Jump to content

Recommended Posts

Posted
ఆర్టీసీ బస్సు బోల్తా

గుట్కా తినేందుకు స్టీరింగ్‌ వదిలేసిన డ్రైవర్‌..
  30 మందికి గాయాలు
  కొద్దిలో తప్పిన పెనుప్రమాదం
మల్హర్‌ - న్యూస్‌టుడే

15main8a_2.jpg

డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. మల్హర్‌ మండలం పీవీనగర్‌ సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో 63 మంది ప్రయాణిస్తుండగా 30 మంది గాయపడ్డారు. బస్సు డ్రైవర్‌ స్టీరింగ్‌ను వదిలేయడమే ప్రమాదానికి కారణమని బస్సులోని ఓ ప్రయాణికురాలు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. గోదావరిఖని డిపోకు చెందిన అద్దె బస్సు బుధవారం ఉదయం 9.50 గంటలకు గోదావరిఖని నుంచి భూపాలపల్లికి బయలుదేరింది. 11.45 గంటల సమయంలో మల్హర్‌ మండలంలోని మానేరు వంతెన దాటగానే బస్సు ఎడమవైపు బోల్తా కొట్టింది. ప్రారంభం నుంచీ డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి వాహనాన్ని వేగంగా నడపసాగాడు. వాహనం వంతెన దాటగానే స్టీరింగ్‌పై చేతులు తీసేసి గుట్కా తినసాగాడు. అదేసమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో హఠాత్తుగా బ్రేక్‌ వేయడంతో బస్సు అదుపు తప్పి 20 అడుగుల గోతిలో పడింది. దీంతో ఆ ప్రాంతమంతా క్షతగాత్రుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది.

ప్రారంభం నుంచీ డ్రైవర్‌ నిర్లక్ష్యమే
బస్సు ప్రయాణం ప్రారంభమైన గోదావరిఖని నుంచి డ్రైవర్‌ నిర్లక్ష్యంతో బస్సును నడుపుతున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. పలుమార్లు బస్సులో ఉన్నవారు నెమ్మదిగా వాహనాన్ని నడపాలని హెచ్చరించినా డ్రైవర్‌ పెడచెవిన పెట్టాడని ఆరోపించారు. ఇరుకుగా ఉండే ఈ వంతెన దాటిన కొద్ది దూరంలోనే బస్సు ప్రమాదం జరగడం వల్ల ప్రాణనష్టం సంభవించలేదని.. అదే వంతెనపైన ప్రమాదం జరిగితే భారీగా నష్టం జరిగేదని ప్రయాణికులు వాపోయారు. మంథని మండలం బోయినపల్లికి చెందిన కూకట్ల రజిత మాట్లాడుతూ తాను మంథనిలో బస్సెక్కి డ్రైవర్‌ సమీపంలో ఉన్న సీట్లో కూర్చున్నానని తెలిపారు. బ్రిడ్జి దాటాక డ్రైవర్‌ రెండు చేతులు వదిలి గుట్కా ప్యాకెట్‌ నోట్లో వేసుకుంటున్నాడని, ఆ సమయంలో ఎదురుగా లారీ రావడంతో బ్రేకులు వేయగా బస్సు అదుపు తప్పి గోతిలో పడిపోయిందని వాపోయారు.

15main8b.jpg

క్షతగాత్రులకు పోలీసుల చేయూత
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ ఆదేశాల మేరకు కాటారం సీఐ శివప్రసాద్‌, ఎస్సైలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీసుకొచ్చారు. గాయపడిన వారి వివరాలు తెలుసుకుని ప్రత్యేక వాహనాల్లో కాటారం, మంథనిలోని ఆసుపత్రులకు తరలించారు.

15main8c.jpg

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...