Jump to content

Delhi lo Chakram Thipputhunna CBN !!!!


Recommended Posts

Posted
ఐక్యతా యత్నాలు కొలిక్కి?
20-05-2019 03:51:48
 
636939211060593736.jpg
  • కలిసి సాగేందుకు బీజేపీయేతర పార్టీలు సై
  • సోనియాతో చంద్రబాబు కీలక చర్చలు
  • రాహుల్‌, పవార్‌తో రెండో రోజూ భేటీ
  • లఖ్‌నవూ చర్చల సారాంశం వెల్లడి
  • మాయావతితో సయోధ్యకు సూచన!
  • సోనియా, రాహుల్‌తో నేడు మాయ భేటీ
  • నేడు మళ్లీ ఢిల్లీకి చంద్రబాబు
న్యూఢిల్లీ, మే 19 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఆయా పార్టీల మధ్య ఐక్యత సాధించేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న కసరత్తు క్రమంగా కొలిక్కి వస్తోంది. మోదీ మళ్లీ ప్రధాని కాకుండా అడ్డుకోవడానికి ఫలితాలకు ముందే విపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడడం అత్యావశ్యకమని దాదాపు అన్ని పార్టీలను అంగీకరింపజేశారు. ఇప్పటికే టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీతో మంతనాలు జరిపిన ఆయన.. మూడు రోజులుగా వివిధ పార్టీల కీలక నేతలతో చర్చించారు. చంద్రబాబు వరుసగా మూడోరోజు కూడా ఢిల్లీలో భేటీలతో బిజీబిజీగా గడిపారు. ఆదివారం ఆయన మళ్లీ రాహుల్‌ను కలిశారు. అనంతరం ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో భేటీ అయ్యారు. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాతోనూ కీలక మంతనాలు జరిపారు. లఖ్‌నవూలో శనివారం ఎస్పీ నేత అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో తాను జరిపిన చర్చల సారాంశాన్ని తెలియజేశారు.
 
 
ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్న మాయావతితో నేరుగా మాట్లాడాలని సోనియా, రాహుల్‌కు సూచించారు. మాయావతి సోమవారం వారిద్దరితో సమావేశం కానున్నారు. జాతీయ స్థాయిలో మోదీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి మిగతా పార్టీలతో కలిసి నడవడానికి ఎస్పీ, బీఎస్పీ నేతలూ సిద్ధంగా ఉన్నారని.. అయితే కొన్ని రాజకీయ అంశాలపై స్పష్టత కావాలని అఖిలేశ్‌, మాయావతి కోరుతున్నారని తెలిసింది. ప్రత్యామ్నాయ కూటమిపై వీరు సానుకూలంగా స్పందించారని, రాజకీయంగా కొన్ని అంశాల్లో ఆచితూచి అడుగువేయాల్సి ఉందని చంద్రబాబు.. సోనియా, రాహుల్‌కు చెప్పినట్లు సమాచారం.
 
బీజేపీయేతర పక్షాలు చీలకుండా అడ్డుకోవాలని, ఇందుకోసం ఎస్పీ, బీఎస్పీ ముఖ్య నేతలతో స్వయంగా చర్చలు జరిపితే బాగుంటుందని ఆయన సోనియాతో చెప్పినట్లు తెలిసింది. కాగా.. ఉదయం రాహుల్‌, పవార్‌లను కలిసి వచ్చాక చంద్రబాబు టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌ తదితరులతో చర్చలు జరిపారు. తర్వాత ఏచూరితో మధ్యాహ్న భోజనం సందర్భంగా చర్చించారు. రాహుల్‌ సన్నిహితుడు కొప్పుల రాజు కూడా వచ్చి బాబుతో చర్చించారు. అనంతరం ఆయన అమరావతికి తిరుగుపయనమయ్యారు. ఇతర పక్షాలతో మాట్లాడేందుకు చంద్రబాబు సోమవారం మళ్లీ ఢిల్లీ చేరుకోనున్నట్లు తెలిసింది. ముందుగానే కూటమి కడితే.. 23న ఫలితాలు వెలువడిన వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు తమనే ఆహ్వానించాలని రాష్ట్రపతి కోవింద్‌ను కోరేందుకు అవకాశం ఉంటుందని.. బాబు కృషి కూడా ఈ దిశగానే సాగుతోందని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.
 
 
నిన్నటిదాకా కస్సుబుస్సు
యూపీలో కాంగ్రెస్ ను తమ కూటమిలోకి చేర్చుకోకపోవడమేగాక శనివారం వరకు ఆ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన మాయావతి.. సోమవారం సోనియా, రాహుల్‌గాంధీతో భేటీ కానున్నారు! ఈ సమావేశం ఏర్పాటులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్‌ మద్దతు లేనిదే బీజేపీయేతర కూటమి అధికారంలోకి రావడం అసాధ్యమని మాయావతి కూడా గ్రహించారని.. అందుకే ఆ పార్టీ అగ్ర నేతలతో మంతనాలు జరపబోతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నిరుడు కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ ముగ్గురూ ఒకే వేదికపై కనిపించారు. ఆ తర్వాత కలుసుకోనుండడం ఇదే ప్రథమం.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...