Jump to content

Recommended Posts

Posted
 
జనవరి 26న రూ.15వేలు చేతిలో పెడతామంటూ జగన్ కీలక ప్రకటన
14-06-2019 11:52:32
636961104729330891.jpg
పెనుమాక: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘రాజన్న బడిబాట’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ పాల్గొని 2వేల మందితో ఒకేసారి సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ.. విద్యార్థులను బడులకు పంపించే దిశగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ‘మీ పిల్లల్ని బడులకు పంపించండి.. వారిని నేను చదివిస్తా’ అని సీఎం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగన్ కీలక ప్రకటన చేశారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగ దినంగా చేస్తామని జగన్ చెప్పారు.
 
 
జనవరి 26వ తేదీ నాటికి ఎవరైతే పిల్లలను బడులకు పంపిస్తారో.. ఆ ప్రతీ తల్లికి అదే జనవరి 26న రూ.15000 డబ్బును చేతిలో పెడతామని జగన్ ప్రకటించారు. జగన్ ఈ ప్రకటన చేయగానే సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ సాయం చేస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. రాజన్న బడిబాట కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు హోం మంత్రి మేకతోటి సుచరిత, విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...