Jump to content

Recommended Posts

Posted
మాయావతి, అఖిలేశ్‌కి కాంగ్రెస్ మరో షాక్!
14-02-2019 15:24:14
 
636857549404915271.jpg
లక్నో: సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా మారిన ఉత్తరప్రదేశ్‌లో ఒంటరిగానే బరిలోకి దిగాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే ఆరాధన మిశ్రా స్పష్టం చేశారు. ప్రియాంక గాంధీ నేతృత్వంలో లక్నో వేదికగా జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశానికి హాజరైన అనంతరం ఆరాధన మిశ్రా మీడియాతో మాట్లాడారు. ‘‘11 నియోజక వర్గాలకు చెందిన నేతలు ఇవాళ ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియాలను కలుసుకున్నారు. యూపీలోని మొత్తం 80 స్థానాల్లోనూ మా పార్టీ పోటీచేస్తున్నట్టు ప్రియాంక స్పష్టంగా చెప్పారు....’’ అని ఆమె పేర్కొన్నారు. దీంతో తాజాగా మళ్లీ కాంగ్రెస్‌తో కలుస్తారని భావిస్తున్న సమాజ్వాదీ పార్టీ పరిస్థితి సందిగ్ధంలో పడినట్టైంది.
 
 దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌లో తనకు కలిసి వచ్చే ఏ అవకాశాన్నీ కాంగ్రెస్ వదులుకోవడం లేదు. సోమవారం ప్రియాంక గాంధీ, ఆమె సోదరుడు రాహుల్ గాంధీ, సింధియాలతో కలిసి లక్నోలో భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు యూపీలో కాంగ్రెస్ చేపట్టిన అతిపెద్ద ర్యాలీ కూడా ఇదే. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పక్కనబెడుతూ ఎస్పీ, బీఎస్పీ పార్టీలు రాష్ట్రంలోని మొత్తం టికెట్లను చెరో సగం పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు బీజేపీకి, ఇటు ఎస్పీ-బీఎస్పీ కూటమికి చెక్ పెట్టేందుకు ప్రియాంక గాంధీని రంగంలోకి దించినట్టు భావిస్తున్నారు.
Posted

evadiki evadi meeda nammakam ledu CBN sir invent chesina congress led front lo. 

after elections evadu ina hand ivvochu ani everyone looking to contest in all possible seats. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...