Yaman02 Posted May 23, 2019 Report Posted May 23, 2019 హెరిటేజ్ ఫుడ్స్కు రూ. 20 కోట్ల లాభం ఈనాడు, హైదరాబాద్: హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.20.16 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. టర్నోవర్ రూ.635.03 కోట్లుగా నమోదైంది. 2017-18 ఇదేకాలంలో నికరలాభం రూ.19.85 కోట్లు, టర్నోవర్ రూ.561.63 కోట్లుగా ఉన్నాయి. దీని ప్రకారం నికరలాభంలో వృద్ధి నమోదు కాలేదు. టర్నోవర్ 13.07 శాతం పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి టర్నోవర్ అంతకు ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.2,373.42 కోట్ల నుంచి 5.95 శాతం వృద్ధితో రూ.2,514.75 కోట్లు నమోదైంది. నికరలాభం రూ.62.73 కోట్ల నుంచి రూ.82.59 కోట్లకు పెరిగింది. వాటాదార్లకు ఒక్కో షేర్కు 40 శాతం చొప్పున (రూ.5 ముఖ విలువ కల ఒక్కో షేర్పై రూ.2 చొప్పున) డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. ఈ ఏడాది ఆగస్టు 30న హైదరాబాద్ లో వాటాదార్ల వార్షిక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. డెయిరీ ఉత్పత్తుల విభాగంలో ఫ్రాన్స్కు చెందిన అగ్రగామి సంస్థ నొవాండి తో కలిసి ముంబయి సమీపంలో కొత్త యూనిట్ను హెరిటేజ్ ఫుడ్స్ ఏర్పాటు చేస్తోంది. విభిన్నమైన రుచులతో పెరుగు, తీపి పదార్ధాలు ఈ యూనిట్లో తయారు చేస్తారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.