Jump to content

Recommended Posts

Posted

Is-Sushma-Raj-Coming-As-AP-Governor-1560

ఆంధ్రప్రదేశ్ కు నూతన గవర్నర్ రాక ఖరారు  అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. చాలా కాలం నుంచి ఏపీకి  నరసింహన్ గవర్నర్ గా కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఎన్డీ తివారీ వివాదంలో చిక్కుకుని ఏపీ నుంచి వెళ్లిపోయిన దగ్గర నుంచి నరసింహనే గవర్నర్ గా కొనసాగుతూ వస్తున్నారు. ఆ తర్వాత అనేక  పరిణామాలు సంభించినా రాష్ట్ర విభజన జరిగినా  నరసింహన్ మాత్రం గవర్నర్ గా కొనసాగుతూ వస్తున్నారు.

 



రెండో సారి ఎన్డీయే సర్కారు ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు పలు మార్పలును చేపడుతున్నారట కమలనాథులు. అందులో భాగంగా ఏపీకి గవర్నర్ మార్పు గురించి కసరత్తు మొదలుపెట్టారట. కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఏపీకి నూతన గవర్నర్ గా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. వయసు  మీద పడటంతో ఈ సారి సుష్మా స్వరాజ్ ఎన్నికల్లోనే పోటీ చేయలేదు. ఆమె సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆమెకు గవర్నర్ పదవిని కేటాయిస్తూ ఉన్నారట కమలనాథులు. ఆమెకు ఏపీ బాధ్యతలు అప్పగించనున్నారట.

ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా సమాచారం వచ్చిందని భోగట్టా. అలాగే ఢిల్లీ వెళ్లిన గవర్నర్ నరసింహన్ కు కూడా ఈ సమాచారం ఇచ్చారని  తెలుస్తోంది.

అయితే ఇంతకీ నరసింహన్ తదుపరి పరిస్థితి ఏమిటనేది ఆసక్తిదాయకంగానే మిగిలింది. నరసింహన్ ను కనీసం తెలంగాణకు అయినా గవర్నర్ గా కొనసాగిస్తారా? లేక తెలంగాణకూ వేరే కొత్త గవర్నర్ వస్తారా? లేక సుష్మకే తెలంగాణ బాధ్యతలు అప్పగించి నరసింహన్ ను పూర్తిగా పక్కన పెడతారా? అనేవి ప్రస్తుతానికి శేష ప్రశ్నలే.

ఈ అంశాల గురించి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక సుష్మా స్వరాజ్ ఏపీకి గవర్నర్ రావడంతో జగన్ కు సానుకూలంగానే ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు పరిశీలకులు.

Posted

ఏపీ కొత్త గవర్నర్‌గా సుష్మస్వరాజ్... పరిశీలిస్తున్న కేంద్రం...?

Sushma Swaraj : తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ ఇప్పటికే చాలాకాలం కొనసాగారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా... అక్కడ కొత్త గవర్నర్‌ను తెచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.

 

వ్యక్తిగత కారణాలు గానీ, మరే కారణమైనా గానీ... ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా దూరంగా ఉండిపోయారు మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్. నిజానికి ఐదేళ్ల మోదీ పాలనలో తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించారు. అమెరికాతో సంబంధాలు, గల్ఫ్‌లో భారతీయులకు రక్షణ అంశాలు, ఐక్యరాజ్యసమితిలో భారత వాణి వినిపించడంలో ఆమె చురుకైన పాత్ర పోషించారు. భారతీయ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చి... యోగా డే వచ్చేలా చెయ్యడంలో సుష్మస్వరాజ్ పాత్ర ఎంతో ఉంది. మొత్తంగా పాజిటివ్ మార్కులు తెచ్చుకున్న ఆమె... రెండోసారి మోదీ ప్రభుత్వంలో లేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచే అంశం. అయినప్పటికీ ఆమెకు తగిన గుర్తింపు ఉండేలా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా నియమించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ కొనసాగుతున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా... అక్కడ కొత్త గవర్నర్‌ను నియమించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఆ పదవికి సుష్మస్వరాజ్ అయితే చక్కగా సెట్ అవుతారని బీజేపీ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. ఐతే... సుష్మ లాగే... లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్‌ కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలవలేదు. 75 ఏళ్లు దాటిన వారికి టికెట్ ఇవ్వకూడదన్న బీజేపీ కండీషన్ వల్ల సుమిత్ర పోటీ అవకాశం కోల్పోయారు. వాళ్లిద్దరీ సముచిత గౌరవం ఇవ్వాలన్న నిర్ణయంతో గవర్నర్లుగా నియమిస్తే బాగుంటుందని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పట్ల బీజేపీ పాజిటివ్‌గా ఉన్నప్పటికీ... మున్ముందు నిధుల కేటాయింపులు, ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం మొండి పట్టుదలకు వెళ్లే అవకాశం ఉందనీ, అలాంటి సమయంలో... ఆ ప్రభుత్వాన్ని కంట్రోల్‌లో పెట్టేందుకు ప్రత్యేకంగా గవర్నర్ ఉండాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే... త్వరలోనే సుష్మస్వరాజ్ ఏపీలో గవర్నర్‌గా అడుగుపెట్టే అవకాశాలున్నాయి.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...