AndhraneedSCS Posted June 8, 2019 Report Posted June 8, 2019 టీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు పిండ ప్రదానం 08-06-2019 13:15:13 హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12మంది ఎమ్యెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవడం అప్రజాస్వామికమని ఓయూ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎ్సలో చేరడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఓయూల్యాండ్ స్కేప్గార్డెన్లో ఓయూ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ ఆధ్వర్యంలో ఓయూ నిరుద్యోగ విద్యార్థులు ఎమ్మెల్యేలకు పిండ ప్రదానం చేశారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అప్రజాస్వామికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎ్సలో చేర్చుకున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్కు టీఆర్ఎ్సలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, తిరిగి ఎన్నికల్లో గెలిపించుకోవాలని సవాల్ విసిరార్.సమయం వచ్చినప్పుడుటీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు వెంకటేశ్ చౌహాన్, ఓరుగంటి కృష్ణ, తిరుపతి రెడ్డి, భవానీదాస్, జగన్నాథయాదవ్ తదితరులు పాల్గొన్నారు. Quote
AndhraneedSCS Posted June 8, 2019 Author Report Posted June 8, 2019 YCP to TDP vallaki kuda ee program chese pani Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.