాన్‌కు ఇచ్చారు. విమానాశ్రయాల విస్తరణకు విజయవాడలో 700 ఎకరాలు, తిరుపతిలో 750 ఎకరాలు, రాజమహేంద్రవరానికి 800 ఎకరాలు ఇచ్చినా అభివృద్ధి చేసే పరిస్థితుల్లో లేరు. సింగపూర్‌లో 55ఏళ్లుగా ఒకే ప్రభుత్వం ఉన్నందున అభివృద్ధి సజావుగా సాగుతోంది. ఏపీలోనూ తెదేపా అధికారంలో ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతాయి’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.  అంతకు ముందు రూ.3.50 కోట్లతో నిర్మించిన జిల్లా తెదేపా భవనాన్ని సీఎం ప్రారంభించారు.

Posted
Quote

ఆవేశంతో గట్టిగా మాట్లాడటంతో అనేక పర్యాయాలు ఆయన గొంతు బొంగురుపోయింది. అయినా ఏ మాత్రం తగ్గలేదు.

idi elevation antey ()>>

Posted
45 minutes ago, snoww said:

ఆవేశంతో

musalithanam valla

Posted

Pappu gaadu back baaga penchi migatha kutumbha sabhyulaki intlo space lekunda chestunda chestunnadu 😀

Posted
8 hours ago, snoww said:
గుండెల్లో నిద్రపోతా

 

రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ పోరాడుతా
నాది రైట్‌ టర్న్‌.. మీదే యూ టర్న్‌
చెవుల్లో సీసం వేసుకుని పడుకున్నారు
ప్రధాని నరేంద్రమోదీపై ధ్వజం
25 మంది ఎంపీలను గెలిపిస్తేనే తెదేపాకు గౌరవం
వైకాపా నుంచి అయిదారుగురు ఎంపీలను గెలిపించినా కేసుల మాఫీకి అమ్మేస్తారు
27న కడప ఉక్కుకు భూమి పూజ చేస్తున్నాం
ధర్మపోరాట దీక్ష సభలో చంద్రబాబునాయుడు
ఈనాడు - శ్రీకాకుళం

22ap-main1a_2.jpg

‘తెలంగాణలో తెరాస పోటీ చేస్తే వారిని సమర్థిస్తారు. వైకాపా, తెరాస, పవన్‌కల్యాణ్‌లూ.. మీకు (మోదీకి) కావాలి. నాకు కావాల్సింది ఈ రాష్ట్రం. నా కంటే కేసీఆర్‌కు పరిణతి ఉందని.. నన్ను విమర్శించే పరిస్థితికి మోదీ వచ్చారు. మీరు (ప్రజలు) అండగా ఉంటే.. కొండనైనా ఢీ కొంటా తప్ప బెదిరిపోయే సమస్య లేదు. నేను మిమ్మల్ని నమ్ముకున్నా. నాకెవరితో గొడవలు లేవు. న్యాయం చేసేదాకా గుండెల్లో నిద్రపోయే పార్టీ తెదేపాయే...’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. లోక్‌సభలో 25కు 25 సీట్లు గెలిపిస్తేనే మనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని కేంద్రంలో నెలుకొల్పుకోవచ్చని పేర్కొన్నారు. వైకాపా నుంచి ఏ అయిదారుగురు ఎంపీలను గెలిపించినా కేసుల మాఫీకి అమ్మేస్తారని ఆరోపించారు. పులివెందులకు నీళ్లు రావడం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు ఇష్టం లేదన్నారు. కేంద్రం ఒప్పుకోకున్నా ఈనెల 27న కడపలో ఉక్కు కర్మాగారానికి భూమి పూజ చేస్తున్నామని,   త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు. శ్రీకాకుళం ధర్మపోరాట దీక్షలో శనివారం ముఖ్యమంత్రి, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాట్లాడారు. నరేంద్రమోదీకి వ్యతిరేకంగా పలుసార్లు నినదింపజేశారు. ఆవేశంతో గట్టిగా మాట్లాడటంతో అనేక పర్యాయాలు ఆయన గొంతు బొంగురుపోయింది. అయినా ఏ మాత్రం తగ్గలేదు. నరేంద్రమోదీ చెవుల్లో సీసం వేసుకుని పడుకున్నారని.. ఆయన  చెవులు చిల్లులు పడేలా గట్టిగా నినదించాలంటూ  నినాదాలు ఇప్పించారు. వంశధార.. నాగావళి. బారువా.. అటు పెన్నా వరకు నదుల అనుసంధానం చేయాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తికి ఆమోదం తెలియజేయాలంటూ చప్పట్లు కొట్టించారు. ఈ దీక్ష సందర్భంగా స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియం, పురవీధులు జనంతో కిటకిటలాడాయి. ‘నేను.. యూటర్న్‌ తీసుకున్నానని అంటారు. నాది యూటర్న్‌ కాదు. మీదే యూటర్న్‌. నాది స్ట్రెయిట్‌ టర్న్‌. రైట్‌ టర్న్‌. నేనేదో వైకాపా ఉచ్చులో పడ్డాననీ అంటారు. నేను కాదు.. బల్లి ఎగిరెగిరి కుడితిలో పడ్డట్టు మీరే వెళ్లి అవినీతి వైకాపా కుడితిలో పడ్డారు...’ అని మోదీపై చంద్రబాబు ధ్వజమెత్తారు. హైదరాబాదును అహ్మదాబాదును పోల్చి చూస్తే తెదేపా విజన్‌.. అభివృద్ధిలో తెలుగువాడి ఘనత తెలుస్తుందన్నారు.  దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అందుకే దేశంలో భాజపాయేతర పార్టీలతో కలిశామని చెప్పారు. నమ్మకం లేని ఈవీఎంల కంటే.. పాత పద్దతిలో పేపర్‌ బ్యాలెట్టే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.

పోరాటల గెడ్డ శ్రీకాకుళం
‘రాష్ట్రానికి న్యాయం చేస్తారనే భాజపాతో పొత్తు పెట్టుకున్నాం. మీకు అన్ని విధాలా న్యాయం చేస్తామని వెంకన్న సాక్షిగా తిరుపతి సభలో హామీ ఇచ్చి నమ్మకద్రోహం చేశారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని  ఇవ్వలేదు. ఎవరికీ ఇవ్వం అని చెప్పి 11 రాష్ట్రాలకు ఇచ్చారు... మాకూ హోదా ఇవ్వమని అడిగా. హోదా ఆంధ్రుల హక్కా కాదా. నాలుగో బడ్జెట్టులో కూడా ఏమీ చేయలేదు. మంత్రులతో రాజీనామా చేయించా. ఎన్డీయే నుంచి బయటకు రాలేదు. న్యాయం చేయాల్సిందిగా కోరినా.. మొండిచెయ్యి చూపించి బెదిరింపు ధోరణిలకు పాల్పడ్డారు.బయటకొచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టాం. దేశం మొత్తం గుర్తుంచుకునేలా బ్రహ్మాండంగా పోరాడిన వ్యక్తి శ్రీకాకుళం బిడ్డ రామ్మోహన్‌నాయుడు. పోరాటల గెడ్డ శ్రీకాకుళం. పోరాటాలకు తయారుగా ఉండాలి’అని  సీఎం పిలుపునిచ్చారు.

22ap-main1b_2.jpg

కేంద్రం స్వేచ్ఛను హరిస్తోంది
‘కేంద్రం అందరిపైనా బెదిరింపులకు పాల్పడుతోంది. అన్యాయాన్ని ప్రశ్నించే వారి స్వేచ్ఛను హరిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఆదాయపన్ను శాఖ, ఈడీతో దాడులు చేయిస్తోంది.  మీడియాను భయపెడుతోంది. పారిశ్రామికవేత్తలను భయపెడుతోంది. వారు స్వేచ్ఛ లేకుండా బతుకుతున్నారు. ప్రజాస్వామ్యం చాలా విలువైనది. కేంద్రంలోని సీబీఐపీ దేశంలో త్వరిగగతిన పూర్తి అయ్యే ప్రాజెక్టులకు ఇచ్చే అవార్డుకు ఈ ఏడాది పోలవరాన్ని ఎంపిక చేసింది. మనపై ఏమాత్రం ఇష్టం లేకున్నా.. కేంద్రం అవార్డు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అవార్డు ఇచ్చీ ఆరోపణలు చేస్తారు. మనకు రావాల్సిన డబ్బులు ఇవ్వరు. 3,400కోట్ల పెండింగు బిల్లులు ఇవ్వడం లేదు. రూ.50వేల కోట్లు ఖర్చుపెడుతున్న రాజధానికి.. కేవలం రూ.1500కోట్లు ఇస్తే ఏ మూలకు సరిపోతాయి? ఏడాదికి రూ.6వేల కోట్లు పన్నులు చెల్లిస్తున్నాం. ఆ మొత్తం సర్దుబాటు చేసినా సరిపోయేది.  రాష్ట్రంలో వెనకబడిన ఏడు జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ ప్యాకేజి తరహాలో ఇస్తామని రూ.1050కోట్లు ఇచ్చి.. నాలుగోవిడత ఇచ్చిన సొమ్ములు వెనక్కి తీసుకున్నారు. తెలంగాణాకు రూ.500కోట్లు ఇచ్చారని చెబుతూ దాన్ని సమర్థిస్తూనే ఇక్కడ ఇవ్వకపోవడంలో మీ ఉద్దేశం ఏమిటి? లెక్కలు చెప్పలేదు. యూసీ ఇవ్వలేదని తప్పుడు ఆరోపణలు చేశారు. ఏ లెక్కలు కావాలంటే ఆ లెక్కలు ఇస్తాం. విశాఖ రైల్వే జోన్‌కు ఒడిశా అంగీకరించినా కేంద్రం ఇవ్వడం లేదు. కేసీఆర్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఇస్తానంటారు. ఒకప్పుడు ప్రత్యేకహోదాకు తెరాస మనకు సహకరించింది. మొన్న ఎన్నికల సమయంలో సోనియాగాంధీ తెలంగాణలో ఆంధ్రాకు ప్రత్యేకహోదా ఇవ్వాలని చెబితే కేసీఆర్‌ వ్యతిరేకించారు. ఏపీ హోదాను వ్యతిరేకించిన ఆయనను సమర్థించిన వ్యక్తి మన జగన్మోహన్‌రెడ్డి. వారు ఎన్నికల్లో గెలిస్తే పండగలు చేసుకున్న వారు వైకాపా నాయకులు. వీరంతా రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

కాగితాలకే పరిమితం
‘విభజన హామీల్లోని విద్యాసంస్థల్లో ఇంతవరకు ఒక్కటీ పూర్తి కాలేదు. కాగితాలపై మంజూరుకే అవి పరిమితం అయ్యాయి. వాటిని పూర్తి చేసేందుకు రూ.11వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా..ఇచ్చింది రూ.600కోట్లే. ఇదే దామాషాలో నిధులు మంజూరు చేస్తే.. అవి పూర్తయ్యేందుకు 30ఏళ్లు పడుతుంది. కాకినాడలో పెట్రోకెమికల్‌ కారిడార్‌కు అడ్డుపడి.. రాజస్థాన్‌కు ఇచ్చారు. విమానాశ్రయాల విస్తరణకు విజయవాడలో 700 ఎకరాలు, తిరుపతిలో 750 ఎకరాలు, రాజమహేంద్రవరానికి 800 ఎకరాలు ఇచ్చినా అభివృద్ధి చేసే పరిస్థితుల్లో లేరు. సింగపూర్‌లో 55ఏళ్లుగా ఒకే ప్రభుత్వం ఉన్నందున అభివృద్ధి సజావుగా సాగుతోంది. ఏపీలోనూ తెదేపా అధికారంలో ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతాయి’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.  అంతకు ముందు రూ.3.50 కోట్లతో నిర్మించిన జిల్లా తెదేపా భవనాన్ని సీఎం ప్రారంభించారు.

TRS and Dhora inspiration anukunta, voters gallanthu, EVM’s tho kummaku ayithe kani 25 MP seats ravu anukunta

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...