snoww Posted June 20, 2019 Report Posted June 20, 2019 పోలవరంపై సీఎం జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే.. 20-06-2019 19:21:23 ప.గో. జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు పురోగతిపై అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలతో సమీక్ష జరిపి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు మీడియాకు వెల్లడించారు. కీలక నిర్ణయాలు ఇవే.. * 2021 జూన్ నాటికి పోలవరం పూర్తి.. * పోలవరం నిర్వాసితులకు పరిహారం ఆరు లక్షలు కాకుండా పది లక్షలు ఇవ్వాలని నిర్ణయం. * నవంబర్ వరకు గోదావరిలో నీరు ఉండే అవకాశం ఉండడం వలన, ఈ నాలుగు నెలలు ప్రత్యామ్నాయ పనులపై దృష్టి.. * కాపర్ డ్యాం వలన ముంపుకు గురయ్యే గ్రామాల నిర్వాసితులకు పునరావాసం * 113 గ్రామాల్లోని 28 వేల కుటుంబాలకు వీలైనంత త్వరగా ఈ ఏడాదిలోగానే పునరావాసం * పోలవరం ప్రాజెక్టుపై మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగానే ముందుకు.. * అధికారుల ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం.. అయితే కాపర్ డ్యాం పనులు కాకుండా స్పిల్ వే పూర్తి చేసి ఉంటే, సమయం చాలా కలిసి వచ్చేదని సీఎం జగన్ అభిప్రాయ పడ్డారని మంత్రులు అన్నారు. నిధులు ఎలా తీసుకురావాలో అన్ని తెలిసిన వ్యక్తి సీఎం అని, తాము పాజిటివ్ మూడ్తో ముందుకు వెళుతున్నామని చెప్పారు. నిపుణుల కమిటీ వెంటనే వేసి, ఆడిట్ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని జగన్ నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రులు తెలిపారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.