Jump to content

@psycopk AP Rythu Bhandhu scheme update enti


Recommended Posts

Posted

Last week announce chestha annaru , inka cheyyaledu ? 

Elagu center announce chesthadi kada , chesaka adi kooda naa idea ne andam ani waiting aaa ?

Posted
23 minutes ago, snoww said:

Last week announce chestha annaru , inka cheyyaledu ? 

Elagu center announce chesthadi kada , chesaka adi kooda naa idea ne andam ani waiting aaa ?

But demonetization u turn was the top of the lot. 

Posted
24 minutes ago, snoww said:

Last week announce chestha annaru , inka cheyyaledu ? 

Elagu center announce chesthadi kada , chesaka adi kooda naa idea ne andam ani waiting aaa ?

Centre announce chesaka vellu 1 rupee add chesi motham meme ichani anee plan lo unnaremo 

Posted
Just now, snoww said:

next press meet eppudu

Currently abn and etv is busy covering balio and gootiki cherina krish. Once done they will run to bob with mikes 

Posted
21 hours ago, Heroin said:

@Undavalli uncle ela unnaru 

ఎదో సాగిపోతోందలాగా

Posted
21 hours ago, PsycoKamarao said:

Manchi vallu eppudu manchigane untaru 

giphy.gif

Posted
On 1/24/2019 at 8:50 PM, snoww said:

Last week announce chestha annaru , inka cheyyaledu ? 

Elagu center announce chesthadi kada , chesaka adi kooda naa idea ne andam ani waiting aaa ?

 

Posted
అన్నదాతా సుఖీభవ! 

 

రైతుల కోసం భారీ పథకం 
ఎకరాకు రూ.10 వేల చేయూత 
ఏటా రూ.20 వేల కోట్ల పెట్టుబడి సాయం 
కౌలు రైతులకూ మేలు జరిగేలా నిబంధనలు 
వారం పది రోజుల్లో విధివిధానాలు 
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలోని రైతులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించేందుకు ఉద్దేశించిన భారీ పథకాన్ని ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రూపకల్పన చేస్తున్న ఈ పథకాన్ని ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో అమలు చేసే అవకాశముంది. అసలు రైతులతోపాటు (భూమి యజమానులు), కౌలు రైతులకూ మేలు జరిగేలా ఈ పథకాన్ని రూపొందిస్తోంది.ఒక్కో ఎకరాకు ఒక్కో సీజన్‌లో రూ.5 వేలు చొప్పున, రెండు సీజన్లకూ కలిపి ఏటా రూ.10 వేలు చొప్పున ఇవ్వాలన్నది ప్రతిపాదన. దీన్ని ఎలా అమలు చేయాలన్న అంశంపై విస్తృత కసరత్తు జరుగుతోంది. ఈ పథకం విధి విధానాల్ని మరో వారం పది రోజుల్లో ప్రకటించనుంది. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేస్తున్న భూ విస్తీర్ణం రెండు కోట్ల ఎకరాలకుపైగా ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా. ఆ లెక్కన ఈ పథకంపై ఒక్కో సీజన్‌లో రూ.10,000 కోట్లు చొప్పున, సంవత్సరానికి రూ.20 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ పథకం వల్ల 96 లక్షల మందికి పైగా రైతులు, కౌలు రైతులకు మేలు జరగనుంది. 
ఖరీఫ్‌ నుంచే ఎందుకంటే..? 
ఈ పథకాన్ని తక్షణం అమల్లోకి తేవాలని భావించినా... రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉన్న కౌలు రైతుల్ని ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చేందుకు విస్తృత కసరత్తు చేయాల్సి రావడం, ప్రస్తుత రబీ సీజన్‌ కూడా ఇప్పటికే సగం పూర్తికావడం వంటి కారణాల వల్ల వచ్చే ఖరీఫ్‌ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కౌలు రైతులు సగటున 67 శాతం ఉంటారని అంచనా. తూర్పుగోదావరి నుంచి నెల్లూరు జిల్లా వరకు వీరు అత్యధికంగా ఉంటారు. ఈ జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో 90-95 శాతం వరకు ఉంటారు. కౌలు రైతుల్ని గుర్తించడం, వారిని ‘అన్నదాత సుఖీభవ’ పథకం పరిధిలోకి తీసుకురావడం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్‌. రాష్ట్రంలో ఎంత మంది కౌలు రైతులు ఉంటారన్న విషయంలో ప్రభుత్వం వద్ద కచ్చితమైన లెక్కల్లేవు. ప్రభుత్వం సాగు ధ్రువీకరణ, రుణ అర్హత పత్రాలు ఇవ్వడం ద్వారా 11.06 లక్షలమంది కౌలు రైతులకు బ్యాంకుల నుంచి రూ.5 వేల కోట్ల వరకు రుణాలు ఇప్పించింది. అటు అసలు రైతులు, ఇటు కౌలు రైతుల్లో ఎవరికీ అన్యాయం జరగకుండా, ఇద్దరి మధ్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం విస్తృత కసరత్తు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సమర్థ యంత్రాంగాన్ని, విధివిధానాల్ని రూపొందించి.. వచ్చే ఖరీఫ్‌ నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలన్న నిర్ణయానికొచ్చింది. ఈ పథకాన్ని తక్షణం అమలు చేయకపోవడానికి ప్రభుత్వం వద్ద ప్రస్తుతం ఆర్థిక వనరుల లభ్యత తక్కువగా ఉండటం కూడా ఒక కారణం. 
అసలు రైతుకీ, కౌలు రైతుకీ చెరిసగం..! 
‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని వచ్చే జూన్‌ 1 నుంచి ప్రభుత్వం అమల్లోకి తేనుంది. భూ యజమానులే స్వయంగా సాగు చేస్తున్న చోట మొత్తం ఆర్థిక సాయాన్ని వారికే అందజేయనుంది. కౌలు రైతులు సాగు చేస్తున్న చోట ఆర్థిక సాయంలో సగం అసలు రైతుకి, సగం కౌలు రైతుకి ఇవ్వాలన్నది ప్రతిపాదన.

Posted
Quote

ఖరీఫ్‌ నుంచే ఎందుకంటే..? 
ఈ పథకాన్ని తక్షణం అమల్లోకి తేవాలని భావించినా... రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉన్న కౌలు రైతుల్ని ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చేందుకు విస్తృత కసరత్తు చేయాల్సి రావడం, ప్రస్తుత రబీ సీజన్‌ కూడా ఇప్పటికే సగం పూర్తికావడం వంటి కారణాల వల్ల వచ్చే ఖరీఫ్‌ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కౌలు రైతులు సగటున 67 శాతం ఉంటారని అంచనా. తూర్పుగోదావరి నుంచి నెల్లూరు జిల్లా వరకు వీరు అత్యధికంగా ఉంటారు. ఈ జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో 90-95 శాతం వరకు ఉంటారు. కౌలు రైతుల్ని గుర్తించడం, వారిని ‘అన్నదాత సుఖీభవ’ పథకం పరిధిలోకి తీసుకురావడం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్‌. రాష్ట్రంలో ఎంత మంది కౌలు రైతులు ఉంటారన్న విషయంలో ప్రభుత్వం వద్ద కచ్చితమైన లెక్కల్లేవు. ప్రభుత్వం సాగు ధ్రువీకరణ, రుణ అర్హత పత్రాలు ఇవ్వడం ద్వారా 11.06 లక్షలమంది కౌలు రైతులకు బ్యాంకుల నుంచి రూ.5 వేల కోట్ల వరకు రుణాలు ఇప్పించింది. అటు అసలు రైతులు, ఇటు కౌలు రైతుల్లో ఎవరికీ అన్యాయం జరగకుండా, ఇద్దరి మధ్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం విస్తృత కసరత్తు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సమర్థ యంత్రాంగాన్ని, విధివిధానాల్ని రూపొందించి.. వచ్చే ఖరీఫ్‌ నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలన్న నిర్ణయానికొచ్చింది. ఈ పథకాన్ని తక్షణం అమలు చేయకపోవడానికి ప్రభుత్వం వద్ద ప్రస్తుతం ఆర్థిక వనరుల లభ్యత తక్కువగా ఉండటం కూడా ఒక కారణం. 

Cover drive baagundi @3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...