Jump to content

Recommended Posts

Posted
కుమారుడు సహా భర్తను హతమార్చిన భార్య 

 అదృశ్యమయ్యారని తొలుత ఫిర్యాదు

 విచారణలో బయటపడిన దారుణం

 నిందితురాలి అరెస్టు

కుమారుడు సహా భర్తను హతమార్చిన భార్య 
మృతదేహాలను పూడ్చిన ప్రాంతాన్ని పోలీసులకు చూపుతున్న దీపిక

వేలూరు: పచ్చని సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చురేపింది. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను, కడుపున పుట్టిన కుమారుడిని ప్రియుడి మోజులో కర్కశంగా కడతేర్చిందో మహిళ. పైగా ఏమీ తెలియనట్లు పోలీసుల వద్దకు వెళ్లి తన భర్త, కుమారుడు కనిపించడం లేదని నాటకానికి తెరతీసింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలతో పొంతన కుదరకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేపట్టగా చేసిన దారుణాన్ని అంగీకరించింది. భర్తతోపాటు కుమారుడిని తానే హత్య చేసి ఇంటి సమీపంలోని చెరువులో పూడ్చి పెట్టినట్లు తెలపడంతో పోలీసులే నివ్వెరపోవాల్సి వచ్చింది. ఈ హత్యల్లో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా.. అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. వేలూరు జిల్లా ఆర్కాడు సమీపంలో ఉంటున్న తండ్రీకొడుకులు రాజా, ప్రినీష్‌లు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోగా.. నిందితురాలు దీపికను పోలీసులు అరెస్టు చేశారు.

కుమారుడు సహా భర్తను హతమార్చిన భార్యఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను, కుమారుడిని హత్య చేసిన భార్యను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వేలూరు జిల్లా ఆర్కాడు సమీప తాజ్‌పురా మందవేలి ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణి కుమారుడు రాజా(25) ఎలక్ట్రీషియన్‌. రెండు సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న దీపికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఏడాది వయస్సున్న ప్రినీష్‌ అనే కుమారుడు ఉన్నాడు. ఇదిలా ఉండగా భర్త, కుమారుడు ఈ నెల 13వ తేదీ నుంచి కనిపించలేదని ఏడుస్తూ గురువారం ఆర్కాడు పోలీసు స్టేషన్‌లో దీపిక ఫిర్యాదు చేసింది. అతని ఫోన్‌ నెంబరు ఇస్తే ఎక్కడున్నా పట్టుకుంటామని పోలీసులు చెప్పగా.. అతను ఇంట్లోనే ఫోన్‌ పెట్టేసి వెళ్లినట్లు సమాధానం ఇచ్చింది. తర్వాత పోలీసుల ప్రశ్నలకు ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెనే అదుపులోకి తీసుకొని విచారించారు. చివరకు భర్తతోపాటు కుమారుడిని తానే హత్య చేసి ఇంటి సమీపంలోని చెరువులో పూడ్చి పెట్టినట్లు చెప్పడంతో పోలీసులు నివ్వెరపోయ్యారు. వెంటనే వారిని పూడ్చిపెట్టిన ప్రాంతం చూపాలని పోలీసులు కోరగా రాత్రి 11 గంటలు కావడంతో ఉదయం చూపిస్తానని చెప్పింది. రాత్రి ఆమెను స్టేషన్‌లోనే ఉంచిన పోలీసులు శుక్రవారం ఉదయం ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. భర్త, కుమారుడిని పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని చూపించన తర్వాత అక్కడే ఉన్న రాజా బంధువులు దీపికపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆమె తల్లి ఇంటిపైనా దాడి చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో దీపికను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. తహసీల్దారు వసంత లత, రాణిపేటై డీఎస్పీ కలైసెల్వన్‌, ఆర్కాడు తాలూకా ఇన్‌స్పెక్టరు భాను తదితరులు మృతదేహాలను వెలికి తీయించి పరిశీలించారు. జాగిలంతో ఘటనా స్థలంలో ఆధారాల కోసం వెతికారు. అడుకంపారై ప్రభుత్వ ఆసుపత్రి పోరెన్సిక్‌ వైద్యులు అక్కడికే చేరుకొని మృతదేహాలకు పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక విచారణలో దీపికకు రాజా స్నేహితుడితో వివాహేతర సంబంధం ఉందని, ఈ కారణంతోనే భర్తతోపాటు కుమారుడిని దారుణంగా హత్య చేసినట్లు తేలిందని పోలీసు పేర్కొన్నారు. దీపికతో సంబంధం పెట్టుకున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యల్లో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా..? ఎంత మంది కలిసి హత్య చేశారనే కోణంలో విచారణ జరుపుతున్నామన్నారు.

కుమారుడు సహా భర్తను హతమార్చిన భార్య

Posted

nice

Posted
1 minute ago, Biskot2 said:

nice

Nuvvenduku fake ID to ne postlanu upvote chesukuntav

Posted
4 minutes ago, DrBeta said:

Nuvvenduku fake ID to ne postlanu upvote chesukuntav

appudu, akkada... na gang pani ayyiuntadhi

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...