Hydrockers Posted March 23, 2019 Report Posted March 23, 2019 నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు చేతులు ఎత్తేస్తున్న వైనాలు కనిపిస్తూ ఉన్నాయి. అభ్యర్థిత్వాలు ఖరారు అయిన తర్వాత కొందరు చేతులు ఎత్తేశారు. ఇప్పుడు నామినేషన్ల దాఖలు తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీకి ఒక అభ్యర్థి ఝలక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన తర్వాత.. తనకు టికెట్ అవసరం లేదని, తను పోటీలో ఉండటంలేదని ప్రకటించిన ఆ నేత బద్వేల్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఈ రిజర్వ్డ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన రాజశేఖర్ ఇప్పుడు చేతులు ఎత్తేశారని సమాచారం. తను పోటీలో ఉండటం లేదని.. టికెట్ కోసమని తను చెల్లించిన డబ్బులను ఇప్పుడు వెనక్కు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారట. తను మూడుకోట్ల రూపాయల మొత్తాన్ని అధిష్టాన వర్గానికి చెల్లించినట్టుగా, ఆ డబ్బులను ఇప్పుడు వెనుక్కు ఇవ్వాలని.. తను పోటీలో ఉండటం లేదని.. వేరే ఎవరికైనా బీఫారం ఇచ్చుకోవాలని రాజశేఖర్ వాదిస్తున్నట్టుగా సమాచారం. ఒకవైపు బద్వేల్ లో ప్రచారానికి చంద్రబాబు నాయుడు వెళ్తున్న సమయంలో అక్కడ అభ్యర్థి చేతులు ఎత్తేయడం విశేషం. ఇక్కడ టికెట్ విషయంలో తెలుగుదేశం పార్టీలో చాలా రచ్చేసాగింది. వేరేవాళ్లు టికెట్లు ఆశించినా చంద్రబాబు నాయుడు ఏరికోరి రాజశేఖర్ కు టికెట్ ఇచ్చారు. అతడేమో తను పోటీలో ఉండటం లేదని అంటున్నారట. ఈ నేపథ్యంలో ఇక్కడ రాజకీయం ఆసక్తిదాయకంగా మారింది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. గెలిచిన ఎమ్మెల్యేను చంద్రబాబు నాయుడు ఫిరాయింపజేసుకున్నారు. ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ ముగుస్తున్న దశలో కొత్త లొల్లి మొదలైంది! Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.