kakatiya Posted April 26, 2019 Report Posted April 26, 2019 హాజీపూరం(బొమ్మలరామారం): పాఠశాల విద్యార్థిని హత్యకు గురైన ఘటన బొమ్మలరామారం మండలం హాజీపూరం గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హాజీపూరం గ్రామానికి చెందిన పాముల శ్రావణి మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పదో తరగతి ప్రత్యేక తరగతులకు రోజూ వెళ్తుంది. గురువారం పాఠశాలకు హాజరై తిరిగి బొమ్మలరామారం వరకు తోటి విద్యార్థులతో కలిసి వచ్చింది. రాత్రి వరకు విద్యార్థిని ఇంటికి రాకపోవడంతో తండ్రి నర్సింహ స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం బొమ్మలరామారం నుంచి హాజీపూరం గ్రామం రహదారుల చుట్టుపక్కల డాగ్స్కాడ్, క్లూస్టీంతో గాలించారు. గ్రామానికి దగ్గరలో ఉన్న వ్యవసాయబావిలో శ్రావణి పాఠశాల బ్యాగు, బస్సుపాస్ లభ్యమైంది. ఆ పరిసర ప్రాంతంలో మద్యం సీసాలు కూడా దొరికాయి. ఆ పక్కనే మరోబావిలో శ్రావణి మృతదేహం లభ్యమైంది. సరైన సమయంలో మృతదేహాన్ని గుర్తించడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది యువకులు డీసీపీ నారాయణరెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఏసీపీ భుజంగరావు, డీసీపీ నారాయణరెడ్డి, సీఐ సురేందర్రెడ్డి పోలీసులు కలుగచేసుకొని మృతదేహాన్ని బయటకు తీశారు.హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.