snoww Posted February 4, 2019 Report Posted February 4, 2019 మోదీ(సీబీఐ) X (పోలీస్)దీదీ కోల్కతాలో అనూహ్య పరిణామాలు పోలీసు కమిషనర్ నివాసానికి సీబీఐ బలగాలు సీబీఐ అధికారుల్ని నిర్బంధించిన బెంగాల్ పోలీసులు మోదీ ప్రభుత్వంపై మండిపడ్డ పశ్చిమబెంగాల్ సీఎం మమత విపక్షాలతో సభ నిర్వహించినందుకే ఈ ప్రతీకారమని ధ్వజం రాత్రికి రాత్రి నడిరోడ్డుపై ధర్నా దీదీకి విపక్షాల మద్దతు నేడు సుప్రీంకోర్టు తలుపు తట్టనున్న కేంద్ర దర్యాప్తు సంస్థ కోల్కతా: కేంద్రానికి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ఇప్పటికే మోదీ, మమత మధ్య ఉప్పూనిప్పులా పరిస్థితి ఉండగా కోల్కతా పోలీస్ కమిషనర్ను ప్రశ్నించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రావడంతో అగ్గి మరింత రాజుకుంది. శారదా కుంభకోణం కేసులో కోల్కతా పోలీసు కమిషనర్ను ప్రశ్నించే నిమిత్తం సీబీఐ అధికారులు ఆదివారం సాయంత్రం అనూహ్య రీతిలో నేరుగా ఆయన నివాసానికి వెళ్లే ప్రయత్నం చేశారు. సీపీ ‘పరారీ’లో ఉన్నందునే తాము ఈ చర్యకు దిగాల్సి వచ్చిందని సీబీఐ సమర్థించుకుంది. తక్షణం అప్రమత్తమైన పోలీసు బలగాలు సీబీఐ అధికారుల్ని ఆయన నివాసానికి వెలుపలే అడ్డుకోవడమే కాకుండా వారిని జీపులో పడేసి పోలీసు స్టేషన్కు తీసుకుపోయాయి. సీబీఐ దూకుడుపై మమత అగ్గిమీద గుగ్గిలమయ్యారు. హుటాహుటిన నేరుగా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసానికి చేరుకుని రాష్ట్ర సర్కారు తరఫున పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. డీజీపీ కూడా ఆ సమయానికి అక్కడకు చేరుకున్నారు. గత నెల 31న ఒక్కరోజు సెలవు పెట్టడం మినహా కమిషనర్ నగరంలోనే ఉన్నారని, పరారీలో ఉన్నట్లుగా ఎలా నింద వేస్తారని మమత కేంద్రాన్ని నిలదీశారు. ఆయన్ని విచారించేందుకు సీబీఐ వద్ద ఎలాంటి వారెంటు లేదని చెప్పారు. పోలీసు శాఖతో పాటు అన్ని వ్యవస్థల్ని తమ గుప్పిట పెట్టుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తన పాలన యంత్రాంగం మీద దాడికి కేంద్ర బలగాలను పంపిస్తున్నారని ఆక్షేపించారు. దీనిపై తాను తక్షణం దీక్షకు దిగుతానని ప్రకటించి, రాత్రికి రాత్రి ఎస్ప్లనేడ్ వద్ద సత్యాగ్రహం చేపట్టారు. సోమవారం నాటి శాసనసభ కార్యకలాపాలు తాను కూర్చొన్నచోటనే జరుగుతాయని తేల్చి చెప్పారు. ‘బెంగాల్పై భాజపా కత్తికట్టింది. రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తోంది. విపక్షాల ఐక్యత సభను ఇక్కడ నిర్వహించినందుకే ఇదంతా చేస్తోంది. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రతీకారమే. సాక్షాత్తూ ప్రధాని నన్ను బెదిరించేలా ఎలా మాట్లాడారో చూశారుగా... ఉన్నతాధికారుల్ని వేధించడం ద్వారా రాష్ట్రంలో రాజకీయ తుపాను సృష్టించాలని భాజపా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో తిరుగుబాటు రావాలని మోదీ-అమిత్షా ద్వయం కోరుకొంటోంది. ప్రధాని ఆదేశాలకు లోబడి రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి జాతీయ భద్రత సలహాదారుడు అజిత్ డోభాల్ తగు రీతిలో ఆదేశాలిస్తున్నారు. చేతికి రక్తపు మరకలు అంటిన చరిత్ర ఉన్న ఇలాంటి ప్రధాని గురించి మాట్లాడడానికి నేను సిగ్గుపడుతున్నా’ అని నిప్పులు చెరిగారు. ప్రాణాలనైనా అర్పిస్తానే గానీ కేంద్ర సర్కారు ముందు తలొంచేది లేదని చెప్పారు. కమిషనర్ కుమార్ ప్రపంచంలోనే ఉన్నతమైన అధికారి అని నేను ఇప్పటికీ చెప్పగలను అని స్పష్టం చేశారు. ‘శారద యజమానుల్ని అరెస్టు చేసింది మేం. విచారణకు సిట్ను ఏర్పాటు చేసింది మేం. పోలీసులకు రక్షణ కల్పించడం ప్రభుత్వాధినేతగా నా బాధ్యత. సీబీఐ అధికారుల్ని అరెస్టు చేసే అవకాశమున్నా విడిచిపెట్టాం. శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం. సీబీఐకి అన్నింటినీ మేమెందుకు ఇవ్వాలి? వారెంటు లేకుండానే కమిషనర్ నివాసంపైకి రావడానికి వారికి ఎంత ధైర్యం?’ అని ప్రశ్నిస్తూ అపర కాళిక అయ్యారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఎన్డీయే సర్కారు కోరుకొంటోందా అని ప్రశ్నించారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల దృష్ట్యా సోమవారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు తాను హాజరు కావడం లేదని ప్రకటించారు. మోదీ సర్కారును గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వివిధ విపక్ష నేతలైన చంద్రబాబునాయుడు (తెదేపా), అఖిలేశ్ యాదవ్ (సమాజ్వాదీ), తేజస్వీ యాదవ్(ఆర్జేడీ), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), అహ్మద్ పటేల్ (కాంగ్రెస్), ఎం.కె.స్టాలిన్ (డీఎంకే) తదితర నేతలు తనతో ఫోన్లో మాట్లాడి సంఘీభావం ప్రకటించారని చెప్పారు. మోదీ ప్రభుత్వ తీరును ఖండించడానికి కేంద్ర-రాష్ట్ర భద్రత బలగాల సిబ్బందీ ముందుకు రావాలని ఆమె కోరారు. సీబీఐ ఉదంతంపై తాను సోమవారం స్పందిస్తానని కమిషనర్ చెప్పారు. సోమవారం బెంగాల్ అంతటా ఆందోళనలు నిర్వహించేందుకు తృణమూల్ కాంగ్రెస్ సిద్ధమయింది. సీబీఐ కార్యాలయం చుట్టూ పోలీసులు పోలీసు కమిషనర్ నివాసం ఉన్న లౌడాన్ స్ట్రీట్ ప్రాంతం సీబీఐకి-రాష్ట్ర పోలీసులకు మధ్య సమరాంగణంగా మారింది. సీపీ నివాసానికి వచ్చిన సీబీఐ అధికారుల్లో కొందరిని పోలీసులు అరెస్టు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. విధి నిర్వహణలో ఉన్న తమ అధికారుల్ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని సీబీఐ పేర్కొంది. అయితే ఈ అరెస్టులపై స్పష్టత కొరవడింది. సీబీఐ అధికారుల్ని అరెస్టు చేయలేదని, సీపీని ప్రశ్నించేందుకు వారివద్ద తగిన పత్రాలు ఉన్నాయో లేదో సరిచూసేందుకే పోలీసు ఠాణాకు తరలించామని సీనియర్ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు. తమ ఉన్నతాధికారిపైనే సీబీఐ గురి పెట్టడంతో కోల్కతా పోలీసులు దానికి ప్రతిగా సీబీఐ ప్రధాన కార్యాలయం ఉన్న సీజీవో కాంప్లెక్సును చుట్టుముట్టారు. రాత్రి పొద్దుపోయాక అక్కడకు చేరుకున్న కేంద్ర దళాలు వారిచుట్టూ మోహరించాయి. దీంతో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. ఆ తర్వాత కోల్కతా పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కోల్కతాలో సీబీఐ కార్యాలయాల చుట్టూ సీఆర్పీఎఫ్ బలగాలు కనిపిస్తున్నాయి. ఒక రహస్య ఆపరేషన్ నిమిత్తం వచ్చినట్లు మాత్రమే సీబీఐ అధికారులు చెప్పారని, అది ఏమిటని ఎంత ప్రశ్నించినా సంతృప్తికరంగా స్పందన రాలేదని సంయుక్త పోలీసు కమిషనర్ ప్రవీణ్ త్రిపాఠి చెప్పారు. వారివద్ద ఎలాంటి పత్రాలు లేవని స్పష్టం చేశారు. శారదా, రోజ్వ్యాలీ పోంజీ కేసుల్లో ప్రత్యేక దర్యాప్తు బృందాలకు నేతృత్వం వహించిన సీపీని కొన్ని పత్రాల నిమిత్తం ప్రశ్నించాల్సి ఉండగా ఆయన పరారీలో ఉన్నారంటూ శనివారమే సీబీఐ ఆరోపించింది. ఆదివారం సీపీ నివాసం వద్దకు వచ్చిన సీబీఐ అధికారులకు, రాష్ట్ర పోలీసులకు మధ్య తోపులాట నెలకొంది. తర్వాత కొంతమంది సీబీఐ అధికారుల్ని షేక్స్పియర్ సారణి పోలీసు ఠాణాకు చర్చల నిమిత్తం తీసుకువెళ్లారు. ఆ వెంటనే మరికొంత మంది అధికారులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది. ఆ పరిస్థితుల్లో కొందరు సీబీఐ అధికారుల్ని పోలీసు జీపుల్లోకి నెట్టి, ఠాణాకు తరలించారు. సీపీ కుమార్ నగరంలోనే ఉన్నారని, గత నెల 31న మినహా అన్నిరోజులూ కార్యాలయానికి కూడా వచ్చారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. దీనికి విరుద్ధంగా అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కుమార్ 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఎన్నికల నిర్వహణ సన్నద్ధత నిమిత్తం ఎన్నికల సంఘం అధికారులు కోల్కతాలో గతవారం నిర్వహించిన సమావేశానికీ ఆయన హాజరు కాలేదు. వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవులో ఉన్నందున ఆ సమావేశానికి హాజరు కాలేకపోయినటు చెబుతూ సీపీ విచారం వ్యక్తం చేశారని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. మమతకు మద్దతు ప్రకటించిన రాహుల్ మమత చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మద్దతు ప్రకటించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలన్నీ ఒకే మాటపై ఉన్నాయని, ఫాసిస్టు శక్తుల్ని అవి ఓడిస్తాయని దిల్లీలో చెప్పారు. దేశంలోని వ్యవస్థలపై మోదీ, భాజపా చేస్తున్న దాడుల్లో ఇది భాగమన్నారు. ఎమర్జన్సీ తరహా పరిస్థితులు గతంలో దేశంలో అత్యవసర(ఎమర్జెన్సీ) పరిస్థితి విధించినప్పుడు ఇలాంటి రాజ్యాంగేతర విధానాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు పశ్చిమబెంగాల్లో అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. -హెచ్డీ దేవెగౌడ, మాజీ ప్రధాని ప్రజాస్వామ్యం పరిహాసం ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య స్ఫూర్తిని ప్రధాని మోదీ అపహాస్యం పాల్జేస్తున్నారు. కొన్నేళ్లక్రితం పారామిలిటరీ దళాలను పంపించి, దిల్లీ అవినీతి నిరోధకశాఖను అదుపులోకి తెచ్చుకున్నారు. కోల్కతా వివాదాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. - అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం మా మద్దతు మమతా బెనర్జీకే మమతా బెనర్జీ ధర్నాకు పూర్తి మద్దతు తెలుపుతున్నాను. సీబీఐను ఒక రాజకీయ పావుగా వాడుతూ అన్ని పరిమితులు దాటేశారు. మోదీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి మోదీ.. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. - ఒమర్ అబ్దుల్లా, జమ్మూకశ్మీరు మాజీ సీఎం ప్రమాదంలో దేశం, రాజ్యాంగం భాజపా ప్రభుత్వ హింసాత్మక పద్ధతులు, సీబీఐను బహిరంగంగా రాజకీయ పావుగా వాడుకోవడాన్ని చూస్తుంటే.. దేశం, రాజ్యాంగం, ప్రజల స్వాతంత్య్రం ప్రమాదంలో ఉన్నాయనిపిస్తోంది. వీటికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన మమతకు మా మద్దతు ప్రకటిస్తున్నాం. - అఖిలేశ్యాదవ్, ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం సీబీఐది ద్రోహచింత ద్రోహచింతతోనే సీబీఐ కోల్కతాకు వచ్చిందనేది సుస్పష్టం. రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించడానికి బెంగాల్లో వివాదం సృష్టించి, విభజన రాజకీయాలకు పాల్పడాలని చూస్తున్నారు. - అభిషేక్సింఘ్వీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి నేడు సుప్రీంకోర్టుకు వెళ్తాం: సీబీఐ కోల్కతా సీపీని ప్రశ్నించడానికే తమ అధికారులు వెళ్లారని సీబీఐ సంయుక్త సంచాలకుడు పంకజ్ శ్రీవాస్తవ చెప్పారు. ఆయన తమకు సహకరించకపోవడం వల్లనే వెళ్లాల్సి వచ్చిందన్నారు. సీబీఐ కార్యాలయాలు, అధికారుల నివాసాలను పోలీసులు చుట్టుముట్టారని, తన నివాసం వెలుపలా పోలీసులు ఉన్నారని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని, సోమవారమే మరోసారి సర్వోన్నత న్యాయస్థానానికే వెళ్లి పరిస్థితి నివేదిస్తామని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఏమిటీ శారదా కుంభకోణం? కోల్కతా: పశ్చిమబెంగాల్లో 200మంది ప్రైవేటు వ్యక్తులు శారదా గ్రూప్ పేరిట కంపెనీని స్థాపించారు. గొలుసుకట్టు ఆర్థిక పథకాల పేరుతో దాదాపు పదిలక్షల మంది ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నారు. కనీసం రూ.పదివేల కోట్ల ప్రజల ధనం కొల్లగొట్టినట్లు ఏప్రిల్ 2013న వెలుగుచూసింది. దీంతో చిన్న మదుపుదారులను రక్షించేందుకు రూ.500కోట్లతో ప్రత్యేకనిధిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కశ్మీరులో దాగిన కంపెనీ ఛైర్మన్, ఎండీ అయిన సుదీప్సేన్తో పాటు కంపెనీ ప్రముఖులను ఏప్రిల్ 23, 2013న అరెస్టు చేశారు. పలువురు తృణమూల్ ఎంపీలకూ కుంభకోణంలో భాగస్వామ్యం ఉందని పోలీసుల విచారణలో సేన్ వెల్లడించారు. పశ్చిమబెంగాల్ మాజీ డీజీపీ రజత్ మజుందార్కూ ముడుపులు అందాయని మీడియాలో కథనాలు వచ్చాయి. కుంభకోణం వెనుక పెద్దల హస్తం ఉందని తెలిసి సెబీ, ఆర్బీఐ, ఆదాయపు పన్నుశాఖ, కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ రంగంలోకి దిగాయి. కుంభకోణంతో సంబంధం ఉందని ఆరోపణలు వచ్చిన మాజీ మంత్రి మతంగ్సింగ్ సతీమణి మనోరంజన్సింగ్ తరఫున వాదించిన ప్రముఖ న్యాయవాది నళిని చిదంబరానికి చిక్కులు వచ్చి పడ్డాయి. కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం భార్య అయిన ఈమె ఫీజుగా రూ.1.26 కోట్ల ‘శారద’ ధనాన్ని స్వీకరించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు పెట్టింది. ప్రస్తుతం కేసు నడుస్తోంది. కేంద్ర మాజీ రైల్వేమంత్రి ముకుల్రాయ్ను సీబీఐ ఇప్పటికే పలుసార్లు ప్రశ్నించింది. ఈయన మమతాబెనర్జీకి ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. ప్రస్తుతం భాజపాలో ఉన్నారు.ఈ కుంభకోణం పక్క రాష్ట్రమయిన ఒడిశానూ తాకింది. రూ.40 వేల కోట్ల రోజ్వ్యాలీ కుంభకోణం! ఇది కూడా గొలుసుకట్టు(పోంజీ) పథకమే. ప్లాట్ల కొనుగోలు చేయాలనుకునేవారిని, విహార యాత్రలకు వెళ్లాలనుకునేవారిని లక్ష్యంగా చేసుకున్నారు. కమీషన్ పద్ధతిన గొలుసుకట్టుగా చందాదారులను చేర్పించారు. కాలావధి ముగిసిన తరువాత డబ్బును డిపాజిట్ చేసినవారికి 21శాతం వడ్డీ ఆశ చూపారు. దాదాపు రూ.40వేల కోట్లను రోజ్వ్యాలీ రియల్ఎస్టేట్స్- కన్స్ట్రక్షన్స్; రోజ్వ్యాలీ హోటల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్ కంపెనీలు ప్రజల నుంచి సేకరించాయి. జులై 2013, జూన్ 2014లో ఈ పథకాలను ‘సెబీ’ చట్టవ్యతిరేకంగా ప్రకటించింది. మనీ రొటేషన్ ఆగిపోయింది. ప్రజల సొమ్ము అక్రమార్కుల పాలైంది. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన తపస్పాల్, సుదీప్ బందోపాధ్యాయ్, రోజ్వ్యాలీ గ్రూప్ ఛైర్మన్ గౌతం కుందును సీబీఐ అరెస్టు చేసింది. Quote
snoww Posted February 4, 2019 Author Report Posted February 4, 2019 Quote సీబీఐ అధికారుల్ని నిర్బంధించిన బెంగాల్ పోలీసులు lol Quote
Sreeven Posted February 4, 2019 Report Posted February 4, 2019 1 hour ago, snoww said: lol Cbn kuda ade follow avutademo..next jagan cm aina ade cheste...evadiki ishtam vachinattu vallu cheyandi Quote
Vaampire Posted February 4, 2019 Report Posted February 4, 2019 Haha. Scam vishayam lo enquiry cheyyadaniki cbi vasthey vallani state police arrest cheyyadam. Super assalu. Porapatuna emey or emey tho alliance unnolu pm ayithey inka india kantey paki better Quote
sonybravia Posted February 4, 2019 Report Posted February 4, 2019 2 hours ago, snoww said: మోదీ(సీబీఐ) X (పోలీస్)దీదీ కోల్కతాలో అనూహ్య పరిణామాలు పోలీసు కమిషనర్ నివాసానికి సీబీఐ బలగాలు సీబీఐ అధికారుల్ని నిర్బంధించిన బెంగాల్ పోలీసులు మోదీ ప్రభుత్వంపై మండిపడ్డ పశ్చిమబెంగాల్ సీఎం మమత విపక్షాలతో సభ నిర్వహించినందుకే ఈ ప్రతీకారమని ధ్వజం రాత్రికి రాత్రి నడిరోడ్డుపై ధర్నా దీదీకి విపక్షాల మద్దతు నేడు సుప్రీంకోర్టు తలుపు తట్టనున్న కేంద్ర దర్యాప్తు సంస్థ కోల్కతా: కేంద్రానికి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ఇప్పటికే మోదీ, మమత మధ్య ఉప్పూనిప్పులా పరిస్థితి ఉండగా కోల్కతా పోలీస్ కమిషనర్ను ప్రశ్నించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రావడంతో అగ్గి మరింత రాజుకుంది. శారదా కుంభకోణం కేసులో కోల్కతా పోలీసు కమిషనర్ను ప్రశ్నించే నిమిత్తం సీబీఐ అధికారులు ఆదివారం సాయంత్రం అనూహ్య రీతిలో నేరుగా ఆయన నివాసానికి వెళ్లే ప్రయత్నం చేశారు. సీపీ ‘పరారీ’లో ఉన్నందునే తాము ఈ చర్యకు దిగాల్సి వచ్చిందని సీబీఐ సమర్థించుకుంది. తక్షణం అప్రమత్తమైన పోలీసు బలగాలు సీబీఐ అధికారుల్ని ఆయన నివాసానికి వెలుపలే అడ్డుకోవడమే కాకుండా వారిని జీపులో పడేసి పోలీసు స్టేషన్కు తీసుకుపోయాయి. సీబీఐ దూకుడుపై మమత అగ్గిమీద గుగ్గిలమయ్యారు. హుటాహుటిన నేరుగా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసానికి చేరుకుని రాష్ట్ర సర్కారు తరఫున పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. డీజీపీ కూడా ఆ సమయానికి అక్కడకు చేరుకున్నారు. గత నెల 31న ఒక్కరోజు సెలవు పెట్టడం మినహా కమిషనర్ నగరంలోనే ఉన్నారని, పరారీలో ఉన్నట్లుగా ఎలా నింద వేస్తారని మమత కేంద్రాన్ని నిలదీశారు. ఆయన్ని విచారించేందుకు సీబీఐ వద్ద ఎలాంటి వారెంటు లేదని చెప్పారు. పోలీసు శాఖతో పాటు అన్ని వ్యవస్థల్ని తమ గుప్పిట పెట్టుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తన పాలన యంత్రాంగం మీద దాడికి కేంద్ర బలగాలను పంపిస్తున్నారని ఆక్షేపించారు. దీనిపై తాను తక్షణం దీక్షకు దిగుతానని ప్రకటించి, రాత్రికి రాత్రి ఎస్ప్లనేడ్ వద్ద సత్యాగ్రహం చేపట్టారు. సోమవారం నాటి శాసనసభ కార్యకలాపాలు తాను కూర్చొన్నచోటనే జరుగుతాయని తేల్చి చెప్పారు. ‘బెంగాల్పై భాజపా కత్తికట్టింది. రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తోంది. విపక్షాల ఐక్యత సభను ఇక్కడ నిర్వహించినందుకే ఇదంతా చేస్తోంది. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రతీకారమే. సాక్షాత్తూ ప్రధాని నన్ను బెదిరించేలా ఎలా మాట్లాడారో చూశారుగా... ఉన్నతాధికారుల్ని వేధించడం ద్వారా రాష్ట్రంలో రాజకీయ తుపాను సృష్టించాలని భాజపా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో తిరుగుబాటు రావాలని మోదీ-అమిత్షా ద్వయం కోరుకొంటోంది. ప్రధాని ఆదేశాలకు లోబడి రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి జాతీయ భద్రత సలహాదారుడు అజిత్ డోభాల్ తగు రీతిలో ఆదేశాలిస్తున్నారు. చేతికి రక్తపు మరకలు అంటిన చరిత్ర ఉన్న ఇలాంటి ప్రధాని గురించి మాట్లాడడానికి నేను సిగ్గుపడుతున్నా’ అని నిప్పులు చెరిగారు. ప్రాణాలనైనా అర్పిస్తానే గానీ కేంద్ర సర్కారు ముందు తలొంచేది లేదని చెప్పారు. కమిషనర్ కుమార్ ప్రపంచంలోనే ఉన్నతమైన అధికారి అని నేను ఇప్పటికీ చెప్పగలను అని స్పష్టం చేశారు. ‘శారద యజమానుల్ని అరెస్టు చేసింది మేం. విచారణకు సిట్ను ఏర్పాటు చేసింది మేం. పోలీసులకు రక్షణ కల్పించడం ప్రభుత్వాధినేతగా నా బాధ్యత. సీబీఐ అధికారుల్ని అరెస్టు చేసే అవకాశమున్నా విడిచిపెట్టాం. శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం. సీబీఐకి అన్నింటినీ మేమెందుకు ఇవ్వాలి? వారెంటు లేకుండానే కమిషనర్ నివాసంపైకి రావడానికి వారికి ఎంత ధైర్యం?’ అని ప్రశ్నిస్తూ అపర కాళిక అయ్యారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఎన్డీయే సర్కారు కోరుకొంటోందా అని ప్రశ్నించారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల దృష్ట్యా సోమవారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు తాను హాజరు కావడం లేదని ప్రకటించారు. మోదీ సర్కారును గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వివిధ విపక్ష నేతలైన చంద్రబాబునాయుడు (తెదేపా), అఖిలేశ్ యాదవ్ (సమాజ్వాదీ), తేజస్వీ యాదవ్(ఆర్జేడీ), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), అహ్మద్ పటేల్ (కాంగ్రెస్), ఎం.కె.స్టాలిన్ (డీఎంకే) తదితర నేతలు తనతో ఫోన్లో మాట్లాడి సంఘీభావం ప్రకటించారని చెప్పారు. మోదీ ప్రభుత్వ తీరును ఖండించడానికి కేంద్ర-రాష్ట్ర భద్రత బలగాల సిబ్బందీ ముందుకు రావాలని ఆమె కోరారు. సీబీఐ ఉదంతంపై తాను సోమవారం స్పందిస్తానని కమిషనర్ చెప్పారు. సోమవారం బెంగాల్ అంతటా ఆందోళనలు నిర్వహించేందుకు తృణమూల్ కాంగ్రెస్ సిద్ధమయింది. సీబీఐ కార్యాలయం చుట్టూ పోలీసులు పోలీసు కమిషనర్ నివాసం ఉన్న లౌడాన్ స్ట్రీట్ ప్రాంతం సీబీఐకి-రాష్ట్ర పోలీసులకు మధ్య సమరాంగణంగా మారింది. సీపీ నివాసానికి వచ్చిన సీబీఐ అధికారుల్లో కొందరిని పోలీసులు అరెస్టు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. విధి నిర్వహణలో ఉన్న తమ అధికారుల్ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని సీబీఐ పేర్కొంది. అయితే ఈ అరెస్టులపై స్పష్టత కొరవడింది. సీబీఐ అధికారుల్ని అరెస్టు చేయలేదని, సీపీని ప్రశ్నించేందుకు వారివద్ద తగిన పత్రాలు ఉన్నాయో లేదో సరిచూసేందుకే పోలీసు ఠాణాకు తరలించామని సీనియర్ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు. తమ ఉన్నతాధికారిపైనే సీబీఐ గురి పెట్టడంతో కోల్కతా పోలీసులు దానికి ప్రతిగా సీబీఐ ప్రధాన కార్యాలయం ఉన్న సీజీవో కాంప్లెక్సును చుట్టుముట్టారు. రాత్రి పొద్దుపోయాక అక్కడకు చేరుకున్న కేంద్ర దళాలు వారిచుట్టూ మోహరించాయి. దీంతో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. ఆ తర్వాత కోల్కతా పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కోల్కతాలో సీబీఐ కార్యాలయాల చుట్టూ సీఆర్పీఎఫ్ బలగాలు కనిపిస్తున్నాయి. ఒక రహస్య ఆపరేషన్ నిమిత్తం వచ్చినట్లు మాత్రమే సీబీఐ అధికారులు చెప్పారని, అది ఏమిటని ఎంత ప్రశ్నించినా సంతృప్తికరంగా స్పందన రాలేదని సంయుక్త పోలీసు కమిషనర్ ప్రవీణ్ త్రిపాఠి చెప్పారు. వారివద్ద ఎలాంటి పత్రాలు లేవని స్పష్టం చేశారు. శారదా, రోజ్వ్యాలీ పోంజీ కేసుల్లో ప్రత్యేక దర్యాప్తు బృందాలకు నేతృత్వం వహించిన సీపీని కొన్ని పత్రాల నిమిత్తం ప్రశ్నించాల్సి ఉండగా ఆయన పరారీలో ఉన్నారంటూ శనివారమే సీబీఐ ఆరోపించింది. ఆదివారం సీపీ నివాసం వద్దకు వచ్చిన సీబీఐ అధికారులకు, రాష్ట్ర పోలీసులకు మధ్య తోపులాట నెలకొంది. తర్వాత కొంతమంది సీబీఐ అధికారుల్ని షేక్స్పియర్ సారణి పోలీసు ఠాణాకు చర్చల నిమిత్తం తీసుకువెళ్లారు. ఆ వెంటనే మరికొంత మంది అధికారులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఉద్రిక్తత పెరిగింది. ఆ పరిస్థితుల్లో కొందరు సీబీఐ అధికారుల్ని పోలీసు జీపుల్లోకి నెట్టి, ఠాణాకు తరలించారు. సీపీ కుమార్ నగరంలోనే ఉన్నారని, గత నెల 31న మినహా అన్నిరోజులూ కార్యాలయానికి కూడా వచ్చారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. దీనికి విరుద్ధంగా అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కుమార్ 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఎన్నికల నిర్వహణ సన్నద్ధత నిమిత్తం ఎన్నికల సంఘం అధికారులు కోల్కతాలో గతవారం నిర్వహించిన సమావేశానికీ ఆయన హాజరు కాలేదు. వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవులో ఉన్నందున ఆ సమావేశానికి హాజరు కాలేకపోయినటు చెబుతూ సీపీ విచారం వ్యక్తం చేశారని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. మమతకు మద్దతు ప్రకటించిన రాహుల్ మమత చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మద్దతు ప్రకటించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలన్నీ ఒకే మాటపై ఉన్నాయని, ఫాసిస్టు శక్తుల్ని అవి ఓడిస్తాయని దిల్లీలో చెప్పారు. దేశంలోని వ్యవస్థలపై మోదీ, భాజపా చేస్తున్న దాడుల్లో ఇది భాగమన్నారు. ఎమర్జన్సీ తరహా పరిస్థితులు గతంలో దేశంలో అత్యవసర(ఎమర్జెన్సీ) పరిస్థితి విధించినప్పుడు ఇలాంటి రాజ్యాంగేతర విధానాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు పశ్చిమబెంగాల్లో అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. -హెచ్డీ దేవెగౌడ, మాజీ ప్రధాని ప్రజాస్వామ్యం పరిహాసం ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య స్ఫూర్తిని ప్రధాని మోదీ అపహాస్యం పాల్జేస్తున్నారు. కొన్నేళ్లక్రితం పారామిలిటరీ దళాలను పంపించి, దిల్లీ అవినీతి నిరోధకశాఖను అదుపులోకి తెచ్చుకున్నారు. కోల్కతా వివాదాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. - అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం మా మద్దతు మమతా బెనర్జీకే మమతా బెనర్జీ ధర్నాకు పూర్తి మద్దతు తెలుపుతున్నాను. సీబీఐను ఒక రాజకీయ పావుగా వాడుతూ అన్ని పరిమితులు దాటేశారు. మోదీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి మోదీ.. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. - ఒమర్ అబ్దుల్లా, జమ్మూకశ్మీరు మాజీ సీఎం ప్రమాదంలో దేశం, రాజ్యాంగం భాజపా ప్రభుత్వ హింసాత్మక పద్ధతులు, సీబీఐను బహిరంగంగా రాజకీయ పావుగా వాడుకోవడాన్ని చూస్తుంటే.. దేశం, రాజ్యాంగం, ప్రజల స్వాతంత్య్రం ప్రమాదంలో ఉన్నాయనిపిస్తోంది. వీటికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన మమతకు మా మద్దతు ప్రకటిస్తున్నాం. - అఖిలేశ్యాదవ్, ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం సీబీఐది ద్రోహచింత ద్రోహచింతతోనే సీబీఐ కోల్కతాకు వచ్చిందనేది సుస్పష్టం. రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించడానికి బెంగాల్లో వివాదం సృష్టించి, విభజన రాజకీయాలకు పాల్పడాలని చూస్తున్నారు. - అభిషేక్సింఘ్వీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి నేడు సుప్రీంకోర్టుకు వెళ్తాం: సీబీఐ కోల్కతా సీపీని ప్రశ్నించడానికే తమ అధికారులు వెళ్లారని సీబీఐ సంయుక్త సంచాలకుడు పంకజ్ శ్రీవాస్తవ చెప్పారు. ఆయన తమకు సహకరించకపోవడం వల్లనే వెళ్లాల్సి వచ్చిందన్నారు. సీబీఐ కార్యాలయాలు, అధికారుల నివాసాలను పోలీసులు చుట్టుముట్టారని, తన నివాసం వెలుపలా పోలీసులు ఉన్నారని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని, సోమవారమే మరోసారి సర్వోన్నత న్యాయస్థానానికే వెళ్లి పరిస్థితి నివేదిస్తామని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఏమిటీ శారదా కుంభకోణం? కోల్కతా: పశ్చిమబెంగాల్లో 200మంది ప్రైవేటు వ్యక్తులు శారదా గ్రూప్ పేరిట కంపెనీని స్థాపించారు. గొలుసుకట్టు ఆర్థిక పథకాల పేరుతో దాదాపు పదిలక్షల మంది ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నారు. కనీసం రూ.పదివేల కోట్ల ప్రజల ధనం కొల్లగొట్టినట్లు ఏప్రిల్ 2013న వెలుగుచూసింది. దీంతో చిన్న మదుపుదారులను రక్షించేందుకు రూ.500కోట్లతో ప్రత్యేకనిధిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కశ్మీరులో దాగిన కంపెనీ ఛైర్మన్, ఎండీ అయిన సుదీప్సేన్తో పాటు కంపెనీ ప్రముఖులను ఏప్రిల్ 23, 2013న అరెస్టు చేశారు. పలువురు తృణమూల్ ఎంపీలకూ కుంభకోణంలో భాగస్వామ్యం ఉందని పోలీసుల విచారణలో సేన్ వెల్లడించారు. పశ్చిమబెంగాల్ మాజీ డీజీపీ రజత్ మజుందార్కూ ముడుపులు అందాయని మీడియాలో కథనాలు వచ్చాయి. కుంభకోణం వెనుక పెద్దల హస్తం ఉందని తెలిసి సెబీ, ఆర్బీఐ, ఆదాయపు పన్నుశాఖ, కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ రంగంలోకి దిగాయి. కుంభకోణంతో సంబంధం ఉందని ఆరోపణలు వచ్చిన మాజీ మంత్రి మతంగ్సింగ్ సతీమణి మనోరంజన్సింగ్ తరఫున వాదించిన ప్రముఖ న్యాయవాది నళిని చిదంబరానికి చిక్కులు వచ్చి పడ్డాయి. కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం భార్య అయిన ఈమె ఫీజుగా రూ.1.26 కోట్ల ‘శారద’ ధనాన్ని స్వీకరించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు పెట్టింది. ప్రస్తుతం కేసు నడుస్తోంది. కేంద్ర మాజీ రైల్వేమంత్రి ముకుల్రాయ్ను సీబీఐ ఇప్పటికే పలుసార్లు ప్రశ్నించింది. ఈయన మమతాబెనర్జీకి ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. ప్రస్తుతం భాజపాలో ఉన్నారు.ఈ కుంభకోణం పక్క రాష్ట్రమయిన ఒడిశానూ తాకింది. రూ.40 వేల కోట్ల రోజ్వ్యాలీ కుంభకోణం! ఇది కూడా గొలుసుకట్టు(పోంజీ) పథకమే. ప్లాట్ల కొనుగోలు చేయాలనుకునేవారిని, విహార యాత్రలకు వెళ్లాలనుకునేవారిని లక్ష్యంగా చేసుకున్నారు. కమీషన్ పద్ధతిన గొలుసుకట్టుగా చందాదారులను చేర్పించారు. కాలావధి ముగిసిన తరువాత డబ్బును డిపాజిట్ చేసినవారికి 21శాతం వడ్డీ ఆశ చూపారు. దాదాపు రూ.40వేల కోట్లను రోజ్వ్యాలీ రియల్ఎస్టేట్స్- కన్స్ట్రక్షన్స్; రోజ్వ్యాలీ హోటల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్ కంపెనీలు ప్రజల నుంచి సేకరించాయి. జులై 2013, జూన్ 2014లో ఈ పథకాలను ‘సెబీ’ చట్టవ్యతిరేకంగా ప్రకటించింది. మనీ రొటేషన్ ఆగిపోయింది. ప్రజల సొమ్ము అక్రమార్కుల పాలైంది. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన తపస్పాల్, సుదీప్ బందోపాధ్యాయ్, రోజ్వ్యాలీ గ్రూప్ ఛైర్మన్ గౌతం కుందును సీబీఐ అరెస్టు చేసింది. Mundhu dheenni vesi 10gaali, sagam Shani vaddhuluddhi Deshaaniki... Modi meedha enni saarlu CBI vaalu enquiry cheyaledhu?? Appudu ee lafda gaalu emi matladaledhu, ippudu maathram egesukuni vasthunnaru ?? Quote
bhaigan Posted February 4, 2019 Report Posted February 4, 2019 DiDi chala overaction chesthundi, West Bengal CM avvaganey emi emi natakalu adindo chusinam kada Quote
LuciferMorningStar Posted February 4, 2019 Report Posted February 4, 2019 37 minutes ago, bhaigan said: DiDi chala overaction chesthundi, West Bengal CM avvaganey emi emi natakalu adindo chusinam kada Modi meeda 100 times better le.... Quote
LuciferMorningStar Posted February 4, 2019 Report Posted February 4, 2019 Asalu enti eee dourbhagyam....asalu post independent India lo intha misuse of federal agencies eppudu jaraga ledu. Mamata kuda defend chesukundi dantlo elanti tappu ledu asalu evanni chustuntey US Director of National Intelligence Dan Coats cheppindi nijam ayyetattu undi. Quote
bhaigan Posted February 4, 2019 Report Posted February 4, 2019 1 hour ago, LuciferMorningStar said: Modi meeda 100 times better le.... chaa nijama, mamata banerjee CM ayina first meeting nunde walk out chesindi, eme modi ki 100 times leda 100 times better aa apati nunchi motham bengal ni sanka nakipichindi, bengal motham looty ee looty motham looty chesindi Quote
bhaigan Posted February 4, 2019 Report Posted February 4, 2019 1 hour ago, LuciferMorningStar said: Asalu enti eee dourbhagyam....asalu post independent India lo intha misuse of federal agencies eppudu jaraga ledu. Mamata kuda defend chesukundi dantlo elanti tappu ledu asalu evanni chustuntey US Director of National Intelligence Dan Coats cheppindi nijam ayyetattu undi. mamata defend chesthunda leda India ni motham divide chesthunda Quote
Android_Halwa Posted February 4, 2019 Report Posted February 4, 2019 Denamma...deniki moodindi...istamochinattu chestundi...Amit shah helicopter landing permission, yogi ki kuda Ivaledu...cancelling BJP rallies across the states, attacking BJP cadres, now obstructing CBI... bengal kadu, adi banana republic tayar ayindi....anduke dharnalu chesetollani CM chesthe itle ayitadi Quote
rrc_2015 Posted February 4, 2019 Report Posted February 4, 2019 4 minutes ago, Android_Halwa said: Denamma...deniki moodindi...istamochinattu chestundi...Amit shah helicopter landing permission, yogi ki kuda Ivaledu...cancelling BJP rallies across the states, attacking BJP cadres, now obstructing CBI... bengal kadu, adi banana republic tayar ayindi....anduke dharnalu chesetollani CM chesthe itle ayitadi WB ni Bangladesh kante goranga chesindi... if she is not guilty, she can prove it with CBI.... using police against cbi is wrong . Quote
Android_Halwa Posted February 4, 2019 Report Posted February 4, 2019 6 minutes ago, rrc_2015 said: WB ni Bangladesh kante goranga chesindi... if she is not guilty, she can prove it with CBI.... using police against cbi is wrong . antha ledu kaka...sharada chitfund, rose chit fund, narada tapes controversy la motham TMC leadership vundi including mamatya Banerjee... manchidi ayindi that CBI faced backlash and now they filed a plea with SC....now, there is no going back and SC monitoring la m=nadustadi...initial jhatka etlaina estadis upreme court but eventually will order the state government to co-operate with the proble, lekapothe contempt of court kinda lopala esi padestaru Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.